AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: అటు ప్రభాస్ కోసం.. ఇప్పుడు మహేష్ కోసం తెలుగులోకి వస్తోన్న మలయాళీ స్టార్ .. త్రివిక్రమ్ సినిమాలో ఆ హీరో స్పెషల్ రోల్..

ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అలాగే ఇందులో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది.

Mahesh Babu: అటు ప్రభాస్ కోసం.. ఇప్పుడు మహేష్ కోసం తెలుగులోకి వస్తోన్న మలయాళీ స్టార్ .. త్రివిక్రమ్ సినిమాలో ఆ హీరో స్పెషల్ రోల్..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Oct 03, 2022 | 10:42 AM

Share

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అలాగే ఇందులో మరో హీరోయిన్ కూడా ఉన్నట్లుగా గత కొద్దిరోజులుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు నెట్టింట పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మాట వినిపిస్తుంది.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ మూవీలో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ అతిథి పాత్రలో నటించనున్నారట. ఇప్పటికే ఆయనతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరుపుతుందని.. అటు పృథ్వీరాజ్ కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రానుంది. మరోవైపు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రంలోనూ పృథ్వీరాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే చిత్రం ఇప్పటివరకు జక్కన్న తెరకెక్కించిన చిత్రాలకు మించి ఉండనున్నట్లు ఇటీవల రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.