AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయం బేగం పేట కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ పేట్ పోలీసులకు ముందుగానే తెలియజేశారు బన్నీ.

Allu Arjun: నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
Allu Arjun
Rajitha Chanti
|

Updated on: Jan 07, 2025 | 8:51 AM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తే తమకు సమచారాం ఇవ్వాలని ఇప్పటికే రామ్ గోపాల్ పేట్ పోలీసులు బన్నీకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు తాను కిమ్స్ హాస్పిటల్‏కు వస్తున్నట్లు రామ్ గోపోల్ పేట్ పోలీసులకు తెలియజేశారు అల్లు అర్జున్. పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకుని ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లనున్నారు.

ఇదిలా ఉంటే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. అదే ఘటనలో బాలుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరచగా.. హైకోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఇటీవలే నాంపల్లి కోర్టు బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ పేట పోలీసుల అనుమతి తీసుకుని ఈరోజు ఉదయం 10 గంటలకు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారు అల్లు అర్జున్.

ఇదిలా ఉంటే.. డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య 70ఎంఎం థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలారటలో ఓ మహిళా అభిమాని రేవతి చనిపోయారు. ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురికాగా.. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు. అందులో ఏ11గా అల్లు అర్జున్ ను చేర్చి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నాంపల్లి కోర్టు రెండు వారాలపాటు రిమాండ్ విధించగా.. అదే రోజు హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ విడుదలయ్యాయి. ఆ తర్వాత రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ కోటి.. పుష్ప 2 మేకర్స్ రూ.50 లక్షలు, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఈరోజు కిమ్స్ ఆసుపత్రికి శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు అల్లు అర్జున్.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.