AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ప్రయాణికులూ అలర్ట్..! ఇకనుంచి స్టేషన్‌లో..

ఇండియన్ రైల్వేస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారతదేశం మొత్తంగా పర్యావరణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఇండిన్ రైల్వేస్ కూడా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైల్వే స్టేషన్‌లలో.. రైళ్లలలో ప్లాస్టిక్‌ను నిషేదిస్తూ.. తగిన నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మెటీరియల్‌ను బ్యాన్ చేస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి అమలు చేస్తున్నారని తెలిపింది ఇండియన్ రైల్వేస్. ఇప్పటికే ప్లాస్టిక్ […]

రైల్వే ప్రయాణికులూ అలర్ట్..! ఇకనుంచి స్టేషన్‌లో..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 23, 2019 | 2:53 PM

Share

ఇండియన్ రైల్వేస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారతదేశం మొత్తంగా పర్యావరణంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఇండిన్ రైల్వేస్ కూడా సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రైల్వే స్టేషన్‌లలో.. రైళ్లలలో ప్లాస్టిక్‌ను నిషేదిస్తూ.. తగిన నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మెటీరియల్‌ను బ్యాన్ చేస్తూ.. నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి అమలు చేస్తున్నారని తెలిపింది ఇండియన్ రైల్వేస్.

ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి ఇండియాలోని అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఐఆర్‌సీటీసీకి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రయాణికుల్లో విజ్ఞతను పెంచేలా తగు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సూచించారు. అలాగే.. ప్లాస్టిక్ బాటిళ్లను నలిపివేయడానికి వీలుగా రైల్వే స్టేషన్లలో మెషీన్లను కూడా ఏర్పాటు చేయాలని ఐఆర్‌సీటీసీని భారత రైల్వే సంస్థ ఆదేశించింది. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థగా ఇండియన్ రైల్వేస్ నిలిచింది.