Godavari Movie: ‘గోదావరి’ మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందో అస్సలు ఊహించలేరు..

అలాంటి వారిలో నీతూ చంద్ర ఒకరు. ఈ పేరు అసలే తెలియదు జనాలకు. కానీ గోదావరి సినిమాలో సుమంత్ మరదలు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ఈ మూవీలో రాజీ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది నీతూ చంద్ర. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి చిత్రం 2006 మే 19న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

Godavari Movie: 'గోదావరి' మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందో అస్సలు ఊహించలేరు..
Godavari Movie
Follow us

|

Updated on: Aug 23, 2024 | 12:36 PM

తెలుగు సినీ పరిశ్రమలో కొందరు తారలు మొదటి సినిమాతోనే ఫేమస్ అయిపోతుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంటారు. కానీ ఆ తర్వాత అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమవుతారు. అలాంటి వారిలో నీతూ చంద్ర ఒకరు. ఈ పేరు అసలే తెలియదు జనాలకు. కానీ గోదావరి సినిమాలో సుమంత్ మరదలు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ఈ మూవీలో రాజీ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది నీతూ చంద్ర. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి చిత్రం 2006 మే 19న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ సూపర్ హిట్ కూడా. ఇందులో హీరోగా సుమంత్.. హీరోయిన్‏గా కమలినీ ముఖర్జీ నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పటికీ గోదావరి సినిమా క్లాసిక్ సూపర్ హిట్. ఈ మూవీలోని సాంగ్స్ కూడా శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో సుమంత్ మరదలిగా.. పల్లెటూరి అమ్మాయి రాజీ పాత్రలో కనిపించింది హీరోయిన్ నీతూ చంద్ర. ఈ సినిమాలో అల్లరి అమ్మాయిగా.. అమాయకమైన మరదలిగా కనిపించి తెలుగు అడియన్స్ మనసులలో స్థానం సంపాదించుకుంది. నీతూ చంద్ర 1984 జూన్ 20న బీహార్ లోని పాట్నాలో జన్మించింది. గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2003లో విష్ణువు అనే తెలుగు సినిమాతోనే సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ మూవీ తర్వాత 2005లో గరం మసాలా అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాల్లో నటించిన నీతూ చంద్రకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ 2006లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన గోదావరి సినిమాతోనే పాపులర్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ నీతూకు అవకాశాలు రాలేదు. తెలుగు, తమిళం, హిందీలో పలు సినిమాల్లో నటించిన నీతూ చంద్ర.. 2021లో హాలీవుడ్ నెవర్ బ్యాక్ డౌన్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. నీతూ చంద్ర మల్టీటాలెంటెడ్. అంతేకాదు.. ఆమె కరాటేలో బ్లాక్ బెల్డ్. చిన్నప్పుడే కరాటే, తైక్వాండో వంటి పోరాట విద్యలు నేర్చుకుంది. 2018లో ప్రో కబడ్డీ లీగ్ లో పాట్నా పైరేట్స్ కు నీతూ కమ్యూనిటీ అంబాసిడర్ గా మారింది. ప్రస్తుతం వ్యాపార రంగంలో బిజీగా ఉంది. అలాగే ఇటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది. తాజాగా నీతూ షేర్ చేసిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.