AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిరుమల అన్యమత ప్రచారంపై మండిపడ్డ రాజాసింగ్

పవిత్ర పుణ్యక్షేత్రం.. హిందువుల ఆరాధ్యదైవం శ్రీవెంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారం మరోసారి కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ఇతర మతాలకు చెందిన ప్రకటనలు కనిపించడంతో భక్తులు ఖంగుతిన్నారు. ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ టికెట్ల వెనుక భాగంలో దర్శనమిచ్చాయి. దీంతో సదరు భక్తులు ఆ టికెట్‌కి సంబంధించిన ఫోటోస్ తీసి.. కంప్లైంట్ చేశారు. తిరుమల […]

తిరుమల అన్యమత ప్రచారంపై మండిపడ్డ రాజాసింగ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 23, 2019 | 1:14 PM

Share

పవిత్ర పుణ్యక్షేత్రం.. హిందువుల ఆరాధ్యదైవం శ్రీవెంకటేశ్వస్వామి కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో అన్యమత ప్రచారం మరోసారి కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ఇతర మతాలకు చెందిన ప్రకటనలు కనిపించడంతో భక్తులు ఖంగుతిన్నారు. ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ టికెట్ల వెనుక భాగంలో దర్శనమిచ్చాయి. దీంతో సదరు భక్తులు ఆ టికెట్‌కి సంబంధించిన ఫోటోస్ తీసి.. కంప్లైంట్ చేశారు. తిరుమల బస్సుల్లో జరిగిన అన్యమత ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బస్‌ టికెట్లపై జెరూసలెం, హజ్‌యాత్ర లకు సబంధించి సమాచారం ముద్రించడం వెనుక హిందూమతాన్ని అణిచివేయాలనే కుట్ర కనిపిస్తుందన్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని బాధ్యులను శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు రాజాసింగ్‌.