AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదెక్కడి మేకోవర్ రా మావ..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఉదయ్ కిరణ్ హీరోయిన్

చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో కొన్ని సినిమాలకే పరిమితం అవుతుంటారు. కొన్ని సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఉదయ్ కిరణ్ నటించిన

ఇదెక్కడి మేకోవర్ రా మావ..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఉదయ్ కిరణ్ హీరోయిన్
Uday Kiran
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2025 | 8:12 AM

Share

దివంగత నటుడు ఉదయ్‌ కిరణ్‌ తన కెరీర్ లో ఎక్కువగా లవ్ అండ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ లోనే  నటించాడు. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఉదయ్. స్టార్ హీరోగా ఎదుగుతాడు అనుకునే తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్ లో 2008లొ వచ్చిన ప్రేమ కథా చిత్రం గుండె ఝల్లుమంది. గతేడాది అనారోగ్యంతో కన్నుమూసిన దర్శకుడు మదన్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఉదయ్ కిరణ్ సరసన బాలీవుడ్‌ బుల్లితెర బ్యూటీ అదితీ శర్మ నటించింది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా. అయినా ఎంతో చక్కగా నటించిందీ అందాల తార. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. అదితీ అందం, అభినయానికి అప్పటి కుర్రకారు ఫిదా అయిపోయారు. గుండె ఝల్లుమంది తర్వాత ఓం శాంతి అనే మల్టీ స్టారర్‌ మూవీలో కనిపించింది అదితి. ఇందులో నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్ వంటి నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. ఈ సినిమాకు కూడా ప్రశంసలు వచ్చాయి తప్పితే కమర్షియల్‌ గా విజయం సాధించ లేదు. దీని తర్వాత బబ్లూ అనే ఓ సినిమాలోనూ నటించింది అదితి. ఇది కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగమ్మకు అవకాశాలు కరువయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?

ఆతర్వాత కొన్ని పంజాబీ, హిందీ సినిమాల్లో నూ నటించింది. మొత్తం మీద తెలుగు, హిందీ, పంజాబీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 12కి పైగా చిత్రాలలో నటించింది అదితీ శర్మ. కాగా 2014లో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ‘సర్వర్ ఆహుజా’ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది అదితీ శర్మ. ఈ దంపతులకు 2019లో సర్తాజ్ అనే కుమారుడు జన్మించాడు. కాగా పెళ్లి తర్వాత కేవలం పంజాబీ సినిమాలకే పరిమితమంది అదితి. అలాగే టీవీ షోస్ లోనూ మెరుస్తోంది. వీటితో పాటు తన భర్త బిజినెస్‌ పనులను కూడా చూసుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార.

ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి