మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథానాయకుడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా మధ్యతరగతి వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్వయంకృషితో.. ఎన్నో సవాళ్లను, అవమానాలను ఎదుర్కొని నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. నటనపై అమితమైన ఇష్టం. నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆరాటంతో అడ్డంకులను దాటుకుని హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. చెన్నైలోని మద్రాసు ఫిల్మ్ ఇన్‎స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత 1978 పునాది రాళ్లు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. కానీ ప్రాణం ఖరీదు సినిమా ముందుగా రిలీజ్ అయ్యింది. చిరంజీవి మొదటగా తీసుకున్న రెమ్యునరేషన్ రూ. 1,116. మనవూరి పాండవులు సినిమాతో చిరంజీవికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఇప్పటివరకు దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించారు. ఇంకా నటిస్తూనే ఉన్నారు. 1983లో వచ్చిన ఖైదీ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మూవీతో చిరంజీవి క్రేజ్ మారిపోయింది. తొలినాళ్లలో ‘సుప్రీమ్ హీరో’గా పేరు సంపాదించుకున్నారు చిరంజీవి. ఆ తర్వాత ‘మెగాస్టార్’ బిరుదు అందుకున్నారు. 1988లో ‘మరణ మృదంగం’తో చిరంజీవి.. మెగాస్టార్‌గా మారారు..

ఇంకా చదవండి

Rajinikanth-Chiranjeevi: చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా.?

సినీరంగంలో సినిమాలు తారుమారు అవడం కామన్. మొదట ఓ హీరో చేయాల్సిన సినిమా.. మరో హీరో చేసి హిట్టు కొట్టడం.. వెరీ కామన్. అయితే ఇలాంటి కామన్‌ విషయం కారణంగానే ఇప్పుడు మెగాస్టార్ చిరు, సూపర్ స్టార్ రజినీకాంత్ పేర్లు నెట్టింట మార్మోగుతున్నాయి. చిరు నో చెప్పిన సినిమాతో.. రజినీ హిట్టు కొట్టారని.. ఇప్పుడో క్రేజీ త్రో బ్యాక్ స్టోరీగా... సోషల్ మీడియాలో తిరుగుతోంది. అందర్నీ ఒక్క నిమిషం షాకయ్యేలా చేస్తోంది.

Chiranjeevi: ఏంటీ..! చిరంజీవి పెద్ద కూతురు హీరోయిన్‌గా చేసిందా..! డైరెక్టర్ ఎవరో తెలుసా.?

ఇప్పటికి కూడా యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. అలాగే ఆయన ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి వచ్చారు. నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చారు.

Film News: పవన్ ఓజి నుంచి మరో అప్‌డేట్.. లెటర్ రాసిన దేవర..

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కితున్న ఓజి నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న లక్కీ భాస్కర్ నుంచి వీడియో సాంగ్ విడుదల అయింది. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.  కేంద్ర ప్రభుత్వం హోం శాఖ అరుదైన గౌరవం అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న. 

Chiranjeevi: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మెగాస్టార్ చిరంజీవి.. కోటి విరాళం చెక్కు అందజేత

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ను ప్రత్యేకంగా కలిశారు. శనివారం (అక్టోబర్ 11) హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ. కోటి రూపాయల చెక్ ను చంద్రబాబుకు అందజేశారు చిరంజీవి.

Vishwambhara Teaser Live: దసరా వేళ చిరంజీవి ‘విశ్వంభర’ ప్రభంజనం.. టీజర్ అదిరిపోయిందిగా..

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న విశ్వంభర సినిమా ప్రభంజనం మొదలైంది.. దసరా కానుకగా.. చిరంజీవి విశ్వంభర టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. సరిగ్గా శనివారం ఉదయం 10.49 నిమిషాలకు విశ్వంభర టీజర్ ను విడుదల చేశారు.

2025 Movies: హాలిడేస్ లో షూటింగ్స్ హంగామా.! మన హీరోలకి మాత్రం సెలవలు లేనట్టేనా.?

అందరూ దసరా హాలీడేస్‌ ఎంజాయ్ చేస్తుంటే మన హీరోలు మాత్రం షూటింగ్స్‌ సెట్స్‌లో బిజీగా గడిపేస్తున్నారు. యంగ్ హీరోల నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్‌ల వరకు ప్రతీ ఒక్కరు షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు. ఎక్కువ మంది స్టార్స్‌ హైదరాబాద్‌లోనే షూటింగ్స్‌లో ఉంటే.. ఒకరిద్దరు మాత్రం అవుట్‌డోర్‌ షూట్స్‌లో ఉన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్‌ ప్రభాస్‌, రాజాసాబ్ సెట్‌లో బిజీగా ఉన్నారు.

