Hyderabad: ఆర్టీసీ బస్సులో సందడి చేసిన రాహుల్, సీఎం రేవంత్.. వీడియో వైరల్..
సరూర్ నగర్ జన జాతర సభ అనంతరం సిటీ బస్లో సందడి చేశారు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ జన జాతర బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అందిస్తున్న పథకాల గురించి వివరించారు. తాము అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా వీటిని అమలు చేస్తామన్నారు.
సరూర్ నగర్ జన జాతర సభ అనంతరం సిటీ బస్లో సందడి చేశారు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ జన జాతర బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అందిస్తున్న పథకాల గురించి వివరించారు. తాము అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా వీటిని అమలు చేస్తామన్నారు. తిరుగు ప్రయాణంలో దిల్సుఖ్నగర్ వద్ద ఆర్టీసీ బస్ ఎక్కారు రాహుల్ గాంధీ. ఈయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డికూడా ఉన్నారు. బస్ ఎక్కిన రాహుల్, సీఎం రేవంత్ రెడ్డిలు కాంగ్రెస్ పాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఫ్రీ బస్ అమలు అవుతున్న తీరుపై మహిళలతో మాట్లాడారు. బస్సులోని ప్రయాణికులకు కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ కరపత్రాలు అందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ గురించి ప్రయాణికులకు వివరించి హస్తం పార్టీకి ఓటు వేయాలని కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

