AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2026: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త..! బడ్జెట్‌లో కొత్త పథకం..? ప్రతీఒక్కరికి అందనున్న బెనిఫిట్

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. దీంతో బడ్జెట్‌లో ఎలాంటి ఊరట కలిగించే విషయాలు ఉంటాయనేది ఇప్పటినుంచే చర్చనీయాంశంగా మారింది. ట్యాక్సుల్లో మినహాయింపులు ఏమైనా ఉంటాయా అనేది హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే ఈ సారి బడ్జెట్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారికి కేంద్రం గుడ్‌న్యూస్ తెలపనుంది.

Union Budget 2026: దేశ ప్రజలందరికీ కేంద్రం భారీ శుభవార్త..! బడ్జెట్‌లో కొత్త పథకం..? ప్రతీఒక్కరికి అందనున్న బెనిఫిట్
Union Budget 2026 27
Venkatrao Lella
|

Updated on: Jan 19, 2026 | 9:58 AM

Share

2026 బడ్జెట్‌లో దేశ ప్రజలకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాన్యులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కీలక నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్‌ల్లో మార్పులతో పాటు ఫిక్స్ డ్ డిపాజిట్ చేసేవారికి మరింత బెనిఫిట్ జరిగేలా పన్ను మినహాయింపులు ఇవ్వనున్నారని సమాచారం. భారత్‌లో ఎక్కువమంది ఫిక్స్ డ్ డిపాజిట్ల ద్వారా డబ్బులు పొదుపు చేసుకుంటారు. వీటి ద్వారా వచ్చే వడ్డీ కేవలం ఆదాయంగానే కాకుండా ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్తుకు భరోసాగా దేశ ప్రజలు భావిస్తారు. గత కొన్ని సంత్సరాలుగా ఇటువంటి ఆదాయంపై పన్ను మినహాయింపులు మారలేదు. వైద్య, రోజువారీ, మిగతా ఖర్చులు పెరుగతున్న క్రమంలో వీటిల్లో అధిక మినహాయింపులు ఇవ్వాలనే డిమాండ్లు ప్రజల నుంచి గత కొంతకాలంగా వస్తున్నాయి.

ఫ్లెక్సీ ఎఫ్‌డీ

ఫిక్స్ డ్ డిపాజిట్ రూపంలో పెట్టుబడి పెట్టేవారికి మరింత లాభం జరిగేలా బడ్జెట్‌లో కేంద్రం నిర్ణయం తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఈ సారి బడ్జెట్‌లో ఫ్లెక్సీ ఎఫ్‌డీ స్కీమ్‌ను కొత్తగా మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. దీని ద్వారా ఎఫ్‌డీ ద్వారా వచ్చే త్రైమాసిక వడ్డీని తిరిగి మళ్లీ పెట్టుబడి పెట్టే అవకాశం లభించనుందని తెలుస్తోంది. అలాగే ఎఫ్‌డీ ముందుగా ఉపసంహరించుకోవాలంటే ఇప్పటివరకు విధించే ఛార్జీలను రద్దు చేయనున్నారు. ఇక యూపీఐ యాప్స్ ద్వారా చేసే డిజిటల్ ఎఫ్‌డీలకు సెక్షన్ 80 సీ ప్రకారం పన్ను మినహాయింపుల ఉండే అవకాశముందని తెలుస్తోంది.

సీనియర్ సిటిజన్లకు ఊరట

ఇక ఇప్పటివరకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80TTA కింద సినియర్ సిటిజన్లకు రూ.50 వేలకు పన్ను మినహాయింపు ఉంది. ఈ బడ్జెట్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే సీనియర్ సిటిజన్లకు ఇచ్చే పన్ను మినహాయింపు పరిమితిని రూ.లక్షకు పెంచనున్నారని తెలుస్తోంది. ఇక రూ.15 లక్షల్లోపు ఎఫ్‌డీ చేసే సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ చెల్లించేలా బడ్జెట్‌లో నిర్ణయాలు ఉండొచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ క్రెడిట్ అనే కొత్త వ్యవస్థను ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది. దీని ద్వారా 3 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కవ పరిమితి గల ఎఫ్‌డీలపై రూ.2 లక్షల వరకు వచ్చే ఆదయాంపై 30 శాతం వరకు పన్ను మినహాయింపు ఉండొచ్చు.

ఇక MSMEలకు చౌక ధరకే లోన్లు

ఇక చిన్న కంపెనీలకు చవక వడ్డీ రేటుకే రుణాలు అందించనున్నారు. 2026 బడ్జెట్‌లో ఈ నిర్ణయం ప్రకించనున్నారు. కేవలం 9 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుకే MSMEలకు రుణాలు ఇచ్చే అవకాశముంది.