AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi- Dasari: చిరంజీవి, దాసరి మధ్య నిజంగానే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదా..? అసలు నిజం ఇదే..!

'చిరంజీవి నా ప్రాంతం వాడు.. పైగా నాకు బంధువు అవుతాడు. మా మేనల్లుడిని ఆయన పిన్నమ్మకి ఇచ్చి పెళ్లి చేశాం. అలాంటిది చిరంజీవిని నేనెందుకు టార్గెట్ చేస్తా' అని మెగాస్టార్ గురించి పలు సందర్భాల్లో గొప్పగా చెప్పారు దాసరి నారాయణ రావు.

Chiranjeevi- Dasari: చిరంజీవి, దాసరి మధ్య నిజంగానే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేదా..? అసలు నిజం ఇదే..!
Dasari Narayana Rao, Chiranjeevi
Praveen Vadla
| Edited By: |

Updated on: Apr 24, 2026 | 6:24 PM

Share

టాలీవుడ్ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇద్దరూ లెజెండ్స్.. ఎవరి ప్రయాణంలో వాళ్లు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వాళ్ళ ప్రయాణం గురించి ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. ఒకరు నటనలో శిఖరాగ్రానికి చేరుకుంటే, మరొకరు దర్శకత్వంలో తిరుగులేని ముద్ర వేశారు. అయితే వీళ్లిద్దరి మధ్య ఇండస్ట్రీలో తీవ్రస్థాయిలో విబేధాలు ఉండేవని అప్పట్లో కోడై కూసేవారు. ఒకానొక దశలో వీరిద్దరి మధ్య మాటలు కూడా లేవని, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత కోల్డ్ వార్ నడిచేదని ప్రచారం జరిగింది. కానీ ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమేనని, వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనదని వారి ప్రవర్తనే ఎప్పటికప్పుడు నిరూపిస్తూ వచ్చింది. ఈ పుకార్లకు ప్రధాన కారణం ఇండస్ట్రీలోని అప్పటి సమీకరణాలే.

దాసరి నారాయణ రావు ఎక్కువగా నందమూరి తారకరామారావు, అలాగే మంచు మోహన్ బాబు వంటి వాళ్ళతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళ కాంబినేషన్లలో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. మోహన్ బాబు అయితే దాసరిని తన గురువుగా బాహాటంగానే ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో, దాసరి వారి వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, చిరంజీవి ఎదుగుదలను ఆయన అంతగా ఆస్వాదించడం లేదని.. అందుకే చిరుతో ఆయనకు పెద్దగా సన్నిహిత సంబంధాలు లేవని అప్పట్లో సినీ విశ్లేషకులు సైతం చర్చించుకునేవారు. ఈ విబేధాల ప్రచారానికి ఆజ్యం పోసిన మరో ముఖ్య ఘట్టం ‘లంకేశ్వరుడు’ సినిమా. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన 100వ చిత్రంగా లంకేశ్వరుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.

చిరంజీవి హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంపై అప్పట్లో ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఫ్లాప్ తర్వాత చిరంజీవి, దాసరి మధ్య దూరం మరింత పెరిగిందని.. ఆ ఎఫెక్ట్ తోనే భవిష్యత్తులో వీళ్ళు కలిసి పనిచేసే అవకాశమే లేదని ఇండస్ట్రీ కోడై కూసింది. సరిగ్గా ఇలాంటి విమర్శలు, పుకార్లు తారాస్థాయికి చేరుకున్న సమయంలోనే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. చిరంజీవి కెరీర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన కొండవీటి దొంగ సినిమా 100 రోజుల వేడుకకు దాసరి నారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపైకి వచ్చి చిరంజీవికి తన చేతుల మీదుగానే సగర్వంగా షీల్డ్ అందజేశారు. ఆ వేదిక మీద వాళ్ళిద్దరి మధ్య కనిపించిన ఆత్మీయత, పరస్పర గౌరవం చూసి అప్పటివరకు కథలు అల్లిన నోళ్లన్నీ మూతపడ్డాయి.

ఇవి కూడా చదవండి

ఆ ఒక్క వేడుకతో తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఏ ఒక్క మాట మాట్లాడకుండానే తమ చేతలతో నిరూపించారు. ఇక ఆ తర్వాత కొన్నేళ్లకు వీళ్లిద్దరి బంధాన్ని మరింత బలోపేతం చేసిన సినిమా హిట్లర్. వరుస పరాజయాలతో ఉన్న చిరంజీవికి ఇది ఒక రకంగా సెకండ్ ఇన్నింగ్స్ లాంటి అత్యంత కీలకమైన ప్రాజెక్ట్. అలాంటి బౌన్స్ బ్యాక్ సినిమాలో చిరంజీవికి తండ్రిగా నటించడానికి దాసరి నారాయణ రావు అంగీకరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. హిట్లర్ సాధించిన ఘన విజయం చిరంజీవికి ఎంత ముఖ్యమో, వారిద్దరి మధ్య ఉన్న బంధం పుకార్లకు అతీతమైనదని నిరూపించడానికి కూడా అంతే ముఖ్యం. ఇండస్ట్రీలో కాలానుగుణంగా వచ్చే విమర్శలకు వాళ్లు తమదైన శైలిలో ఇచ్చిన పర్ఫెక్ట్ కౌంటర్ ఇది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us