Karthikeya 2: ప్రమోట్ చేయలేదు.. బాక్సాఫీస్‏ను షేక్ చేశారు.. వందకోట్ల క్లబ్‏లో చేరిన కార్తీకేయ 2..

బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి గారు, సుకుమార్ గారు మన సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చూపించారు.

Karthikeya 2: ప్రమోట్ చేయలేదు.. బాక్సాఫీస్‏ను షేక్ చేశారు.. వందకోట్ల క్లబ్‏లో చేరిన కార్తీకేయ 2..
Karthikeya 2
Follow us

|

Updated on: Aug 27, 2022 | 12:37 PM

యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ నిఖిల్ సిద్ధార్థ్ నటించిన లేటేస్ట్ చిత్రం కార్తికేయ 2 (Karthikeya 2). గతంలో సూపర్ హిట్ అయిన కార్తికేయ సినిమాకు సిక్వెల్‏గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ముందుగా పరిమిత థియేటర్స్‏లో మాత్రమే రిలీజైన కార్తికేయ చిత్రం కేవలం మౌత్ టాక్‏తో అనేక థియేటర్స్‏ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్‏గా దూసుకుపోతుంది. ప్రతిచోటా హౌస్ ఫుల్స్‏తో రన్ అవుతూ మంచి లాభాలను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‏లో చేరిపోయింది. ఈ సందర్బంగా ఈ చిత్ర యూనిట్ సెలెబ్రేషన్స్ నిర్వహించింది. ఉత్తరాదిన ఈ సినిమా విడుదలవుతుంటే తనకు బయమేసిందని.. సినిమాను పెద్దగా ప్రమోట్ చేయకపోయిన.. ప్రేక్షకులే ముందుకు తీసుకెళ్లారని.. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నిఖిల్.

“బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో రాజమౌళి గారు, సుకుమార్ గారు మన సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చూపించారు. వాళ్ళు వేసిన రూట్స్ వలనే ఈ కార్తికేయ సినిమాను ఇలా తీసుకెళ్లగలిగామ. నా సినిమా హిందీలో డబ్ అయి ఉత్తరాదిన విడుదలవుతుంటే భయమేసింది. నిఖిల్ ఏంటీ? బాలీవుడ్ వెళ్లమేంటి ? అని నాలాగే అనుకున్నారు. కదా. కానీ పరిస్థితి మారింది. ఈ రోజు 1200 స్క్రీన్ లలో కార్తికేయ ఆడుతుంది అంటే అది తెలుగు సినిమా గొప్పతనం. మేం సినిమాను పెద్దగా ప్రమోట్ చేయలేదు. ప్రేక్షకులే మా సినిమాను ముందుకు తీసుకెళ్లారు. మీరు ఈ సినిమాను చూసి హిట్ చేసారు అందుకే మీకు థాంక్స్ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. అందరికి థాంక్యూ సో మచ్. నన్ను ఒక ఫ్రెండ్ లా ఒక ఫ్యామిలీ మెంబెర్ లా ఫీల్ ఈ సినిమాను జనాల్లోకి మీరు తీసుకెళ్లారు. మా నిర్మాతలకి , మా దర్శకుడు చందు కి థాంక్యూ సో మచ్” అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.