Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alzheimer: అల్జీమర్స్‌ వ్యాధిని అరికట్టేందుకు మరో ముందడుగు.. తాజా పరిశోధనలో సరికొత్త విషయాలు..

ప్రస్తుత కాలంలో చాలామందిని అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒత్తిడి, జీవనశైలి, ఆహారం ఇలా ఎన్నో విషయాలను అనారోగ్యం బారిన పడేలా చేస్తున్నాయి. మనుషులను వేధిస్తున్న అనేక రోగాలలో అల్జీమర్స్ మహమ్మారి కూడా ఒకటి.

Alzheimer: అల్జీమర్స్‌ వ్యాధిని అరికట్టేందుకు మరో ముందడుగు.. తాజా పరిశోధనలో సరికొత్త విషయాలు..
Alzheimer
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 01, 2022 | 1:32 PM

ప్రస్తుత కాలంలో చాలామందిని అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒత్తిడి, జీవనశైలి, ఆహారం ఇలా ఎన్నో విషయాలను అనారోగ్యం బారిన పడేలా చేస్తున్నాయి. మనుషులను వేధిస్తున్న అనేక రోగాలలో అల్జీమర్స్ మహమ్మారి కూడా ఒకటి. దీని ప్రభావంతో మానసిక సమస్యలు పెరిగి జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. క్రమంగా ఇది మనిషి మెదడుపై ప్రభావం చూపి వైకల్యానికి దారితీస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ బయోటెక్ కంపెనీలు ఈసాయ్ – బయోజెన్ సంయుక్తంగా కీలక ఔషధాన్ని అభివృద్ధి చేశాయి. ఇరు సంస్థలు అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక ఔషధం.. ప్రారంభ దశలో అల్జీమర్స్‌తో బాధపడుతున్న రోగులలో జ్ఞాపకశక్తి, ఆలోచన క్షీణత రేటును తగ్గించడంలో కొంత విజయాన్ని ప్రదర్శించినట్లు తెలిపాయి.

ఇధి నిజమైతే, కొత్త ఔషధం ప్రపంచవ్యాప్తంగా పదిలక్షల మందిని ప్రభావితం చేసే వ్యాధి పురోగతిని మొదటిసారిగా సైన్స్ మట్టుపెట్టగలదని పేర్కొంటున్నారు.

ఏళ్లుగా ఎనిగ్మా సమస్య.. 

ఇవి కూడా చదవండి

100 సంవత్సరాలకు పైగా చిత్తవైకల్యం అత్యంత సాధారణ రూపమైన అల్జీమర్స్ గురించి సైన్స్‌కు అధికారికంగా తెలుసు. ఇంకా ఈ కాలమంతా వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. తగిన చికిత్స మాత్రం అందుబాటులో లేదు. ఈ వ్యాధిని1906లో డాక్టర్ అలోయిస్ అల్జీమర్ మొదటిసారిగా గుర్తించారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది.

చికిత్సను పక్కన పెడితే, అల్జీమర్స్ వ్యాధి ఖచ్చితమైన స్వభావం, ఇతరులకు వ్యతిరేకంగా కొంతమందిని ఎందుకు ప్రభావితం చేస్తుంది అనే దానిపై కూడా గణనీయమైన పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి.

సరళంగా చెప్పాలంటే ప్రస్తుతానికి ఈ పరిస్థితిని నయం చేయడానికి సైన్స్‌ పరంగా ఎన్నో విషయాలు తెలియాల్సి ఉంది.

ఈ ఔషధంతో మంచి ఫలితాలు..

Eisai – Biogen సంస్థలు అభివృద్ధి చేసిన ఔషధం.. అల్జీమర్స్ కు చికిత్స చేయడానికి అభివృద్ధి చేసిన మొదటి ఔషధ చికిత్స కానప్పటికీ.. ఇది గుర్తించదగిన ఫలితాలను చూపించిన మొదటిదని కంపెనీలు పేర్కొన్నాయి.

వార్తా నివేదికల ప్రకారం.. అల్జీమర్స్ రోగులకు సంబంధించిన జ్ఞానం 18 నెలల తర్వాత 27 శాతం తగ్గింది. ప్లేసిబో చికిత్సలో ఉంచబడిన రోగుల సమూహంతో పోలిస్తే ఇది మెరుగైన ఫలితమని పేర్కొంటున్నారు.

స్టేజ్ 3 ట్రయల్‌లో దాదాపు 1,800 మందికి లెకనెమాబ్ అనే ప్రయోగాత్మక ఔషధాన్ని వారానికి రెండుసార్లు అందించారు.

సుదీర్ఘ ప్లాట్‌ఫాం అవసరం..

అల్జీమర్స్ మహమ్మారిని ఓడించడానికి ఇది మంచి మార్గమని చెప్పనప్పటికీ.. ఫలితాలు మాత్రం కొంత ఆసక్తి కలిగిస్తున్నాయ. ఈ మందు ఇచ్చిన వారిలో ఐదవ వంతు మందిని ప్రభావితం చేసిన దుష్ప్రభావాలతో పాటు (మెదడు వాపుతో సహా) పలు వాటిపై పోరాడి చికిత్స అందిస్తుంది. అయితే మార్కెట్లోకి అంత దొందరగా రాదన్న విషయాన్ని గమనించాలి.

Eisai – Biogen ఈ ఏడాది చివరి నాటికి యూరప్, అమెరికాలో నియంత్రణ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్నాయి. రెగ్యులేటరీ అడ్డంకులు క్లియర్ అయిన తర్వాత ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఔషధానికి నిధులు సమకూర్చాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సి ఉంది. అది అందుబాటులోకి వచ్చిన తర్వాత దానికి ఎవరు అర్హులు అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఈ ఔషధం ద్వారా నివేదించిన, గుర్తించదగిన కొన్ని విషయాలను, విస్తృతంగా అన్వేషణల అనంతరం ఆమోదించనున్నారు. సుధీర్ఘ వైద్య ప్రమాణాల తర్వాత దీనికి క్లీన్ చిట్ దొరుకుతుందని పేర్కొంటున్నారు.

Source Link

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి