AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నితిన్ పై మహానటి పగ… ఎందుకో తెలుసా… ఇన్ స్టాలో పోస్టు… గుణపాఠం నేర్చుకున్నానన్న కీర్తి సురేష్….

టాలీవుడ్ హీరో నితన్ మీద హీరోయిన్ కీర్తి సురేష్ పగ తీర్చుకుంటా అని అన్నారు. షూటింగ్ సమయంలో నిద్రపోకూడదనే గుణపాఠాన్ని నేర్చుకున్నానని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

నితిన్ పై మహానటి పగ... ఎందుకో తెలుసా... ఇన్ స్టాలో పోస్టు... గుణపాఠం నేర్చుకున్నానన్న కీర్తి సురేష్....
ఫ్రెండ్స్ తో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ .
Rajeev Rayala
| Edited By: |

Updated on: Dec 09, 2020 | 12:03 PM

Share

టాలీవుడ్ హీరో నితన్ పై మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ పగ తీర్చుకుంటా అని అన్నారు. షూటింగ్ సమయంలో నిద్రపోకూడదనే గుణపాఠాన్ని నేర్చుకున్నానని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్‌ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నితిన్‌తో ‘రంగ్‌దే’, మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో నటిస్తున్నారు.

‘రంగ్‌దే’ షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా సెట్లో కీర్తి నిద్రపోతుండగా ఫోటో తీసిన నితిన్.. దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్‌ అవుతోందంటూ కామెంట్ చేశాడు. ఈ సరదా ఫోటో సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన కీర్తి ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటా’ అని కామెంట్ చేసింది. దీంతో పాటు దుబాయి‌లోని అద్భుతమైన లొకేషన్లో దిగిన ఫోటోలను కూడా తన ఇన్‌‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసింది.