రుక్మిణి వసంత్ నవ్వితే కుర్రాళ్లు ఫిదా అవ్వాల్సిందే.. 

18 June 2026

Pic credit - Instagram

Rajeev 

రుక్మిణి వసంత్.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.బీర్బల్ ట్రైలాజీ కేసు 1: ఫైండింగ్ వజ్రముని అనే సినిమాతో అరంగేట్రం చేసింది.

ఆతర్వాత ఆమె నటించిన సప్త సాగరాలు దాటి: సైడ్‌ ఏ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. 

దాంతో రుక్మిణి వసంత్ మంచి గుర్తింపుతో పాటు క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే

నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

కానీ ఈ సినిమా ఎప్పుడొచ్చిందో.. ఎప్పుడు పోయిందో కూడా ప్రేక్షకులకు తెలియదు. ఆతర్వాత తెలుగులో సినిమా చేయలేదు.

కన్నడలో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది రుక్మిణి. కాంతార 1 సినిమాలో నటించి భారీ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదలై ఆకట్టుకుంది.