AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adhurs Movie: భట్టు, చారి మళ్లీ వచ్చేస్తున్నారు.. రీరిలీజ్‏కు సిద్ధమైన ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ క్రేజీ హీట్ ‘అదుర్స్’..

ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబోలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో చారిగా తారక్.. భట్టు పాత్రలో బ్రహ్మానందం కామెడీకి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాలో నయనతార, షీల హీరోయిన్లుగా నటించగా.. నాజర్, తనికెళ్ల భరణి, అలీ, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే కీలకపాత్రలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్

Adhurs Movie: భట్టు, చారి మళ్లీ వచ్చేస్తున్నారు.. రీరిలీజ్‏కు సిద్ధమైన ఎన్టీఆర్ ఎవర్ గ్రీన్ క్రేజీ హీట్ 'అదుర్స్'..
Adhurs Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 09, 2023 | 8:37 AM

ప్రస్తుతం కొత్త సినిమాల కంటే రీరిలీజ్ చిత్రాలకే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద అలరించిన చిత్రాలనే ఇప్పుడు మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోస్ పుట్టినరోజు లేదా మరేదైనా ప్రత్యేకమైన రోజులలో వారికి సంబంధించిన సినిమాలను 4కె వెర్షన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అలా రీరిలీజ్ అయిన సినిమాలకు భారీగా కలెక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు డిజాస్టర్స్ అయిన చిత్రాలు ఇప్పుడు మళ్లీ విడుదలై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్ ఇలా అందరి సినిమాలు మరోసారి రీరిలీజ్ అయ్యి ఎక్కువగానే కలెక్షన్స్ రాబట్టాయి. ఇక ఇప్పుడు మరో ఎవర్ గ్రీన్ క్రేజీ హిట్ రీరిలీజ్ కాబోతుంది. అదే అదుర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభియం చేసిన ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్, బ్రహ్మానందం కాంబోలో ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇందులో చారిగా తారక్.. భట్టు పాత్రలో బ్రహ్మానందం కామెడీకి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాలో నయనతార, షీల హీరోయిన్లుగా నటించగా.. నాజర్, తనికెళ్ల భరణి, అలీ, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే కీలకపాత్రలు పోషించారు. ఈ బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ లో రీరిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మరోసారి బిగ్ స్క్రీన్ పై భట్టు, చారి ప్రేక్షకులను నవ్వించనున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

ప్రస్తుతం తారక్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జనతా గ్యారెజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత తారక్, కొరటాల శివ కాంబోలో వస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే చాలా కాలం తర్వాత ఈ సినిమాలో తారక్ ఊరమాస్ లుక్ లో కనిపించనుండడంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.