చేసిన మూడు సినిమాలు ఫ్లాప్.. హిట్ కోసం అమ్మడి ఎదురుచూపులు 

15 July  2026

Pic credit - Instagram

Rajeev 

అందంలో అప్సరస ఈ అమ్మడు. వరుస సినిమాలతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది నిధి అగర్వాల్. 

2014 యమహా ఫాసినో మిస్ దివాలో ఫైనల్స్ వరకి వచ్చింది. ఇక ఆతర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

తొలి సినిమా బాలీవుడ్ లో చేసింది ఈ అమ్మడు. 2017లో టైగర్ ష్రాఫ్‌ హీరోగా వచ్చిన మున్నా మైఖేల్ నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. 

ఆతర్వాత  2018లో సవ్యసాచి సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. తొలి సినిమాలో నటనతో ఆకట్టుకుంది. 

సవ్యసాచి తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది నిధి అగర్వాల్. 

ఆ సినిమాలో తన గ్లామర్ తో కట్టిపడేసింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయింది. 

చివరిగా వచ్చిన రాజాసాబ్ సినిమా నిరాశపరచడంతో నిధికి ఆఫర్స్ లేకుండా పోయాయి. ప్రస్తుతం నెట్టింట రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.