Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు అనారోగ్యం.. ఆందోళనలో అభిమానులు..

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయ యాత్రలో భాగంగా అవిశ్రాంతంగా అవిశ్రాంతంగా పర్యటనలు చేస్తుండడం, దీనికి తోడు ఉపవాస దీక్ష పాటిస్తుండడంమతో పవన్‌ ఇబ్బంది పడుతున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి.

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు అనారోగ్యం.. ఆందోళనలో అభిమానులు..
Pawan Kalyan
Follow us
Basha Shek

|

Updated on: Jul 05, 2023 | 7:36 PM

జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయ యాత్రలో భాగంగా అవిశ్రాంతంగా అవిశ్రాంతంగా పర్యటనలు చేస్తుండడం, దీనికి తోడు ఉపవాస దీక్ష పాటిస్తుండడంమతో పవన్‌ ఇబ్బంది పడుతున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావారి జిల్లా పెద అమిరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో పవన్‌ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కారణంగా ఈరోజు (జూన్ 27) ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలో నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాతే ఈ భేటీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ అనారోగ్యానికి గురయ్యారని తెలియగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే స్వల్ప ఇబ్బంది మాత్రమే ఉన్నట్లు పార్టీ వర్గాలు స్పష్టతనివ్వడంతో కాస్త కుదుట పడ్డారు. కాగా ఇటీవల వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్‌ ఆ వెంటనే వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాను చుట్టేసిన ఆయన ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. పవన్‌ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. సముద్ర ఖని దర్శకత్వంలో పవన్‌ నటిస్తోన్న బ్రో జులై 28న విడుదల కానుంది. ఇందులో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ మరో హీరోగా నటిస్తున్నాడు. ఈరోజు విడుదలైన పవన్‌, సాయి తేజ్‌ల పోస్టర్‌కు విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ‘బ్రో’ తో పాటు సుజిత్‌ దర్శకత్వంలో ‘ఓజీ’, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌, క్రిష్‌ దర్శకత్వంలో హరిహరవీరమల్లు మూవీస్‌లో నటిస్తున్నారు పవన్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..