Kantara OTT: సెన్సేషనల్ మూవీ కాంతార ఓటీటీకి వచ్చేసింది.. కానీ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు

నేడు (24న ) కాంతారా మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Kantara OTT: సెన్సేషనల్ మూవీ కాంతార ఓటీటీకి వచ్చేసింది.. కానీ  ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు
Kantara
Follow us

|

Updated on: Nov 24, 2022 | 4:03 PM

మోస్ట్ ఏవైటెడ్ మూవీ కాంతార ఓటీటీకి వచ్చేసింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కాంతార సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసింది. ఈ రోజు నుంచి (24న ) కాంతారా మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సుమారు 16కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 400కోట్ల రూపాయలను వసూల్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఐఏండిబి భారతదేశంలోని ప్రస్తుత టాప్ 250 చిత్రాల జాబితాలో  కాంతార మొదటి స్థానంలో నిలిచింది. కన్నడలో రిలీజ్ తరువాత దాదాపు 15 రోజులకు ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల తన సత్తాను చాటుకుంది.కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా పై పలు విమర్శలు కూడా వచ్చాయి.

ఈ సినిమాకు హైలైట్ క్లామాక్స్.. రిషబ్ శెట్టి నటన చివరిలో వచ్చే పాట సినిమాను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తాయి. అయితే చివరిలో వచ్చే వరాహ రూపం పాట పై అభ్యంతరం వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ సాంగ్ మ్యూజిక్ కాపీ చేసిందంటూ కేరళకు చెందిన మ్యూజిక్ బ్రాండ్ తుక్కుడం బ్రిడ్జ్ ఆరోపించింది. ఐదేళ్ల క్రితం తమ బ్రాండ్ రూపొందించిన నవరసం సాంగ్ మ్యూజిక్ మాదిరిగానే వరాహారూపం సాంగ్ ఉందంటూ.. కాపీ రైట్స్ చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించారు. దాంతో ఈ పాటను యూట్యూబ్ నుంచి కూడా తొలగించారు.

ఇవి కూడా చదవండి

తాజాగా ఓటీటీలో విడుదలైన  ఈ సినిమాలో క్లైమాక్స్ లో పాటను మార్చేశారు. ఆ పాట ట్యూన్ ను ఛేజ్ చేశారు. అలాగే మ్యూజిక్ కూడా మార్చేశారు. థియేటర్స్ లో ఆ మ్యూజిక్ వింటుంటే ఒళ్ళు గగ్గుర్పొడిచేది. కానీ ఓటీటీలో ఆ మ్యూజిక్ లేకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఓటీటీలోనూ కాంతార సినిమా మంచి వ్యూస్ ను రాబడుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..