Tollywood: జమ్మూపై పాక్ దాడి.. ఆర్మీలో తండ్రి.. కమెడియన్ ఏం చేశాడంటే?
భారత్, పాకిస్తా్న్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దు గ్రామాల్లోని అమాయక పౌరులపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. దీంతో గురువారం భారత్ పాక్ పై మెరుపు దాడులు చేసింది. తన ఉనికిని చాటుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్న పాక్.. జమ్మూ లక్ష్యంగా దాడులకు పాల్పడుతుంది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సరిహద్దు గ్రామాలపై దాడులకు పాల్పడింది పాక్. ఈ కాల్పులలో అనేక మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతుంది పాకిస్తాన్. దీంతో అక్కడి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అలజడి దృష్ట్యా అక్కడి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జమ్ముూ సరిహద్దులు దాటి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న పాక్ ఉగ్రవాదులు చేస్తోన్న ప్రయత్నాలను భారత ఆర్మీ తిప్పికొట్టింది. భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్రమైన పరిస్థితులు నెలకొన్న క్రమంలో జమ్మూలో విధులు నిర్వహిస్తోన్న తన తండ్రి కోసం బాలీవుడ్ కమెడియన్ రైనా ఎమోషనల్ పోస్ట్ చేశారు. జమ్మూలో ఉన్న తండ్రి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత ప్రశాంతంగా ఉన్నానని.. ఆర్మీలో ఉన్నవారి కుటుంబసభ్యులెవరూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రశాంతంగా నిద్రపోలేరని అన్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో సుధీర్ఘ పోస్ట్ షేర్ చేశారు.
“జమ్మూలో విధులు నిర్వహిస్తున్న నాన్న గురువారం రాత్రి నాకు గుడ్ నైట్ చెప్పడానికి కాల్ చేశారు. అక్కడ పరిస్థితి అంతా అదుపులో ఉందని.. భయపడకుండా నిద్రపోమ్మని చెప్పారు. ఆయన నుంచి ఫోన్ వచ్చేవరకు ఎంతగానో టెన్షన్ పడ్డాను. ఆయన మాట విన్న తర్వాత కాస్త ప్రశాంతంగా అనిపించింది. ఇంట్లో లైట్స్ ఆఫర్ చేసి పడుకోవడానికి రెడీ అయ్యాను. కానీ మా పక్కింట్లో మాత్రం లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి. బహుశా వారి ఇంట్లోని వ్యక్తి కూడా ఆర్మీలో ఉన్నారేమో.. అందుకే టెన్షన్ కు నిద్రపట్టడం లేదేమో అనుకున్నాను. మన భద్రత కోసం త్యాగాలు చేస్తోన్న సైనికులు.. వారి కుటుంబాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్ ” అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం సమయ్ రైనా చేసిన పోస్ట్ వైరలవుతుంది.

Samay
ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ దాడులకు పాల్పడింది. జమ్మూలోని పలు ప్రదేశాలు, సైనిక స్థావరాలతోపాటు డజనుకు పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ దాడులకు పాల్పడింది. పాక్ ప్రయోగించిన ఎనిమిది మిస్సైల్స్ ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..