సెట్స్లో చెర్రీ, ఎన్టీఆర్ అలా ఉంటారా..! జక్కన్న షాకింగ్ కామెంట్స్..!
ఎన్టీఆర్, రామ్ చరణ్.. నిజంగా ఈ కాంబోలో సినిమా వస్తుందని రెండు సంవత్సరాల ముందు వరకు ఎవరూ ఊహించి ఉండరు. అలాంటిది ఆ ఇద్దరితో ప్రాజెక్ట్ను ప్రకటించి.. టాలీవుడ్ ప్రేక్షకులను ఆనందాశ్చర్యాలకు గురి చేశారు రాజమౌళి. వీరిద్దరితో జక్కన్న ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)ను తెరకెక్కిస్తున్నారు. క్రేజీ మల్టీస్టారర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై కేవలం టాలీవుడ్లోనే కాదు మిగిలిన భాషల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కేది కాదని.. ఇద్దరికీ […]
ఎన్టీఆర్, రామ్ చరణ్.. నిజంగా ఈ కాంబోలో సినిమా వస్తుందని రెండు సంవత్సరాల ముందు వరకు ఎవరూ ఊహించి ఉండరు. అలాంటిది ఆ ఇద్దరితో ప్రాజెక్ట్ను ప్రకటించి.. టాలీవుడ్ ప్రేక్షకులను ఆనందాశ్చర్యాలకు గురి చేశారు రాజమౌళి. వీరిద్దరితో జక్కన్న ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)ను తెరకెక్కిస్తున్నారు. క్రేజీ మల్టీస్టారర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై కేవలం టాలీవుడ్లోనే కాదు మిగిలిన భాషల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కేది కాదని.. ఇద్దరికీ కధను చెప్పిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వారిద్దరు ఓకే చెప్పారని ఇప్పటికే పలుమార్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా వీరిద్దరు రియల్ లైఫ్లో మంచి స్నేహితులు కావడం వలన తన ప్రాజెక్ట్కు ఈజీ అయ్యిందని రాజమౌళి అన్నారు.
ఇదిలా ఉంటే సెట్లో ఈ ఇద్దరి బిహేవియర్ గురించి రాజమౌళి తాజాగా సంచలన కామెంట్లు చేశారు. సెట్లో ఇద్దరూ చాలా అల్లరి చేస్తారని రాజమౌళి చెప్పారు. తారక్ కనిపించేలా చేస్తే.. చెర్రీ చేసే అల్లరి కనిపించదని అన్నారు. వారిద్దరినీ ఓ పొజిషన్లో నిల్చోబెట్టి సీరియస్ మూడ్లోకి తీసుకెళ్లడమనేది తనకు చాలా కష్టమైన పని అని చెప్పుకొచ్చారు. షూటింగ్లో ఒకరినొకరు గిల్లుకోవడమో, వెక్కిరించుకోవడమో జరుగుతూనే ఉంటుందని రాజమౌళి పేర్కొన్నారు. ఇక ఒకరికి సీరియస్గా చెబుతుంటే.. ఇంకొకరు మరోలా మొహం పెడతారని రాజమౌళి నవ్వుతూ చెప్పారు. వారిద్దరితో పనిచేసి పదేళ్లపైనే అయ్యిందని.. వ్యక్తిగతంగా మార్పులు లేకపోయినా.. నటులుగా ఇప్పుడు పరిణతి చెందారని కితాబిచ్చారు.
Read This Story Also: జైళ్లో ఇద్దరికి పాజిటివ్.. ‘గ్రీన్ జోన్’లో కరోనా కలకలం..!