AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతగా, గాంధీ కుటుంబానికి వారసుడిగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి 1970 జూన్ 19న రాహుల్ గాంధీ ఢిల్లీలో జన్మించారు. 2017 డిసెంబరు నుంచి 2019 ఆగస్టు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం తర్వాత పార్టీ సారథ్య పగ్గాలు విడిచిపెట్టారు. యూపీలో గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీ నియోజకవర్గానికి 2004 నుంచి 2019 వరకు మూడు పర్యాయాలు రాహుల్ ప్రాతినిథ్యంవహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు.. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఐదు మాసాల వ్యవధిలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సాగింది.

జోడోయాత్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన చిన్ననాటి జ్ఞాపకాల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలపై ఇందులో రాహుల్ గాంధీ బదులిచ్చారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. నాయనమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తి లాంటి వారన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు కూడా రాహుల్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. మంచి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదన్నారు. పెళ్లికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన అమ్మానాన్నది ప్రేమ వివాహమని గుర్తుచేసుకున్న రాహుల్.. తనకు ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలన్నారు. నాన్ వెజ్ అంటే రాహుల్‌కి ఎంతో ఇష్టం.. కార్లపై అంతగా మోజు లేదని.. బైక్స్ నడపడం అంటే ఇష్టమన్నారు రాహుల్.

ఇంకా చదవండి

భలే ఛాన్స్ లే..! ఆరు దశాబ్దాల కల.. విజయ్ ‘చేయూత’తో నెరవేరిన వేళ!

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేబినెట్‌లోకి వచ్చింది. ఆరు దశాబ్దాల నుంచి నెలకొన్న నిరీక్షణ ఇప్పట్లో సాధ్యమవుతుంది అని కాంగ్రెస్ కూడా అనుకోలేదు. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న పార్టీతో మిత్రపక్షంగా ఉన్నా కూడా కేబినెట్‌లో చోటు దక్కని కాంగ్రెస్ కు ఇప్పుడు అనూహ్యంగా మంత్రివర్గంలో చోటు దక్కింది. ఇంతకీ అంత సుదీర్ఘమైన గ్యాప్ ఎందుకొచ్చింది..?

ప్రధాని మోదీ, అమిత్ షా పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌, మోదీ, అమిత్ షాలను “ద్రోహులు”గా అభివర్ణించడం ప్రతి జాతీయవాదిని అవమానించినట్టేనని ఆయన పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజాస్వామ్యంపై ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరమని విమర్శించారు.

రాహుల్ గాంధీకి హైకోర్టులో షాక్? ఆస్తుల కేసులో రికార్డులు సీల్ చేయాలని సంచలన ఆదేశం!

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక కీలక పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాఖలైన ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఈ కేసుకు సంబంధించిన 'పేపర్ బుక్' (పిటిషన్ రికార్డులను) సీల్ చేసి భద్రపరచాలని స్పష్టం చేసింది.

రాహుల్ గాంధీ స్పెషల్‌గా చేసిన జామ్.. ఇంట్లో ఇలా చిటికెలో చేసేసుకోండి..

ఆరెంజ్‌లో విటమిన్ సీతోపాటు.. ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఈ నారింజ పండు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుంది. అయితే.. నారింజతో చేసుకునే.. ఆరెంజ్ మార్మలేడ్ సూపర్ రెసిపీ.. ఇది బ్రెడ్, చపాతీలతో చాలా రుచిగా, అద్భుతంగా ఉంటుంది. ఎన్నో పోషకాలు దాగున్న ఆరెంజ్ మార్మలేడ్ .. సోనియా గాంధీకి చాలా ఇష్టమైన జామ్.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

“ఒక్క అంగుళం భూమి కూడా కోల్పోలేదు”.. రాహుల్ గాంధీ విమర్శలకు జనరల్ నరవాణే స్ట్రాంగ్ కౌంటర్!

భారత మాజీ సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భారత్-చైనా సరిహద్దు వివాదం, తన పుస్తకంపై వస్తున్న ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ, సరిహద్దుల భద్రత, రాజకీయ విమర్శలపై ఆయన తన గళాన్ని విప్పారు. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పుస్తకం విషయం గురించి ప్రస్తావించారు.

