రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతగా, గాంధీ కుటుంబానికి వారసుడిగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి 1970 జూన్ 19న రాహుల్ గాంధీ ఢిల్లీలో జన్మించారు. 2017 డిసెంబరు నుంచి 2019 ఆగస్టు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం తర్వాత పార్టీ సారథ్య పగ్గాలు విడిచిపెట్టారు. యూపీలో గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీ నియోజకవర్గానికి 2004 నుంచి 2019 వరకు మూడు పర్యాయాలు రాహుల్ ప్రాతినిథ్యంవహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు.. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఐదు మాసాల వ్యవధిలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సాగింది.

జోడోయాత్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన చిన్ననాటి జ్ఞాపకాల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలపై ఇందులో రాహుల్ గాంధీ బదులిచ్చారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. నాయనమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తి లాంటి వారన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు కూడా రాహుల్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. మంచి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదన్నారు. పెళ్లికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన అమ్మానాన్నది ప్రేమ వివాహమని గుర్తుచేసుకున్న రాహుల్.. తనకు ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలన్నారు. నాన్ వెజ్ అంటే రాహుల్‌కి ఎంతో ఇష్టం.. కార్లపై అంతగా మోజు లేదని.. బైక్స్ నడపడం అంటే ఇష్టమన్నారు రాహుల్.

ఇంకా చదవండి

Congress Failures: బీజేపీతో నేరుగా తలపడడంలో కాంగ్రెస్ తడబడుతోందా.. నిజంగానే పరాన్నజీవిగా మారిందా?

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగా బీజేపీని ఢీకొట్టలేక హర్యానాలో చతికిలపడగా.. జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC)తో జతకట్టి గెలుపును సొంతం చేసుకుంది. ఇంకా లోతుగా వెళ్తే.. ఇక్కడ బీజేపీతో కాంగ్రెస్ నేరుగా తలపడ్డ చోట్ల కమలదళానిదే పైచేయి.

Jammu &Kashmir: ఆర్టికల్ 370ని తొలగించిన 1890 రోజుల తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్‌లో గందరగోళం..!

ఆర్టికల్ 370 రద్దు చేసిన 1890 రోజుల తరువాత కూడా జమ్మూ కాశ్మీర్ పూర్తిగా గందరగోళంగా కనిపించింది. ఇక్కడ మైదానాలు, పర్వతాల మధ్య టగ్ ఆఫ్ వార్ మునుపటిలా కనిపిస్తుంది.

Watch Video: రాహుల్ గాంధీ చెవుల్లోంచి ఆవిరి వచ్చేలా కారం తినిపించిన మహిళ.. ఆమె ఎవరంటే..?

ఈ ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని అజయ్ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనాదే ఇంటికి విందు కోసం వెళ్లారు.

యూపీలో 10 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉపఎన్నికలు.. ఎన్డీఏ, ఇండియా కూటములకు అగ్నిపరీక్ష!

దేశంలో ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే మరో రాష్ట్రంలో సందడి మొదలవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే ఏదో ఒక రాష్ట్రంలో లోక్‌సభ లేదా అసెంబ్లీలకు జరిగే ఉపఎన్నికలు సైతం యావత్ రాష్ట్రం దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

Haryana Election: గంట క్రితం బీజేపీ ర్యాలీలో.. కట్ చేస్తే, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక..!

ఐదేళ్ల తర్వాత మాజీ ఎంపీ అశోక్‌ తన్వర్‌ కాంగ్రెస్‌లో చేరారు. మహేంద్రగఢ్ ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో తన్వర్ కాంగ్రెస్‌లో చేరారు. అతని ప్రధాన ప్రత్యర్థి భూపిందర్ సింగ్ హుడా కూడా అదే వేదికపై ఉండటం విశేషం.

మమ్మల్ని లాగవద్దు.. మంత్రి కొండా సురేఖపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసిన అక్కినేని అమల

సోషల్ మీడియా ట్రోల్స్‌పై కాంగ్రెస్‌ - బీఆర్‌ఎస్ మధ్య రాజుకున్న చిచ్చు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల జీవితాలను తెరపైకి తీసుకొచ్చింది.

