AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత మాయో చూడండి.. స్వాములోరి హుండీని తెరిస్తే కేవలం రూపాయి మాత్రమే ఉంది.. అసలు ఏం జరిగిందంటే

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అంటారు...అచ్చం అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దేవుడే మావాడే కాబట్టి..

ఎంత మాయో చూడండి.. స్వాములోరి హుండీని తెరిస్తే కేవలం రూపాయి మాత్రమే ఉంది.. అసలు ఏం జరిగిందంటే
హుండీలో డబ్బు మాయం
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2021 | 5:33 PM

Share

ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అంటారు…అచ్చం అలాంటి ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. దేవుడే మావాడే కాబట్టి.. మమల్ని ఎవరు అడుగుతారు అనుకున్నారో ఏమో గానీ, ఏకంగా కన్నాల స్వామికే కన్నం వేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయితీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి ఆలయం ఇది. ఇక్కడ స్వామివారి సన్నిధిలోని ఏర్పాటు చేసిన హుండీని లెక్కించగా అందులో కేవలం.. 1 రూపాయి మాత్రమే కనిపించింది. దీంతో ఆలయ అధికారులు, సిబ్బంది అంతా అవాక్కయ్యారు. ఇదేంటని అనుమానం వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు…ఆలయ పరిసరాలను పరిశీలించారు. గుడిలో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు..నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆలయం హుండి మాయం కావటం ఇంటి దొంగల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయ సిబ్బందితో పాటు పూజారులను విచారిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.  కాగా నిందితులను పట్టుకోవడంలో సీసీ టీవీ విజువల్స్ కీలకంగా మారాయి. ఎంత చిన్న టెంపుల్ అయినా సరే.. గుడికి వెళ్లినవారు ఎంతో కొంత.. హుండీలో డబ్బులు వేయకుండా తిరిగిరారు. అలాంటిది నిత్య భక్తుల రద్దీ ఓ మోస్తారుగా ఉండే శ్రీ బుగ్గ రాజా రాజేశ్వర స్వామి ఆలయంలో కేవలం రూ.1 మాత్రమే ఉన్నాయంటే.. కచ్చితంగా డబ్బు మిస్ అయినట్లు స్పష్టమవుతుంది. ఇంటి దొంగలు సీసీ కెమెరాల కంటపడకుండా పని కానిచ్చారా లేదా అనే విషయం మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Also Read:

కామారెడ్డి జిల్లాలో వింత సంఘటన.. మోటారు లేకుండానే బోరుబావిలోంచి ఉబికి వస్తోన్న నీరు

మహాశివరాత్రి వేళ మహా అద్భుతం.. మంచిర్యాల జిల్లాలో శ్వేతనాగు దర్శనం