AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సడెన్‌గా సినిమాలకు గుడ్‌బై చెప్పేసి.. ఇప్పుడిలా కుమారుడితో.. ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?

తెలుగులో నాగార్జున, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ తదితర హీరోలతో నటించింది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్‌ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుందీ అందాల తార. అంతేకాదు వివాహానికి ముందే సినిమాలకు గుడ్ డై చెప్పేసి అభిమానులను షాక్ కు గురిచేసింది.

Tollywood: సడెన్‌గా సినిమాలకు గుడ్‌బై చెప్పేసి.. ఇప్పుడిలా కుమారుడితో.. ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jul 10, 2024 | 11:48 AM

Share

పై ఫోటోలో బాబును ఎత్తుకుని పోజులిస్తున్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఈ అందాల తార గతంలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించింది. పలు సూపర్ హిట్ సినిమాల్లోని స్పెషల్‌ సాంగ్స్‌లోనూ ఆడిపాడింది. హిందీ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. తెలుగులో నాగార్జున, మంచు మనోజ్, కల్యాణ్ రామ్ తదితర హీరోలతో నటించింది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్‌ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుందీ అందాల తార. అంతేకాదు వివాహానికి ముందే సినిమాలకు గుడ్ డై చెప్పేసి అభిమానులను షాక్ కు గురిచేసింది. ఆ వెంటనే తన సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సినిమాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసింది. పెళ్లి తర్వాత పూర్తిగా ఆధ్యాత్మిక భావనలోనే మునిగిపోయిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు సనాఖాన్.

ముంబైకు చెందిన సనాఖాన్ కెరీర్ ఆరంభంలో పలు హిందీ సినిమాలు, సీరియల్స్ లో నటించింది. కల్యాణ్ రామ్ కత్తి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నాగార్జున గగనం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ తో కలిసి మిస్టర్ నూకయ్య సినిమాలోనూ నటించింది. పలు తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. హిందీలో అయితే సల్మాన్‌ ఖాన్, అక్షయ్ కుమార్ ల సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఇవి కూడా చదవండి

2019లో విశాల్ నటించిన అయోగ్య సినిమాలో చివరి సారిగా కనిపించింది. ఆతర్వాత ఉన్నట్లుండి సినిమాల నుంచి తప్పుకుంది సనాఖాన్. దుబాయ్ కు చెందిన అనస్ సయ్యద్‌ తో కలిసి నిఖా పక్కా చేసుకుంది. ప్రస్తుతం ఈ దంపతులకు సయ్యద్ తారిఖ్ జమీల్‌ అనే బాబు. ఎక్కువగా ఆధ్యాత్మిక యాత్రలో మునిగి తేలుతోన్న సనాఖాన్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తి దూరంగా ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఇటీవల మక్కా యాత్రలో సానియాతో కలిసి కనిపించిన ఆమె ఇప్పుడు తొలిసారి తన బాబు ముఖాన్ని చూపించింది. ప్రస్తుతం సనాఖాన్ ఫ్యామిలీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ పాత్రలు యానిమేషన్ రూపంలో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
సెలబ్రిటీల ప్రేమ కొట్టేసిన మూగజీవాలు..ఒక్కో పెట్ ధర లక్షల్లో!
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
రామాయణ క్యాస్టింగ్ చూస్తుంటేనే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
సెక్యూరిటీని తోసేసి పైన పడ్డ జనం.. భయమేసిందన్న స్టార్​ యాక్టర్​!
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తెలుగు ముగింట్లో మాయ చేస్తున్న మలయాళీ ముద్దుగుమ్మలు
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..