Rahul Gandhi: వారు పీవోకే నుంచి వచ్చిన శరణార్థులు.. అయ్యో సారీ..! నోరు జారి నాలుక కరచుకున్న రాహుల్ గాంధీ

ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు మాట్లాడే ప్రతి మాట ఆచి, తూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. లేదంటే ఆ మాట చేసే చేటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నోరు జారి ఏదైనా మాట్లాడారా ఇక అంతే సంగతులు. కొందరు నేతలు పదవులు పోగొట్టుకోగా, మరికొందరు అధికారాన్ని సైతం కోల్పోయిన ఉదంతాలు, దాఖలాలు ఉన్నాయి. కొందరు నేతలు చేసే వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టిస్తుంటే.. మరికొందరు నేతలు చేసే వ్యాఖ్యలు తమ అజ్ఞానాన్ని బయటపెడుతుంటాయి.

Kishan Reddy: మోదీకి, రాహుల్‌ గాంధీకి మధ్య తేడా అదే.. కాంగ్రెస్‌కు ప్రజలే సమాధానం చెబుతారు: కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

అయితే తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రాహుల్ గాంధీ ప్రచార ప్రకటనలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రధాని మోదీ విశ్వాసం 140 కోట్ల మంది భారతీయుల నుంచి వస్తే, రాహుల్‌ గాంధీ విశ్వాసం మాత్రం దేశ వ్యతిరేక కార్యకలాపాల నుంచి వచ్చిందని జమ్మూకశ్మీర్‌లో రాహుల్ గాంధీ ప్రచార ప్రకటనలపై వ్యగ్యంస్త్రాలు విసిరారు. గడిచిన మూడేళ్లలో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలు...

రాహుల్ గాంధీ దేశంలోనే నంబర్ వన్ టెర్రరిస్టు.. కేంద్ర మంత్రి రవ్వ‌నీత్ సింగ్ బిట్టు వివాదాస్పద వ్యాఖ్యలు

కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బిట్టు.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని దేశంలోనే నంబర్ వన్ టెర్రరిస్టుగా అభివర్ణించారు.

అవగాహనా రాహిత్యంతో మాట్లాడకండి.. రాహుల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. దేశంలో ఏం జరుగుతుందో రాహుల్ గాంధీకి అవగాహన లేదన్న కిషన్ రెడ్డి, జమ్మూ కాశ్మీర్ పవర్ పరిస్థితి గురించి ఆయనకు తెలియదన్నారు. ప్రస్తుతుం 18,000 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి జమ్మూ కాశ్మీర్‌కు అద్భుతమైన సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

Amit Shah: రాహుల్‌ గాంధీ దేశాన్ని విభజించాలని చూస్తున్నారు.. హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం..

అమెరికాలో రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దేశవ్యతిరేక మాటలు మాట్లాడటం, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే శక్తులకు అండగా నిలవడం రాహుల్‌ గాంధీకి, కాంగ్రెస్‌ పార్టీకి అలవాటుగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విమర్శించారు.

Kishan Reddy: మహిళల భద్రతపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..

మహిళల భద్రతపై రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షపార్టీలు అధికారంలో ఉన్న చోట అత్యాచార ఘటనలను సొంత ప్రయోజనాల కోసం నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విమర్శించారు.

హర్యానా పాలిటిక్స్‌లో సంచలనం.. రాహుల్ గాంధీతో వినేష్ ఫోగట్.. అందుకేనా..?

భారత రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిశారు. ఇద్దరు రెజ్లర్లులతో రాహుల్ గాంధీ మధ్య జరిగిన సమావేశానికి సంబంధించి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Rahul DOJO Yatra: మరో యాత్రకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. ఫుల్ ప్రిపరేషన్‌లో యువరాజు..?

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. ఘర్షణల నివారణకు యువతకు హింస రహిత విధానాలు నేర్పించడం తమ లక్ష్యమని ప్రకటించారు. అన్నట్టు రాహుల్‌ చేపట్టబోయే యాత్ర పేరు డోజో యాత్ర.

Rahul Gandhi Team: ఏఐసీసీ ప్రక్షాళన షురూ..! సొంత టీమ్ ఏర్పాటు చేసుకుంటున్న రాహుల్..!

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC)లో భారీ మార్పులు, చేర్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. రాహుల్ గాంధీ తన సొంత టీమ్ తయారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శినే మార్చనున్నట్టు ఏఐసీసీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.