AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Diet: డయాబెటిస్‌ రోగులు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో వీటిని అస్సలు తీసుకోకూడదు..!

మధుమేహం ఉంటే ఆహార నియమాలు తప్పక పాటించాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల పొరపాటు అస్సలు చేయకూడదు. చాలా మంది ఉదయం పూట సరిగ్గా తినరు. తప్పు ఆహారం తినండం లేదంటే వేళకాని వేళలో తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో చాలా సేపు ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు..

Diabetes Diet: డయాబెటిస్‌ రోగులు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో వీటిని అస్సలు తీసుకోకూడదు..!
Diabetes Diet
Srilakshmi C
|

Updated on: Aug 06, 2024 | 1:33 PM

Share

మధుమేహం ఉంటే ఆహార నియమాలు తప్పక పాటించాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని రకాల పొరపాటు అస్సలు చేయకూడదు. చాలా మంది ఉదయం పూట సరిగ్గా తినరు. తప్పు ఆహారం తినండం లేదంటే వేళకాని వేళలో తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో చాలా సేపు ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా ఈ కింది ఆహారాలను బ్రేక్‌ఫాస్ట్‌లో అస్సలు తీసుకోకూడదు. ఒక వేళ వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి షుగర్ పేషెంట్లు ఉదయం అల్పాహారం తినేటప్పుడు ఎలాంటి పొరపాట్లకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..

మధుమేహ వ్యాధిగ్రస్తులు స్నాక్స్‌లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఉంచుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలోని అదనపు చక్కెరను గ్రహిస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. మీరు ఓట్స్, క్వినోవా, పిండి రొట్టె, ఉడికించిన శనగలు వంటివి ఆహారంలో తీసుకోవాలి.

అల్పాహారంలో కేవలం తృణధాన్యాలు మాత్రమే తీసుకోకూడదు. పండ్లు, కూరగాయల ముక్కలను కూడా తీసుకోవాలి. చపాతీ లేదా బ్రెడ్ తినేటప్పుడు కూరగాయలతో చేసిన కూరలను ఉంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

అల్పాహారంలో పిండితో కూడిన ఆహారాన్ని తీసుకోకూడదు. లూచీ, పరాటా, కచూరి, బ్రెడ్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి. బిస్కెట్లు, కేకులు కూడా తినకూడదు. అలాగే బంగాళదుంపలతో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ కార్న్‌ఫ్లేక్స్, ఫ్రూట్ జ్యూస్ తీసుకోవద్దు. కార్బోహైడ్రేట్లు తక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే షుగర్ ఫుడ్స్ పూర్తిగా మానుకోవాలి.

అల్పాహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్ పని చేయడానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. చాలా సేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. అలాగే బరువును అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనే భయం కూడా ఉండదు. ఉడికించిన శనగలు, గుడ్లు, పప్పులు వంటి ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తినవచ్చు.

అల్పాహారంలో పండ్ల రసాలను తీసుకోకూడదు. షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవచ్చు. పండ్ల రసాన్ని తీసుకునే బదులు బొప్పాయి, యాపిల్ వంటి పండ్లను ఆహారంలో తీసుకోవాలి. తాజా పండ్లలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మీరు బాదం, వాల్‌నట్ వంటి గింజలను కూడా తినవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?