Ratan Tata: ‘భారతీయులకు ఇది బాధాకరమైన రోజు’.. రతన్ టాటాకు సినీ ప్రముఖుల నివాళులు

వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒరవడిని సృష్టించడంతో పాటు నిస్వార్థంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన రతన్ టాటా ఇక లేరనే విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు రతన్ టాటా అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. చిరు పోయే చరణ్ వచ్చే..

‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం సంక్రాంతికి 2025 జనవరి 10న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా విశ్వంభర  వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మెగా పవర్ స్లార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ డిసెంబర్‌లో విడుదల చేయాలని మూవీ యూనిట్ భావించినా, కానీ సీజీ VFX షాట్స్ ఫైనల్ ఎడిటింగ్‌లు ఆలస్యం కావడంతో మూవీని ప్రొడ్యూసర్ దిల్ రాజు సంక్రాంతికి తేవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Konidela Anjana Devi: మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమ్మ అంజనా దేవి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూ విడుదల చేశారు. ఈ ఇంటర్వ్యూలో అంజనాదేవి పవన్ కళ్యాణ్ గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీఇంటి చిన్నోడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అని యాంకర్ అనగానే..

Tollywood : బాధ్యతగా మాట్లాడాలి.. కొండా సురేఖ కామెంట్స్ పై స్పందించిన చిరంజీవి, బన్నీ, వెంకటేష్

సినీ వ్యక్తుల వ్యక్తిగత విషయాల గురించి ప్రస్తావించడం పై సీరియస్ అవుతున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందించారు. ఆ అమర్యాదకర వ్యాఖ్యలు చూసి తాను చాలా బాధపడ్డట్లు తెలిపారు. వార్తల్లో నిలిచేందుకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Chiranjeevi: మెగాస్టార్ ఫాంటసీ.! 2025 సంక్రాంతినే టార్గెట్..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ విశ్వంభర. ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి రిలీజ్‌ అంటూ టీమ్ క్లారిటీ ఇచ్చినా.. సోషల్ మీడియాలో వాయిదా వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత.. మెగా టీమ్‌ ఏమంటోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా విశ్వంభర.

Koratala Chiru: కొరటాల, చిరంజీవి మధ్య అంతా ఓకేనా..? కొరటాల ఏమన్నారంటే.?

కొరటాల, చిరంజీవి మధ్య అంతా ఓకేనా..? నిజంగా వాళ్ళిద్దరి మధ్య చెడిందా..? ఆచార్య ఫలితం చిరు, కొరటాల మధ్య చిచ్చు పెట్టిందా..? కొందరు దర్శకులకు విజన్ లేదని చిరు చేసిన వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి..? పక్కోడి పనిలో వేలు పెట్టకుండా.. ఎవరి పని వాళ్లు చేసుకుంటే బెటర్ అని కొరటాల అన్నదెవరిని..? వీటన్నింటికీ ఆన్సర్ వచ్చేసిందిప్పుడు. ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

Sai Durgha Tej: మావయ్యల బాటలోనే మేనల్లుడు.. చిన్నారుల కోసం సాయి దుర్గ తేజ్ భారీ విరాళం.. ప్రశంసల వర్షం

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం 20 లక్షల రూపాయల విరాళం అందించాడు సాయి దుర్గ తేజ్. అలాగే విజయవాడలోని అమ్మ అనాథశ్రమంతో పాటు పలు సేవా సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చాడు. తాజాగా మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడీ మెగా హీరో

Valmiki Research Center: ఏపీలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్.. పోస్టర్ రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..

ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే రామనారాయణంలో ఏర్పాటు చేస్తున్న వాల్మీకి రిసెర్చ్ సెంటర్ ప్రారంభానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. రామనారాయణంలో ప్రారంభం కానున్న వాల్మీకి రిసెర్చ్ సెంటర్ ను జాతీయ సంస్కృత యూనివర్శిటి తో అనుసంధానం చేశారు నిర్వాహకులు.

OTT: నిర్మాతలు తమ సినిమాలను తామే చంపేసుకుంటున్నారా.? ఓటిటితో కష్టాలు..

యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలకు థియేటర్లలో ఆడే అర్హత లేదా.. నెగిటివ్ టాక్ వస్తే నిర్మాతలే ఆ సినిమాలను నిండా ముంచేస్తున్నారా..? ఓటిటి వచ్చిన తర్వాత కేవలం బ్లాక్‌బస్టర్ సినిమాలు మాత్రమే బతుకుతున్నాయా.. ఎర్లీ విండో పేరుతో తమ సినిమాలను తామే చంపేసుకుంటున్నారా..? ఓటిటి వచ్చాక సినిమాల ఫ్యూచర్ మరింత దారుణంగా మారిపోతుంది.