Kumari Srimathi OTT: ఓటీటీలో నిత్యామేన‌న్ తెలుగు వెబ్‌సిరీస్.. కుమారి శ్రీమ‌తి స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సినిమాలు చేస్తూనే బ్రీత్‌.. ఇన్‌ టు ది షాడోస్‌, మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ వంటి వెబ్‌ సిరీసుల్లోనూ మెరిసింది నిత్య. ఇప్పుడు 'కుమారి శ్రీమతి' అంటూ మరో ఆసక్తికర తెలుగు వెబ్‌ సిరీస్‌తో మన ముందుకు వస్తోంది. ఇందులో నిత్యా మేనన్‌ తో పాటు గౌతమి, మురళి మోహన్‌. నిరుపమ్‌, తిరువీర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Kumari Srimathi OTT: ఓటీటీలో నిత్యామేన‌న్ తెలుగు వెబ్‌సిరీస్.. కుమారి శ్రీమ‌తి స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Nithya Menen
Follow us

|

Updated on: Sep 18, 2023 | 8:53 PM

మలయాళ ముద్దుగుమ్మ నిత్యామేనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుమారు 13 ఏళ్ల క్రితం నాని అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైందీ అందాల తార. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇష్క్‌, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, రుద్రమదేవి, జనతా గ్యారేజ్‌, గమనం, భీమ్లా నాయక్‌ తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. అలాగే కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. సినిమాలు చేస్తూనే బ్రీత్‌.. ఇన్‌ టు ది షాడోస్‌, మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ వంటి వెబ్‌ సిరీసుల్లోనూ మెరిసింది నిత్య. ఇప్పుడు ‘కుమారి శ్రీమతి’ అంటూ మరో ఆసక్తికర తెలుగు వెబ్‌ సిరీస్‌తో మన ముందుకు వస్తోంది. ఇందులో నిత్యా మేనన్‌ తో పాటు గౌతమి, మురళి మోహన్‌. నిరుపమ్‌, తిరువీర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తం 7 ఎపిసోడ్లుగా సాగే కుమారి శ్రీమతి వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశారు మేకర్స్‌. సెప్టెంబ‌ర్ 28 న‌ అమెజాన్ ప్రైమ్‌ లో ఈ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.

గోమ‌టేష్ ఉప‌ధ్యాయ్ దర్శకత్వం వహించిన కుమారి శ్రీమతి వెబ్‌ సిరీస్‌ తెలుగుతో పాటు మ‌ల‌యాళం, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రిలీజైన ఈ టీజర్‌ సిరీస్‌పై ఆసక్తిని పెంచింది. ‘అబ్దుల్ కలాం అంట.. రజనీకాంత్ అంట.. తర్వాత ఈవిడే నంట.. ఉద్యోగం సద్యోగం చేయదంట.. బిజినెస్‌ మాత్రమే చేస్తాదంట.. కుటుంబాన్ని మొత్తం ఈవిడే లాక్కోస్తుందట. పెళ్లి గిళ్లీ వద్దంట వదిన. ఇట్టానే ఉండిపోద్దట’ అని టీజర్‌లో వచ్చే డైలాగ్‌ను బట్టే చెప్పవచ్చు ఇది ఓ మహిళా సాధికారతకు సంబంధించిన వెబ్‌ సిరీస్‌ అని. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావ‌రి బ్యాక్‌డ్రాప్‌లో కుమారి శ్రీమ‌తి వెబ్‌సిరీస్ కథ సాగనుందని సమాచారం. త్వరలోనే ఈ తెలుగు వెబ్‌ సిరీస్‌కు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ విడుదల చేయనున్నారు మేకర్స్‌. కుమారి శ్రీమతితో పాటు మాస్ట‌ర్ పీస్ అనే ఓ మ‌ల‌యాళ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది నిత్యామేన‌న్ .అలాగే తిరు తర్వాత ధ‌నుష్ 50వ సినిమాలోనూ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..