AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ లక్షణాలు ఉన్నా కరోనా ఉన్నట్లేనా..!

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి లక్షణాల గురించి మరో షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు కరోనా లక్షణాల్లో జ్వరం, పొడి దగ్గు,

ఆ లక్షణాలు ఉన్నా కరోనా ఉన్నట్లేనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 24, 2020 | 1:44 PM

Share

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి లక్షణాల గురించి మరో షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు కరోనా లక్షణాల్లో జ్వరం, పొడి దగ్గు, అలసట, శ్లేష్మ దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, వికారం, ముక్కులో ఇబ్బంది, ముక్కు నుంచి నీరు కారడం, విరేచనాలు వంటివి ఉండగా.. తాజాగా మరో లక్షణాన్ని గుర్తించారు డాక్టర్లు. చర్మంపై దద్దుర్లు ఉన్నా కరోనా సోకినట్లేనని చెబుతున్నారు. ఇటాలియన్‌ స్టడీ ప్రకారం.. కరోనా వైరస్ సోకిన ప్రతి ఐదు మందిలో ఒకరికి చర్మ సంబంధ వ్యాధులు ఉన్నట్లు తేలింది. కరోనా బాధితులకు చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయని ఆ స్టడీ తెలిపింది.

దీనిపై సుబ్రమణ్మం అనే ప్రముఖ అంటువ్యాధుల సంబంధిత డాక్టర్ మాట్లాడుతూ.. ”ఇటలీలోని కరోనా బాధితుల్లో 20శాతం మందికి దద్దుర్లు ఉన్నాయి. అలాగే ఫిన్‌లాండ్‌, స్పెయిన్‌, అమెరికా, కెనడాలోని డాక్టర్లు సైతం కరోనా బాధితుల్లో ఎర్రటి పాచెస్‌, దురదలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఇక్కడి కరోనా బాధితుల్లో మేము పరిశోధనలు జరుపుతున్నాం” అని తెలిపారు. ఇలాంటి దద్దుర్లు ఎక్కువగా కాలిపైనా, బ్రొటనవేలిపైనా.. ఒక్కొక్కసారి చేతులపైనా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని డాక్టర్లు అంటున్నారు. ఇక భారత్‌లో ఇలాంటి కేసులు ఇప్పటివరకు పెద్దగా నమోదుకాలేదని వారు వెల్లడించారు.

ఒకవేళ దద్దుర్లు ఉండి జ్వరం, దగ్గు, నొప్పులు లేకుంటే వారు వైరల్ టెస్ట్‌ చేయించుకుంటే సరిపోతుందని డాక్టర్ మాయా వేదమూర్తి అన్నారు. ఈ వైరస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని అపోలో ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ రామసుబ్రమణియన్ తెలిపారు.

Read This Story Also: సెట్స్‌లో చెర్రీ, ఎన్టీఆర్ అలా ఉంటారా..! జక్కన్న షాకింగ్ కామెంట్స్‌..!