AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Ratna : భారతరత్న పొందిన పొందిన వ్యక్తులకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు ఏమిటీ..? ప్రైజ్ మనీ ఉంటుందా..?

Bharat Ratna : భారతరత్న దేశం అత్యున్నత పురస్కారం. ఇది సాధించిన తరువాత దేశంలో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లినా గౌరవ, మర్యాదలు పొందుతారు. కానీ ఈ పురస్కారం

Bharat Ratna : భారతరత్న పొందిన పొందిన వ్యక్తులకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు ఏమిటీ..? ప్రైజ్ మనీ ఉంటుందా..?
Bharat Ratna
uppula Raju
|

Updated on: Jul 28, 2021 | 9:13 AM

Share

Bharat Ratna : భారతరత్న దేశం అత్యున్నత పురస్కారం. ఇది సాధించిన తరువాత దేశంలో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్లినా గౌరవ, మర్యాదలు పొందుతారు. కానీ ఈ పురస్కారం సాధించడం ఎంత కష్టమో అందరికి తెలుసు. ఒక వ్యక్తి దీనిని పొందిన తర్వాత అతడికి ఇక ఎటువంటి పరిచయం అవసరం లేదు. ఈ అవార్డు దేశానికి చేసిన సేవ కోసం అందిస్తారు. కళలు, సాహిత్యం, ప్రజా సేవ, క్రీడలకు భారతరత్న అవార్డు ప్రకటిస్తారు. ఈ అవార్డును స్థాపించిన సమయంలో మరణానంతరం ఇవ్వడానికి నియమం లేదు. కానీ 1955 తరువాత దీనిని మరణానంతరం కూడా ఇచ్చే సంప్రదాయం ప్రారంభమైంది. అయితే ఈ అత్యున్నత పురస్కారం పొందిన వ్యక్తికి ప్రభుత్వం ఎటువంటి సదుపాయాలు కల్పిస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం.

1954 లో ప్రారంభమైంది ఈ అవార్డు ఇవ్వడం 1954 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి చాలా మంది ప్రముఖులకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. మాజీ అధ్యక్షుడు ఎపిజె అబ్దుల్ కలాంని కూడా ఈ అవార్డుతో సత్కరించారు. ఇవే కాకుండా సచిన్ టెండూల్కర్, పండిట్ భీమ్సేన్ జోషి, ప్రసిద్ధ శాస్త్రవేత్త సిఎన్ఆర్ రావుతో సహా పలువురు ప్రముఖులు ఈ గౌరవాన్ని పొందారు. భారతీయులు కాని వారిలో మదర్ థెరిసా, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, నెల్సన్ మండేలా భారత్ రత్న అవార్డులు అందుకున్నారు.

ప్రధాని సిఫార్సు చేస్తారు.. ఏ వ్యక్తికి భారతరత్న ఇవ్వాలనే సిఫారసును ప్రధాని.. రాష్ట్రపతికి సిఫార్స్ చేస్తారు. అప్పుడు రాష్ట్రపతి నుంచి అనుమతి పొందిన తరువాత ఆ వ్యక్తికి భారతరత్న ప్రదానం చేస్తారు. ఈ గౌరవం పొందిన ప్రజలకు ఈ క్రింది సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తాయి.

డబ్బు ప్రకటించదు.. భారతరత్న గ్రహీతలకు ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ ప్రకటిస్తారు. దీనితో పాటు ఒక ఆకు ఆకారాన్ని పోలి ఉండే ట్యాగ్ అతనికి అందిస్తారు. భారతరత్నానికి లభించే పతకంపై సూర్యుడి గుర్తు ఉంటుంది. హిందీలో దానిపై భారతరత్న అని, వెనకాల అశోక చిహ్నంతో సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. ఈ పురస్కారంతో నగదు బహుమతి ఉండదు. భారతరత్న వంటి ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీతలకు భారత ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది. ఇందులో భారతరత్న పొందిన వ్యక్తి రైల్వేలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది కాకుండా ఢిల్లీ ప్రభుత్వం బస్సు సర్వీసును కూడా ఉచితంగా అందిస్తుంది.

అధ్యక్ష పదవిలో ఉంటారు.. భారత్ రత్న అందుకున్న వ్యక్తికి ప్రభుత్వం ‘వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్సీ’లో స్థానం ఇస్తుంది. ఇది ఒక రకమైన ప్రోటోకాల్. భారతరత్న అవార్డు గ్రహీత విజిటింగ్ కార్డులో గౌరవం పేరు రాసుకోవచ్చు.

Wasim Akram: ఇండియాను చూసి నేర్చుకోండి.. ఆ దేశం ఏం చేయాలో అదే చేస్తుంది. పాక్‌ మాజీ ఆటగాడు అక్రమ్‌ సంచలన వ్యాఖ్యలు.

Maoist Martyrs: నిశ్శబ్దంగా దండకారణ్యం.. ఏజెన్సీలో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు

నిజామాబాద్ జిల్లాలో ‘అత్తిలి సత్తి’… సుమంగళి వ్రతాల పేరిట మహిళలకు మస్కా.. నిట్టనిలువునా దోచేశాడు