హృదయవిదారక ఘటన.. తల్లీ, కుమారుడిని కబళించిన మృత్యువు

ఎక్కడికెళ్లినా ఆ తల్లీకుమారులిద్దరూ కలిసే వెళ్తారు. వారి మధ్య ఉన్న అనురాగం చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో..! రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఇద్దరినీ కబళించింది. పండుగ సంతోషాలతో....

హృదయవిదారక ఘటన.. తల్లీ, కుమారుడిని కబళించిన మృత్యువు
Mother Son Death
Follow us

|

Updated on: Feb 19, 2022 | 6:35 AM

ఎక్కడికెళ్లినా ఆ తల్లీకుమారులిద్దరూ కలిసే వెళ్తారు. వారి మధ్య ఉన్న అనురాగం చూసి ఆ విధికి కన్ను కుట్టిందేమో..! రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఇద్దరినీ కబళించింది. పండుగ సంతోషాలతో ఇంటికి బయల్దేరిన ఆ తల్లీ కుమారులు.. కల్వర్టులో పడి మృతి(Death) చెందడం అందరినీ కలచివేసింది. తల్లీ, తమ్ముడు మృతదేహాలను చూసి కుమార్తెలు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. శ్రీకాకుళం(Srikakulam) జిల్లా పెద్దపాడు గ్రామానికి చెందిన రమణమ్మ సోదరి జలుమూరు మండలంలోని అచ్యుతాపురంలో నివాసముంటోంది. సోదరి ఇంట్లో పండుగ జరగడంతో కుమారుడు మణికంఠతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు. పండగ రోజంతా బంధువులతో సంతోషంగా గడిపారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడి నుంచి బయల్దేరారు. సారవకోట మండలం బుడితి కూడలి సమీపానికి వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం వచ్చేసరికి.. నిర్మాణంలో ఉన్న కల్వర్టును గుర్తించక ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఈ ఘటనలో తల్లీకుమారులిద్దరూ మృతి చెందారు.

రమణమ్మ భర్త అప్పారావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే రెండు నిండు ప్రాణాలు బలయ్యాయని మృతుల బంధువులు ఆరోపించారు. మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు యత్నించగా వారిని అడ్డుకున్నారు. చివరికి పోలీసుల సమన్వయంతో గొడవ సద్దుమణిగింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. అప్పారావు, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. మూడో సంతానంగా కుమారుడు పుట్టడంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఎక్కడికెళ్లినా తల్లీకొడుకు కలిసే వెళ్లేవారు.

తమను చూసుకుంటాడనుకున్న బిడ్డ ఇలా వదిలి వెళ్లిపోయాడని తండ్రి అప్పారావు కంటతడి పెట్టారు. తల్లీ, తమ్ముడు మృతదేహాలను చూసి కుమార్తెలు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. మణికంఠ ఇంటరు చదువుతుండగా, రమణమ్మ పెద్దపాడు సమీపంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు.

Also Read

Indian Railways: రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఇక ఏ స్టేషన్‌ నుంచైనా ట్రైన్ ఎక్కొచ్చు..

Ukraine-Russia: రష్యా-ఉక్రెయిన్‌ యుద్దానికి కౌంట్‌డౌన్‌.. వరుసగా మూడోరోజు బలగాలు ఆయుధ మోహరింపు

8 వారాలు నిద్రపోతే 1.5 లక్షల జీతం !! ఎవరికి అవకాశం ఉందంటే ?? వీడియో

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..