జాహ్నవి తిరిగొస్తుందా? జ్ఞాని తిమ్మప్ప సంచలన వ్యాఖ్యలు
కాకినాడ జిల్లా తునిలో రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యం 10 రోజులుగా మిస్టరీగా కొనసాగుతోంది. వందలాది మంది పోలీసులు, NDRF, SDRF బృందాలు అత్యాధునిక డ్రోన్లు, థర్మల్ డ్రోన్లతో అడవిని జల్లెడ పడుతున్నా చిన్నారి ఆచూకీ దొరకలేదు. పెంపుడు శునకం అనుమానాస్పదంగా మృతి చెందడం, కొండచిలువ చిన్నారిని మింగి ఉండవచ్చన్న కోణం కేసులో మరింత సంక్లిష్టతను పెంచింది.
జిల్లా ఎస్పీ బిందు మాధవ్ దర్యాప్తు పురోగతిని సమీక్షించి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని ఎవరూ తీసుకెళ్లలేదని, అడవి జంతువులు లాక్కెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పాప అదృశ్యమైన రోజు కురిసిన భారీ వర్షం కారణంగా కొట్టుకుపోయి ఉండవచ్చన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో కీలకమైన పెంపుడు కుక్క పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు, తెలంగాణకు చెందిన జ్ఞాని తిమ్మప్ప చిన్నారి అర్ధరాత్రి క్షేమంగా తిరిగి వస్తుందని, దేవతామూర్తులే ఆమెను వదిలి వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు మాత్రం శాస్త్రీయ దర్యాప్తు ద్వారానే ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి
వాచ్మెన్ రూంలో వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే.. గుండె జారిపోయింది
ఏంది సామీ ఇదీ.. మీరు డాక్టర్లా..మంత్రగాళ్లా..!
ఆ సరిహద్దుల్లోకి వెళ్లకండి.. చాటింపు వేసి చెబుతున్న అధికారులు
కాకినాడలో లవ్ జీహాద్ కలకలం.. ఒకరితో పెళ్లి.. ఆరుగురితో సహజీవనం
అమెరికాలో తెలుగు పెళ్లి.. ఆన్లైన్లోనే పెద్దల ఆశీస్సులు!