భారీ భద్రత మధ్య ప్రారంభమైన ‘మినీ పోరు’..! తొలి గంటల్లోనే బెంగాల్, తమిళనాడులో భారీగా పోలింగ్

పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌ల వద్ద పొడవైన బారులు తీరాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ విశ్వసనీయత ప్రమాదంలో పడగా, తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా, ఎన్నికల సంఘం ఉదయం 9 గంటల వరకు ఉన్న ఓటింగ్ గణాంకాలను విడుదల చేసింది.

మూడు బిల్లులాట.. ఎందుకు డిజాస్టరైంది? ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు

ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎందుకు వీగిపోయినట్టు? నిజానికి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023 అక్టోబర్‌లోనే ఉభయసభలూ ఆమోదం తెలిపాయి. ఇందుకోసం 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే, అన్ని పార్టీల సపోర్ట్‌తో బంపర్ మెజారిటీతో మహిళాబిల్లు చట్టంగా మారింది. కాకపోతే, అప్పుడు నిర్ణయించినట్టుగా డిలిమిటేషన్ పూర్తయ్యాక 2034 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది.

Women Bill: మహిళా బిల్లుపై ‘మహా’ ఉత్కంఠ.. మోదీ మ్యాజిక్ చేస్తారా? ఎన్డీఏ గట్టెక్కుతుందా?

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ రాజకీయ సమీకరణాలు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. మరి కొన్ని గంటల్లో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం ఈ బిల్లును గట్టెక్కిస్తుందా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బిల్లును వ్యతిరేకిస్తానని ప్రకటించడం రాజకీయ వేడిని పెంచింది.

చీకటిలో నిజం.. మనసులో భయం: లోక్‌సభలో రాహుల్ గాంధీ భావోద్వేగ ప్రసంగం

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 'నారీ శక్తి వందన్' సహా మూడు కీలక బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, తన వ్యక్తిగత జీవితంలోని జ్ఞాపకాలను రాజకీయ పాఠాలతో ముడిపెట్టి ఆసక్తికరంగా మాట్లాడారు.

Parliament Special session: మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్.. 54 ఓట్ల దూరంలో ఆగిన 131వ సవరణ

భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి, చర్చకు దారితీశాయి.

మూడు బిల్లులు.. ఒకటే సంకల్పం.. కోటా లెక్కపై పీటముడి..!

2026 ఏప్రిల్ 16.. ఈ తేదీ చానాకాలం యాదుంటది. రాబాయే రెండుమూడు తరాలు బరాబర్ మాట్లాడుకుంటాయి.. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ పార్టీల తలరాతను డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకమైన రెండు నిర్ణయాలకు మోదీ సర్కార్ పెట్టిన ముహూర్తం ఇది. మొదటిది, లోక్‌సభలో సీట్ల పెంపు, ఆ పెంచిన సీట్లలో మహిళలకు ప్రత్యేక కోటా కేటాయింపు. రెంటికి రెండూ హిస్టరీని బ్రేక్ చేసే నిర్ణయాలే. కానీ, ఈ రెండింటికీ ముడిపెట్టి, ఒకటే గాటనకట్టి, చర్చిద్దాం, ఓటేసి ఆమోదించుకుందాం అనడమే, విపక్షానికి రుచించడం లేదు. ఆ సంఘర్షణకే అద్దం పెట్టింది పార్లమెంట్ స్పెషల్ సెషన్. మరి, ధిక్కరించిందెవరు.. గట్టిగా తిప్పికొట్టిందెవరు? ఎవరి వాదనలో ఎంత పస..? హీరో ఆఫ్ ది డేవన్ ఎవరు..?

మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం.. డీలిమిటేషన్‌పై అనుమానాలు!

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేదికగా ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఈ బిల్లులోని చిక్కుముడులను ప్రశ్నించారు. మహిళలకు రావాల్సిన న్యాయాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆమె ఆరోపించారు.