AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: చదువులోనూ ఈ హీరోయిన్ తోపే.. ఎంబీబీఎస్ మార్కులు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

సాధారణంగా సినీరంగంలో చాలా మంది మెడిసిన్ చదివినవారే. డాక్టర్ చదువులు చదివి.. నటనపై ఆసక్తితో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. సాయి పల్లవి, శ్రీలీల, కామాక్షి భాస్కర్ల వంటి హీరోయిన్స్ వైద్య విద్యను అభ్యసించినవారే. తాజాగా ఓ హీరోయిన్ తన ఎంబీబీఎస్ మార్కుల జాబితాను షేర్ చేసింది. అందులో ఆమె మార్కులు చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

Actress: చదువులోనూ ఈ హీరోయిన్ తోపే.. ఎంబీబీఎస్ మార్కులు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
Manushi Chiller
Rajitha Chanti
|

Updated on: Jan 19, 2026 | 10:53 AM

Share

ప్రస్తుతం సినిమా ప్రపంచంలో సెటిల్ అయిన నటీనటులు గతంలో వేరే రంగాల్లో స్థిరపడినవారే. మరికొందరు గ్రాడ్యుయేషన్ కాగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఈ గ్లామర్ ప్రపంచంలో ఎక్కువగా మెడిసిన్ చదివినవారే ఉన్నారు. వైద్య విద్యను అభ్యసించి.. ఇప్పుడు సినిమాల్లో సెటిల్ అయ్యారు. సాయి పల్లవి, శ్రీలీల వంటి స్టార్స్ ఎంబీబీఎస్ చదివిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ తన ఎంబీబీఎస్ మార్కుల జాబితాను షేర్ చేసింది. ఆమె మరెవరో కాదు.. మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్. తాజాగా తన పాత జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. “2026 ఈజ్ ది న్యూ 2016” అనే ట్రెండ్ లో భాగంగా ఆమె తన 2016 నాటి మెడికల్ కాలేజీ రిపోర్ట్ కార్డును అభిమానులతో పంచుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

ఆ సంవత్సరం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని.. ఒకేసారి ఎంబీబీఎస్ చదువు.. మిస్ ఇండియా పోటీల మధ్య నలిగిపోయానని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ కాలేజీలో చదువుతున్నప్పుడే తనను మిస్ ఇండియా నిర్వాహకులు గుర్తించారని తెలిపింది. క్లాసులు అయిపోగానే శనివారం పోటీల కోసం తీసుకున్న ఫస్ట్ ఫోటోస్ అని అన్నారు. అటు చదువుకుంటూనే ఇటు యాడ్ క్యాంపెయిన్ చేశానని.. సర్జరీ విభాగంలో మొదటి క్లినికల్ పోస్టింగ్ కూడా అప్పుడే జరిగిందని తెలిపారు. కేవలం మిస్ ఇండియా పోటీల కోసమే ఇన్ స్టాలోకి అడుగుపెట్టానని.. పదేళ్ల తర్వాత కూడా ఇక్కడే ఉండిపోయానని అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

2017లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. ఆ త్రవాత 17 ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత భారత్ కు ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించారు. మానుషి చిల్లర్ హిందీ, తెలుగు భాషలలో పలు చిత్రాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీ ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

Follow Us