AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ilaiyaraja: కోర్టులో ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ టీమ్‌కు చుక్కెదురు.. ఇళయ రాజాకు రాయల్టీగా ఎంత చెల్లించారంటే?

ఈ ఏడాది విడుదలైన మలయాళ సూపర్ హిట్ సినిమాల్లో ‘మంజుమ్మేల్ బాయ్స్’ ఒకటి. తెలుగులోనూ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాపై సంగీత దిగ్గజం మ్యాస్ట్రో ఇళయ రాజా ఒక కేసు వేశారు. ఈ సినిమాలో వాడిన 'కణ్మణి..' పాట హక్కు లు తమకే చెందుతుందని వాదించారు. ఇప్పుడు కోర్టులో ఇళయరాజా గెలిచారు

Ilaiyaraja: కోర్టులో 'మంజుమ్మెల్ బాయ్స్' మూవీ టీమ్‌కు చుక్కెదురు.. ఇళయ రాజాకు రాయల్టీగా ఎంత చెల్లించారంటే?
Ilaiyaraaja
Basha Shek
|

Updated on: Aug 05, 2024 | 8:37 PM

Share

ఈ ఏడాది విడుదలైన మలయాళ సూపర్ హిట్ సినిమాల్లో ‘మంజుమ్మేల్ బాయ్స్’ ఒకటి. తెలుగులోనూ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాపై సంగీత దిగ్గజం మ్యాస్ట్రో ఇళయ రాజా ఒక కేసు వేశారు. ఈ సినిమాలో వాడిన ‘కణ్మణి..’ పాట హక్కు లు తమకే చెందుతుందని వాదించారు. ఇప్పుడు కోర్టులో ఇళయరాజా గెలిచారు. నివేదికల ప్రకారం మంజుమ్మేల్ బాయ్స్ చిత్ర బృందం ఇళయరాజాకు రూ.60 లక్షలు చెల్లించినట్లు సమాచారం. ‘మంజుమ్మెల్ బాయ్స్’ కథ సాగోడు గుణ గుహ నేపథ్యంలో సాగుతుంది. అయితే ‘గుణ’ సినిమాలో వాడిన ‘కణ్మణి..’ పాటను కూడా ఈ చిత్ర బృందం ఉపయోగించుకుంది. దీనికి సంగీత సంస్థ నుంచి సమ్మతి కూడా పొందారు. అయితే ఆయనకు ఇళయరాజా సమ్మతి లభించలేదు. దీంతో ఇళయరాజా కోర్టులో కేసు వేసి టీమ్ రెండు కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2 కోట్ల పరిహారం ఇవ్వాలని ఇళయరాజా డిమాండ్ చేశారు. ఇప్పుడు ‘మంజుమ్మెల్ బాయ్స్’ టీమ్ 60 లక్షల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది.

‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ టీమ్‌ ఈ పాట హక్కులు తమకే దక్కాయని కోర్టులో వాదించారు. ఈ పాటను ఉపయోగించుకునే హక్కును సంగీత సంస్థ నుంచి పొందామని చిత్ర బృందం తరఫు న్యాయవాది తెలిపారు. దీనిపై ఇళయరాజా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలపై ఆయనకు కూడా హక్కులు ఉన్నాయి. కానీ సినిమాలో ఈ పాటను ఉపయోగించేందుకు ఇళయరాజా ‘మంజుమ్మెల్ బాయ్స్’ టీమ్‌కి ఎలాంటి సమ్మతి ఇవ్వలేదు. ఇప్పుడు ‘మంజుమ్మెల్ బాయ్స్’ టీమ్ ఇళయరాజ్‌కి 60 లక్షల రూపాయలను రాయల్టీ రూపంలో అందించినట్లు సమాచారం..

ఇవి కూడా చదవండి

గతంలో ఇళయరాజా ‘కూలీ’ సినిమా టీమ్‌పై కూడా కేసు పెట్టారు. ‘వా వా పక్కం వా..’ పాట హక్కులను తన సొంతం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ పాట హక్కులను సోనీ సొంతం చేసుకున్నట్లు తర్వాత తెలిసింది. ఇంతకుముందు కూడా ఇళయరాజా ఇలా చాలా కేసులు పెట్టారు.

రూ. 2కోట్లు డిమాండ్ చేసిన ఇళయ రాజా.. రూ. 60 లక్షలు చెల్లించిన మంజుమ్మెల్ బాయ్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.