Virata Parvam: విరాటపర్వం రివ్యూ ఇచ్చేసిన డీజే టిల్లు.. ఓ కళాఖండం చూసి మంత్రముగ్ధుడయ్యానంటూ..
నిన్న రాత్రి విరాటపర్వం సినిమా చూసి మంత్రముగ్దుడయ్యాను.. రానా, సాయి పల్లవి ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా కనిపించారు.
డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న విరాట పర్వం (Virata Parvam) సినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి. 1990లో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమా ఏ రెంజ్లో ఉండబోతుందనేది విషయాన్ని తెలియజేశాయి. నక్సల్స్ నేపథఅయంలో వస్తోన్న ఈ మూవీలో నక్సలైట్ రవి శంకర్ అలియాస్ రవన్న పాత్రలో రానా కనిపించనుండగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇందులో ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా గడిపేస్తుంది. తాజాగా విరాటపర్వం సినిమాపై రివ్యూ ఇచ్చేశారు యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ.
” నిన్న రాత్రి విరాటపర్వం సినిమా చూసి మంత్రముగ్దుడయ్యాను.. రానా, సాయి పల్లవి ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా కనిపించారు. విరాటపర్వం చక్కటి కళాఖండం.. చాలా ఉత్సాహంగా ఉంది.. ఈ చిత్రయూనిట్ కు అభినందనలు. ” అంటూ ట్విట్ చేశాడు సిద్దూ జొన్నలగడ్డ. విరాట పర్వం సినిమా ద్వారా ఓ అందమైన ప్రేమకథను చూపించబోతున్నామని.. వెన్నెల జీవితమే ఈ సినిమా అంటూ గతంలో చిత్రయూనిట్ చెప్పిన సంగతి తెలిసిందే.
ట్వీట్..
Watched #virataparvam last night and man was i spellbound. @RanaDaggubati and @Sai_Pallavi92 transform you into a universe u ve never seen before and still make u root for them. @venuudugulafilm sir , #virataparvam is a Fine piece of art. Cheering for @RanaDaggubati and the team!
— Siddhu Jonnalagadda (@Siddu_buoy) June 11, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.