Rashmika Mandanna: రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా.. న్యాచురల్ బ్యూటీ మిస్ అయిన మూవీ అదే..

ఇటీవలే యానిమల్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాలతో బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉంటే.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేయాల్సిన ఓ సినిమాతో రష్మిక హిట్ అందుకుంది. ఆ సినిమాతోనే కథానాయికగా వెండితెరపై పరిచయమై ఇప్పుడు అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా ?

Rashmika Mandanna: రష్మికకు కలిసొచ్చిన సాయి పల్లవి సినిమా.. న్యాచురల్ బ్యూటీ మిస్ అయిన మూవీ అదే..
Rashmika, Sai Pallavi
Follow us

|

Updated on: Apr 20, 2024 | 3:32 PM

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా ఫుల్ ఫాంలో దూసుకుపోతుంది హీరోయిన్ రష్మిక మందన్నా. పుష్ప సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. దీంతో అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ నార్త్ అడియన్స్‏ను ఆకట్టుకుంటుంది. ఇటీవలే యానిమల్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాలతో బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉంటే.. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి చేయాల్సిన ఓ సినిమాతో రష్మిక హిట్ అందుకుంది. ఆ సినిమాతోనే కథానాయికగా వెండితెరపై పరిచయమై ఇప్పుడు అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా ?.. అదే కిరిక్ పార్టీ. నిజానికి ఈ సినిమాకు ముందుగా అనుకున్నది సాయి పల్లవిని. కిరిక్ పార్టీ సినిమాతో రష్మిక మందన్న స్టార్ అయిపోయింది. మొదటి సినిమాతోనే హిట్ కొట్టి వరుసగా హిట్లు అందుకుంటుంది.

డివైన్ స్టార్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కిరిక్ పార్టీ చిత్రం 2016లో విడుదలైంది. రక్షిత్ శెట్టి, పుష్కర్ మల్లికార్జునయ్య, జిఎస్ గుప్తా కలిసి దాదాపు రూ. 4 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించారు. ఇందులో రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న, సంయుక్త హెగ్డే, ప్రమోద్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. కొత్త హీరోయిన్ తో చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు. ఆమె కంటే ముందుగా ఈ మూవీలో కథానాయికగా సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారు. ఈ విషయాన్ని గతంలో రక్షిత్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

కానీ సాయి పల్లవి కాకుండా కిరిక్ పార్టీలో రష్మిక కథానాయికగా ఎంపికైందని అన్నాడు. ఈ మూవీలో రష్మిక, రక్షిత్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత రష్మికకు చాలా ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి గీతా గోవిందం మూవీతో సూపర్ హిట్ అందుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.