Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతగా, గాంధీ కుటుంబానికి వారసుడిగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి 1970 జూన్ 19న రాహుల్ గాంధీ ఢిల్లీలో జన్మించారు. 2017 డిసెంబరు నుంచి 2019 ఆగస్టు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం తర్వాత పార్టీ సారథ్య పగ్గాలు విడిచిపెట్టారు. యూపీలో గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీ నియోజకవర్గానికి 2004 నుంచి 2019 వరకు మూడు పర్యాయాలు రాహుల్ ప్రాతినిథ్యంవహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు.. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఐదు మాసాల వ్యవధిలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సాగింది.

జోడోయాత్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన చిన్ననాటి జ్ఞాపకాల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలపై ఇందులో రాహుల్ గాంధీ బదులిచ్చారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. నాయనమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తి లాంటి వారన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు కూడా రాహుల్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. మంచి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదన్నారు. పెళ్లికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన అమ్మానాన్నది ప్రేమ వివాహమని గుర్తుచేసుకున్న రాహుల్.. తనకు ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలన్నారు. నాన్ వెజ్ అంటే రాహుల్‌కి ఎంతో ఇష్టం.. కార్లపై అంతగా మోజు లేదని.. బైక్స్ నడపడం అంటే ఇష్టమన్నారు రాహుల్.

ఇంకా చదవండి

Jagga Reddy: కుమార్తె పెళ్లికి అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించిన జగ్గారెడ్డి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి వివాహం గుణచైతన్యరెడ్డితో జరగబోతోంది. ఈ వేడుక ఆగస్టు 7న సంగారెడ్డిలో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కుమార్తె పెళ్లి పత్రిక అందజేశారు.

మహారాష్ట్ర ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలన్న రాహుల్ గాంధీ.. ఈసీ సమాధానం ఇదే!

కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఓటర్ల గోప్యత, భద్రతను నిర్ధారించడం అవసరమని చెబుతూ, పోలింగ్ కేంద్రాల CCTV ఫుటేజ్‌లను 45 రోజుల్లోపు నాశనం చేయాలనే తన నిర్ణయాన్ని కమిషన్ సమర్థించుకుంది.

Telangana Congress: ఢిల్లీలో ఏం జరుగుతోంది..? ఆ ఇద్దరితో చర్చల తర్వాతే కొత్త మంత్రుల శాఖలపై క్లారిటీ..!

ఇటీవల తెలంగాణ మంత్రివర్గంలోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు మంత్రుల శాఖలపై ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు.

రాహుల్‌ గాంధీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..

రాహుల్‌ గాంధీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలకు ఈసీ ఇచ్చిన కౌంటర్‌ సంచలనం రేపింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల రోల్స్‌ను విడుదల చేయాలని ఈసీ నిర్ణయించింది. ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన రాహుల్‌ ఎప్పటిలోగా డేటా విడుదల చేస్తారో క్లారిటీ ఇవ్వాలన్నారు.

ఆత్మపరిశీలన చేసుకోవడానికి బదులుగా, రాహుల్ గాంధీ వింత కుట్రలు చేస్తున్నారుః జేపీ నడ్డా

పదేపదే అబద్దాలు చెప్పడం రాహుల్‌కు అలవాటు అని విమర్శించారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాహుల్‌గాంధీ తీరు తోనే కాంగ్రెస్‌ వరుసగా ఓటమి పాలవువతోందని విమర్శించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని ట్వీట్‌ చేశారు నడ్డా. ప్రజాస్వామ్యంలో నాటకాలను కాదు.. వాస్తవాలనే ప్రజలు నమ్ముతారని జేపీ నడ్డా అన్నారు.

మహారాష్ట్రలో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో బీజేపీ గెలిచిందన్న రాహుల్.. ఘాటుగా స్పందించిన ఈసీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎన్నికల కమిషన్ వివరణాత్మక సమాధానం ఇచ్చింది. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకత, ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని కమిషన్ వివరించింది. కాంగ్రెస్ వాదనలను వాస్తవ డేటాతో కమిషన్ తోసిపుచ్చింది. అన్ని ప్రక్రియలు నిర్దేశించిన నిబంధనల ప్రకారం జరిగాయని పేర్కొంది.

పాక్‌స్తాన్‌నే కాదు.. కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతున్న ఎంపీ శశిథరూర్‌..!

నరేందర్‌.. సరెండర్‌ అయ్యారన్న రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు శశిథరూర్‌ నుంచి వచ్చిన సమాధానం బీజేపీకి ఆయుధంగా మారింది. పాక్‌తో కాల్పుల విరమణ విషయంతో మూడో దేశం ప్రమేయం లేదన్న థరూర్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారాయి. అమెరికా పర్యటనలో పాక్‌ కుట్రను సవివరంగా వివరిస్తున్నారు శశిథరూర్‌.

National Herald Case: విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు.. రాహుల్, సోనియాగాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు..

నేషనల్ హెరాల్డ్‌ కేసులో ED ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. చార్జిషీట్‌ దాఖలు అయిన తర్వాత- ఈ కేసులో నిందితులైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ‌, శామ్‌ పిట్రోడాకు నోటీసులు జారీచేసింది న్యాయస్థానం. ED తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు, ప్రత్యేక న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపించారు.

Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌పై మాటలయుద్దం.. రాహుల్‌ గాంధీ సంచలన ట్వీట్‌.. విదేశాంగశాఖ క్లారిటీ

ఆపరేషన్‌ సింధూర్‌తో పాక్‌లో నక్కిన ఉగ్రవాదుల తాట తీశామని కేంద్రం చెబుతుంటే .. విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ స్టేట్‌మెంట్‌తో దాడిపై పాకిస్తాన్‌కు ముందే సమాచారం అందిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. జైశంకర్‌ మాటలను రాహుల్‌ తప్పుగా అర్ధం చేసుకున్నారని విదేశాంగశాఖ వివరణ ఇచ్చింది.

భారత సాయుధ బలగాలను చూసి గర్విస్తున్నా.. ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..

పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి.