AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Crime News: వృద్ధ దంపతుల మధ్య తలెత్తిన ఘర్షణ.. భార్యని చంపి.. భయంతో ఆత్మహత్య చేసుకున్న భర్త

Telangana Crime News: జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు.. ఒకటి కాలం.. రెండోది ప్రాణం.. అయితే క్షణికావేశం తీసుకునే నిర్ణయాలు అనర్థాలను కలిగిస్తాయి. జీవితాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని సార్లు ఆత్మహత్యకు..

Telangana Crime News: వృద్ధ దంపతుల మధ్య తలెత్తిన ఘర్షణ.. భార్యని చంపి.. భయంతో ఆత్మహత్య చేసుకున్న భర్త
Old Couple
Surya Kala
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 12, 2021 | 2:22 PM

Share

Telangana Crime News: జీవితంలో తిరిగి పొందలేనివి రెండే రెండు.. ఒకటి కాలం.. రెండోది ప్రాణం.. అయితే క్షణికావేశం తీసుకునే నిర్ణయాలు అనర్థాలను కలిగిస్తాయి. జీవితాలను ప్రభావితం చేస్తాయి. కొన్ని సార్లు ఆత్మహత్యకు చేసుకునే విధంగా పురిగొలిపితే.. మరొక్కసారి హత్య చేసే విధంగా మనిషి మనసుని మార్చేస్తుంది. ఒకొక్కసారి మనపై ఆధారపడినవారిని గుర్తు చేయవు.. క్షణికావేశంలో మనిషి తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. చంపడమో.. చావడమో తప్ప సమస్యలకు పరిష్కారమే లేదని భావిస్తున్నారు. తాజాగా ఓ భర్త తన భార్యని చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో .. ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణ వృద్ధ దంపతులద్దరినీ బలి తీసుకుంది. క్షణికావేశంలో భార్యను హత్య చేసి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య పిసాటి మల్లమ్మ(60)పై భర్త పిసాటి మారారెడ్డి(65) ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. భార్య మృతి చెందడంతో భయంతో వ్యవసాయ భూమిలో చెట్టుకు ఊరి వేసుకుని మారారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: ఒకే ఫేమ్‌లో మెగా హీరోలు .. పవన్ కళ్యాణ్ ఫోటోని మిస్ చేసిన నాగబాబు.. ఫీలవుతున్న ఫ్యాన్స్

Upcoming Movies 2021: వినాయక చవితి కానుకగా థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు