H3N2 Virus: మనుషులను బలి తీసుకుంటున్న కొత్త వైరస్‌.. ఆ రాష్ట్రాల్లో రెండు మరణాలు నమోదు.

కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఇంకా మరిచిపోకముందే మరో మాయదారి రోగం ప్రజలపై దండెత్తడానికి వస్తోంది. హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా ఫ్లూ.. బారిన పడుతోన్న వారి సంఖ్య దేశంలో పెరిగిపోతోంది. సాధారణ జ్వరం, జలుబుగా మొదలైన ఈ వ్యాధి మనిషి ప్రాణాలను...

H3N2 Virus: మనుషులను బలి తీసుకుంటున్న కొత్త వైరస్‌.. ఆ రాష్ట్రాల్లో రెండు మరణాలు నమోదు.
H3n2 Virus
Follow us

|

Updated on: Mar 10, 2023 | 2:13 PM

కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఇంకా మరిచిపోకముందే మరో మాయదారి రోగం ప్రజలపై దండెత్తడానికి వస్తోంది. హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా ఫ్లూ.. బారిన పడుతోన్న వారి సంఖ్య దేశంలో పెరిగిపోతోంది. సాధారణ జ్వరం, జలుబుగా మొదలైన ఈ వ్యాధి మనిషి ప్రాణాలను బలితీసుకునే స్థాయికి చేరుకుంది. ఈ వైరస్‌ కారణంగా దేశంలో ఇద్దరు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది.

హెచ్3ఎన్2 వైరస్ కారణంగా హర్యానాలో తొలి మరణం సంభవించిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. కర్ణాటకలో కూడా మరో​ వ్యక్తి ఇదే వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది. చనిపోయిన వ్యక్తి హసన్‌ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. ఇదిలా ఉంటే బాదితులు జ్వరం, దగ్గు, శ్వాస కోశ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరారు. ఇక ఈ వైరస్‌ విషయంలో తెలుగు రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. విశాఖపట్నంలో ఈ వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది ఏపీ వైద్య శాఖ ప్రకటించింది.

ఈ లక్షణాలతో ఉన్న పిల్లల్ని స్కూళ్లకి పంపొద్దని అధికారులు ఆదేశించారు. ఇక ఈ వైరస్‌ లక్షణాల విషయానికొస్తే.. జ్వరం, జలుబు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ ఫ్లూ లక్షణాలు ఒకటి నుంచి నాలగు రోజుల్లో తెలిసిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే హెచ్‌3ఎన్‌2 ఇన్‌ఫ్లూయెంజా బారిన పడిన వారికి చికిత్సలో యాంటీబయాటిక్స్‌ ఉపయోగించవద్దని ఐసీఎంఆర్ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..