Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nagarjuna: సౌత్ సినిమాలపై ఇండియా అంతా ఫాలో అవుతుంది.. తెలుగు మూవీస్ పై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణ ఘనంగా నిర్వహించారు. సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా ఈ సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది. ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, వి.ఎఫ్.ఎక్స్, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని ఈ వేదికపై పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి నాగార్జునతోపాటు..

Akkineni Nagarjuna: సౌత్ సినిమాలపై ఇండియా అంతా ఫాలో అవుతుంది.. తెలుగు మూవీస్ పై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Akkineni Nagarjuna
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 31, 2023 | 8:24 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా.. సినిమా మేకింగ్‌లో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి. అందివచ్చిన టెక్నాలిజీతో.. ఫిల్మ్ వరల్డ్ లో వండర్స్‌ క్రియేట్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ టెక్నాలిజీని మేకర్స్కు పరిచయం చేయడంలో ఎక్స్‌పోలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక ఈక్రమంలోనే పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ గా మారుతున్న టాలీవుడ్‌ గడ్డ.. తాజాగా సినిమాటిక్ ఎక్స్‌పో జరిగింది. ఈ ఎక్స్‌పోకు స్టార్ హీరో కింగ్ నాగార్జున రావడం.. ఇండియన్ సినిమాలకు హైద్రాబాద్ రాజధాని అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. సినీ రంగానికి చెందిన 24 శాఖలలో… సరికొత్త సాంకేతికతను అందరికీ పరిచయం చేసే ఉద్దేశ్యంతో… హైడ్రాబాద్‌లో నోవాటెల్‌లో సినిమాటిక్ ఎక్స్ పో జరిగింది. ఇండియా సినిమాటిక్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్ అనేది సినిమాకు పరిశ్రమకు రాజధానిలా మారనుందని అన్నారు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణ ఘనంగా నిర్వహించారు. సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా ఈ సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది. ఈ ఏడాది జరిగిన సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైనింగ్, వి.ఎఫ్.ఎక్స్, స్పెషల్ ఎఫ్టెక్స్ రంగాలకు చెందిన సరికొత్త టెక్నాలజీని ఈ వేదికపై పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి నాగార్జునతోపాటు.. డైరెక్టర్ నాగ్ అశ్విన్, తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్, కామర్స్, ఐటీ డిపార్ట్‌మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సినిమాటికా ఎక్స్ పో ఫౌండర్, తెలుగు సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.జి.విందా, రోటో మేకర్ ఫౌండర్ మైక్, గ్రీన్ గోల్డ్ ఛీప్ మార్కెటింగ్ హెడ్ భరత్, కంట్రీ హెడ్ ఫర్ టెక్నికల్ బిరేన్ గోస్, జయేష్ రంజన్ ఐఏఎస్, సినిమాటోగ్రఫర్ పీజీ విందా, నాగ్ అశ్విన్, నిర్మాత సుప్రియ, డ్యాన్సింగ్ ఆటం క్రియేటివ్ హెడ్, ఫౌండర్ సరస్వతి వాణి తదితరులు పాల్గొన్నారు.

ఇంతకీ నాగార్జున ఏం మాట్లాడారంటే.. “రోజురోజుకూ టెక్నికల్‌గా ఎన్నో మార్పులు వస్తున్నాయి. 1974లో అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించాం. నెలకు ఒక షూటింగ్ జరిగితే చాలనుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల పరిణామాలు వచ్చాయి. ఎంతో మారింది. హైద్రాబాద్ అనేది సినిమాకు పరిశ్రమకు రాజధానిలా మారనుంది. సౌత్ ఫిల్మ్స్‌ని ఇండియా అంతా ఫాలో అవుతోంది. నాగ్ అశ్విన్ వంటి అద్భుతమైన దర్శకులు సత్తాను చాటుతున్నారు. మేం ఆస్కార్ వరకు వెళ్లాం. ఇండియా జాయ్ వారి గ్రాఫ్ అద్భుతంగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఎంతో సహకరిస్తున్నారు. గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ వంటి వారి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడకు రావాలని చెప్పారు.

ఇక మరో గెస్ట్ గా విచ్చేసిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘ఇండియా జాయ్ ఈవెంట్‌కు నన్ను పిలిచినందుకు థాంక్స్. నేను కూడా యానిమేషన్ కోర్సులు నేర్చుకున్నాను. వీఎఫ్‌ఎక్స్ కంపెనీల చుట్టూ కథలు పట్టుకుని తిరిగాను. హాలీవుడ్‌లాంటి క్వాలిటీతో సినిమాలు ఎందుకు చేయరని అడుగుతుంటారు. కానీ గత పదేళ్లుగా అద్భుతమైన క్వాలిటీతో సినిమాలు తీస్తున్నాం. హాలీవుడ్ వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి చేస్తున్నారు. ప్రాజెక్ట్ కేని పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మూవీలా ఇక్కడి వీఎఫ్ఎక్స్ కంపెనీలతోనే చేద్దామని ప్రయత్నించాను. నెక్ట్స్ మూవీని ఇక్కడి వాళ్లతో కలిసి హాలీవుడ్ కంటే బెస్ట్ క్వాలిటీతో తీస్తాను’’ అని అన్నారు.