AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jackfruit in Summer: వేసవిలో పనస పండు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..?

వేసవిలో శరీరానికి చలువ చేసే ఆహారాలను తీసుకోవడం ఎంత ముఖ్యమో.. శరీరాన్ని వేడెక్కించే కొన్ని ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటించడం కూడా అంతే అవసరం. అలాంటిదే పనస పండు కూడా.. సాధారణంగా పనస ఆరోగ్యానికి మంచిదని చాలా మందికి నమ్మకం. అయితే వేసవిలో మాత్రం దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Jackfruit in Summer: వేసవిలో పనస పండు తినడం ఆరోగ్యానికి మంచిదేనా..?
Jack Fruit
Prashanthi V
|

Updated on: Apr 09, 2025 | 10:41 PM

Share

పనస పండులో చక్కెరలతో పాటు కార్బోహైడ్రేట్లు, కాలరీలు అధికంగా ఉంటాయి. వేసవి కాలంలో శరీరం వేడిగా మారి పనితీరు మారుతుంది. ఈ సమయంలో అధిక కాలరీలు తీసుకుంటే శరీరంలో కొవ్వు నిల్వగా మారే అవకాశం ఉంటుంది. తద్వారా బరువు పెరిగే ప్రమాదం ఉంది. బరువు నియంత్రణలో ఉంచాలనుకునే వారికి ఇది ఇబ్బందిగా మారుతుంది.

వేసవిలో శరీరం వేడిగా మారుతుంది. పనస పండు తిన్న తర్వాత కొందరికి జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పచ్చి పనసకాయ లేదా ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు, కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు రావొచ్చు. గరిష్ట వేడి వాతావరణంలో ఈ సమస్యలు తీవ్రంగా ఉంటాయి.

కొందరికి పనస తిన్న తర్వాత శరీరంపై దురద, వాపు, చర్మంపై చారలు రావడం, కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది పనసపై ఉండే సహజ రసాయనాలకు శరీరం అలెర్జీగా స్పందించినప్పుడు జరుగుతుంది. అలెర్జీకి గురయ్యే వారెవరైనా ఉంటే పనసను పూర్తిగా నివారించడం ఉత్తమం.

పనస పండులో సహజంగా ఉండే చక్కెర మోతాదులు చాలా ఎక్కువ. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెంచే అవకాశాన్ని కలిగిస్తుంది. మధుమేహం ఉన్నవారు పనస పండును తీసుకోవడం వల్ల గ్లూకోస్ స్థాయిలు వేగంగా పెరిగిపోవచ్చు. కనుక డయాబెటిక్ పేషెంట్లు దాన్ని డాక్టరు సలహాతో మాత్రమే తీసుకోవాలి.

ఏదైనా ఆపరేషన్‌కు ముందు లేదా తర్వాత పనస పండును తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని వేడి చేసే విధంగా పనిచేస్తాయి. ఈ సమయంలో పనస తినడం వల్ల జీర్ణవ్యవస్థలో సమస్యలు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు రావొచ్చు.

పనసలో పొటాషియం మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా ఆరోగ్యానికి మంచిదే. అయితే కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారికి పొటాషియం ఎక్కువగా తీసుకోవడం ప్రమాదం కలిగిస్తుంది. ఇది శరీరంలోని మినరల్స్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. కాబట్టి కిడ్నీ వ్యాధులు ఉన్న వారు పనస పండును పూర్తిగా నివారించాలి.

పనస పండు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నా.. వేసవిలో దీన్ని జాగ్రత్తగా మాత్రమే తీసుకోవాలి. మితంగా తీసుకుంటే ఇది మంచిదే కానీ.. ఎక్కువగా తింటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో శరీరానికి చలువ చేసే పండ్లు, కూరగాయలు, ద్రవాలు వంటి వాటికే ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. ఎటువంటి ఆహారాన్ని అయినా తినే ముందు అది ఆరోగ్యంపై చూపే ప్రభావాలను తెలుసుకొని తీసుకోవడం మంచిది.