AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US woman: అమెరికా మహిళ కేసులో ఊహించని ట్విస్ట్‌..! ఇనుప గొలుసులతో తానే చెట్టుకు కట్టేసుకుందట! నివ్వెరబోయిన ఖాకీలు

మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అటవీప్రాంతంలో చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టేసి, అధ్వాన స్థితిలో కనిపించిన 50 యేళ్ల అమెరికా మహిళ కేసు ఊహించని ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. చెట్టుకు ఇనుప గొలుసులతో తనకుతానే బంధించుకుందని, ఇతరుల ప్రమేయం లేదని సదరు మహిళ పోలీసులకు వెల్లడించింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త, కుటుంబం కూడా లేదని తెలిపింది..

US woman: అమెరికా మహిళ కేసులో ఊహించని ట్విస్ట్‌..! ఇనుప గొలుసులతో తానే చెట్టుకు కట్టేసుకుందట! నివ్వెరబోయిన ఖాకీలు
US Woman Found In Maharashtra Jungle
Srilakshmi C
|

Updated on: Aug 06, 2024 | 11:51 AM

Share

ముంబై, ఆగస్టు 6: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని అటవీప్రాంతంలో చెట్టుకు ఇనుప గొలుసుతో కట్టేసి, అధ్వాన స్థితిలో కనిపించిన 50 యేళ్ల అమెరికా మహిళ కేసు ఊహించని ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. చెట్టుకు ఇనుప గొలుసులతో తనకుతానే బంధించుకుందని, ఇతరుల ప్రమేయం లేదని సదరు మహిళ పోలీసులకు వెల్లడించింది. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, తనకు భర్త, కుటుంబం కూడా లేదని తెలిపింది. ప్రస్తుతం రత్నగిరిలోని ఓ మానసిక ఆస్పత్రిలో మహిళ చికిత్స పొందుతుంది. సోమవారం (ఆగస్టు 5) పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

జులై 27వ తేదీన మహారాష్ట్ర సింధుదుర్గ్‌ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఇనుప గొలుసులతో చెట్టుకు కట్టివేసి ఉన్న మహిళను ఓ గొర్రెల కాలరి గుర్తించాడు. ఆకలితో అలమటిస్తూ, వర్షంలో తడిసి నీరసించిపోయిన స్థితిలో మహిళ కనిపించింది. ఆమె ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని, ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త గంటల వ్యవధిలోనే దేశ మంతటా దావానంలా వ్యాపించింది. దీంతో సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. ఈ క్రమంలో సింధుదుర్గ్ పోలీసులు శనివారం (ఆగస్టు 3) మహిళ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆమె మూడు తాళాలు, ఇనుప గొలుసును తెచ్చుకుంది. ముంబైకి 460 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో తాళాల్లో ఒకదానితో తానకు తానే గొలుసులతో చెట్టుకు కట్టేసుకుని తాళం వేసుకుంది. అనంతరం తాళం చెవిని తనకు కొన్ని మీటర్ల దూరంలో విసిరేసింది. ఆ తాళాలను పోలీసులు కనుగొన్నారు. అయితే, ఆ చెట్టుకు కట్టేసుకొని ఎన్ని రోజులుగా ఆమె అక్కడ ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని సింధూదుర్గ్‌ పోలీసులు వెల్లడించారు.

విచారణలో ఆమె తల్లి ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలిసిందన్నారు. కానీ, ఇప్పటివరకు ఆమె కుటుంబ సభ్యులెవరూ తమను సంప్రదించలేదన్నారు. ఆమె ఉన్నట్లుండి భయభ్రాంతులకు గురవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రత్నగిరిలోని మానసిక ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమెను అటవీ ప్రాంతం నుంచి రక్షించిన తర్వాత ఆమె బ్యాగ్‌లో ఓ లేఖను పోలీసులు గుర్తించారు. అందులో తన మాజీ భర్త ఇందుకు కారణమని పేర్కొంది. అయితే ఆమె మాజీ భర్త పేరు అందులో పేర్కొనలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తు మొదలుపెట్టారు. అలాగే ఆమె పేరు లలితా కయీ కుమార్‌ (50) అని ఆమె వద్ద ఉన్న అమెరికా పాస్‌పోర్ట్ ఫోటోకాపీ ద్వారా తెలుసుకున్నారు. దీనితోపాటు తమిళనాడు చిరునామాతో కూడిన ఆధార్ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె వద్ద గడువు ముగిసిన వీసా కాపీ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?