AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shruti Haasan: అయ్యో శ్రుతి హాసన్‏కు ఏమైంది.. ఫ్యాన్స్ షాకయ్యే ఫోటో షేర్ చేసిన హీరోయిన్..

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇటీవలే తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుంది శ్రుతి. ఈ క్రమంలోనే తాజాగా శ్రుతి హాసన్ పోస్ట్ చేసిన ఫోటో చూసి అభిమానులు షాకవుతున్నారు. ఆమెకు ఏమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Shruti Haasan: అయ్యో శ్రుతి హాసన్‏కు ఏమైంది.. ఫ్యాన్స్ షాకయ్యే ఫోటో షేర్ చేసిన హీరోయిన్..
Shruti Haasan
Rajitha Chanti
|

Updated on: Mar 03, 2023 | 7:17 AM

Share

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న హీరోయిన్లలో శ్రుతి హాసన్. క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంటూ సత్తా చాటుతుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన మోస్ట్ అవైటెట్ చిత్రం సలార్ లో నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో ఇటీవలే తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుంది శ్రుతి. ఈ క్రమంలోనే తాజాగా శ్రుతి హాసన్ పోస్ట్ చేసిన ఫోటో చూసి అభిమానులు షాకవుతున్నారు. ఆమెకు ఏమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తన ఇన్ స్టా స్టోరీలో శ్రుతి షేర్ చేసిన ఫోటోలో మోకాళ్ల వద్ద చర్మం ఎర్రగా మారిపోయి కనిపిస్తుంది. మోకాళ్ల వద్ద అంత ఎర్రగా మారిపోవడం అంటే ఏదైనా కష్టమైన పని చేసిందని తెలుస్తోంది. తన కాళ్ల పిక్ షేర్ చేస్తూ.. గుడ్ డే ఎట్ వర్క్ అంటూ రాసుకొచ్చింది. కాళ్లు కందిపోయేలా సెట్‏లో అంతగా కష్టపడినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియలేదు. ప్రస్తుతం శ్రుతి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ పలు ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇవే కాకుండా శ్రుతి ఓ ఇంటర్నేషనల్ సినిమాలోనూ నటిస్తోంది. ది ఐ పేరుతో వస్తున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజులుగా గ్రీస్ లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.