AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలం వాటర్‌ వార్‌లో ట్విస్ట్‌.. కేఆర్ఎంబీకి ఏపీ కంప్లైంట్‌.. ఇంతవరకు స్పందించని తెలంగాణ..

శ్రీశైలంపై మళ్లీ జగడం మొదలైంది. రెండు రాష్ట్రాలూ పవర్‌ జనరేషన్‌ చేస్తున్నా, తెలంగాణపై KRMBకి కంప్లైంట్‌చేసి వాటర్‌ వార్‌కి తెరలేపింది ఏపీ. ఇంతకీ, శ్రీశైలం పవర్‌ సెంటర్‌లో ఏం జరుగుతోంది?

శ్రీశైలం వాటర్‌ వార్‌లో ట్విస్ట్‌.. కేఆర్ఎంబీకి ఏపీ కంప్లైంట్‌.. ఇంతవరకు స్పందించని తెలంగాణ..
Srisailam Dam
Venkata Chari
|

Updated on: Oct 02, 2022 | 6:30 AM

Share

ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ జల జగడం రాజుకుంది. తెలంగాణపై మరోసారి KRMBకి కంప్లైంట్‌ చేసింది ఆంధ్రప్రదేశ్‌. నాగార్జునసాగర్‌కు నీటి అవసరాలు లేకపోయినప్పటికీ, శ్రీశైలంలో పవర్‌ జనరేషన్‌ చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తోందని ఫిర్యాదు చేసింది. ఒకవైపు, శ్రీశైలానికి ఇన్‌ఫ్లో తగ్గిపోవడం, మరోవైపు విద్యుదుత్పత్తి చేస్తుండటంతో జలాశయంలో నీటిమట్టం శరవేగంగా పడిపోతోంది. అయితే, KRMBకి ఏపీ కంప్లైంట్‌చేసి రెండ్రోజులవుతున్నా, ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్‌ రియాక్ట్‌ కాకపోవడమే ఆసక్తికరంగా మారింది. ఒకవైపు శ్రీశైలంలో ఏపీ పవర్‌ జనరేషన్‌ చేస్తూనే, మరోవైపు తెలంగాణపై KRMBకి కంప్లైంట్‌ చేయడంపై సీరియస్‌గా రియాక్టయ్యే అవకాశం కనిపిస్తోంది.

అయితే, ఏపీ వాదన మరోలా ఉంది. శ్రీశైలంలో రెండు రాష్ట్రాలూ పవర్‌ జనరేషన్‌ చేస్తున్నప్పటికీ, తన వాటాకి మించి తెలంగాణ వాడుకుంటోందని ఆంధ్రా అంటోంది. విద్యుదుత్పత్తిని చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తూ పెద్దమొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు, నాగార్జునసాగర్‌కు నీటి అవసరాలు లేని టైమ్‌లో పవర్‌ జనరేషన్‌ చేయడాన్ని ఆంధ్రా తప్పుబడుతోంది. మరి, ఏపీ కంప్లైంట్‌పై తెలంగాణ ఎప్పుడు రియాక్టవుతుందో? ఎలాంటి రియాక్షన్‌ ఇస్తుందోనన్నది ఉత్కంఠ రేపుతోంది. ప్రజెంట్‌ సీన్‌ చూస్తుంటే మాత్రం ఏపీ, తెలంగాణ మధ్య జలజగడం మళ్లీ ముదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయ్‌.