రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతగా, గాంధీ కుటుంబానికి వారసుడిగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి 1970 జూన్ 19న రాహుల్ గాంధీ ఢిల్లీలో జన్మించారు. 2017 డిసెంబరు నుంచి 2019 ఆగస్టు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం తర్వాత పార్టీ సారథ్య పగ్గాలు విడిచిపెట్టారు. యూపీలో గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీ నియోజకవర్గానికి 2004 నుంచి 2019 వరకు మూడు పర్యాయాలు రాహుల్ ప్రాతినిథ్యంవహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు.. వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఐదు మాసాల వ్యవధిలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సాగింది.
జోడోయాత్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన చిన్ననాటి జ్ఞాపకాల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలపై ఇందులో రాహుల్ గాంధీ బదులిచ్చారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. నాయనమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తి లాంటి వారన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు కూడా రాహుల్ తనదైన శైలిలో జవాబిచ్చారు. మంచి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదన్నారు. పెళ్లికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన అమ్మానాన్నది ప్రేమ వివాహమని గుర్తుచేసుకున్న రాహుల్.. తనకు ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలన్నారు. నాన్ వెజ్ అంటే రాహుల్కి ఎంతో ఇష్టం.. కార్లపై అంతగా మోజు లేదని.. బైక్స్ నడపడం అంటే ఇష్టమన్నారు రాహుల్.
మూడు బిల్లులాట.. ఎందుకు డిజాస్టరైంది? ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు
ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఎందుకు వీగిపోయినట్టు? నిజానికి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023 అక్టోబర్లోనే ఉభయసభలూ ఆమోదం తెలిపాయి. ఇందుకోసం 128వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడితే, అన్ని పార్టీల సపోర్ట్తో బంపర్ మెజారిటీతో మహిళాబిల్లు చట్టంగా మారింది. కాకపోతే, అప్పుడు నిర్ణయించినట్టుగా డిలిమిటేషన్ పూర్తయ్యాక 2034 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 18, 2026
- 9:50 pm
Women Bill: మహిళా బిల్లుపై ‘మహా’ ఉత్కంఠ.. మోదీ మ్యాజిక్ చేస్తారా? ఎన్డీఏ గట్టెక్కుతుందా?
లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ రాజకీయ సమీకరణాలు అత్యంత ఉత్కంఠభరితంగా మారాయి. మరి కొన్ని గంటల్లో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం ఈ బిల్లును గట్టెక్కిస్తుందా లేదా అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంపీలందరికీ విజ్ఞప్తి చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బిల్లును వ్యతిరేకిస్తానని ప్రకటించడం రాజకీయ వేడిని పెంచింది.
- Balaraju Goud
- Updated on: Apr 17, 2026
- 5:37 pm
చీకటిలో నిజం.. మనసులో భయం: లోక్సభలో రాహుల్ గాంధీ భావోద్వేగ ప్రసంగం
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 'నారీ శక్తి వందన్' సహా మూడు కీలక బిల్లులపై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, తన వ్యక్తిగత జీవితంలోని జ్ఞాపకాలను రాజకీయ పాఠాలతో ముడిపెట్టి ఆసక్తికరంగా మాట్లాడారు.
- Balaraju Goud
- Updated on: Apr 17, 2026
- 3:19 pm
Parliament Special session: మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్.. 54 ఓట్ల దూరంలో ఆగిన 131వ సవరణ
భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనానికి, చర్చకు దారితీశాయి.
- Balaraju Goud
- Updated on: Apr 17, 2026
- 9:43 pm
మూడు బిల్లులు.. ఒకటే సంకల్పం.. కోటా లెక్కపై పీటముడి..!
2026 ఏప్రిల్ 16.. ఈ తేదీ చానాకాలం యాదుంటది. రాబాయే రెండుమూడు తరాలు బరాబర్ మాట్లాడుకుంటాయి.. కొన్ని దశాబ్దాల పాటు రాజకీయ పార్టీల తలరాతను డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకమైన రెండు నిర్ణయాలకు మోదీ సర్కార్ పెట్టిన ముహూర్తం ఇది. మొదటిది, లోక్సభలో సీట్ల పెంపు, ఆ పెంచిన సీట్లలో మహిళలకు ప్రత్యేక కోటా కేటాయింపు. రెంటికి రెండూ హిస్టరీని బ్రేక్ చేసే నిర్ణయాలే. కానీ, ఈ రెండింటికీ ముడిపెట్టి, ఒకటే గాటనకట్టి, చర్చిద్దాం, ఓటేసి ఆమోదించుకుందాం అనడమే, విపక్షానికి రుచించడం లేదు. ఆ సంఘర్షణకే అద్దం పెట్టింది పార్లమెంట్ స్పెషల్ సెషన్. మరి, ధిక్కరించిందెవరు.. గట్టిగా తిప్పికొట్టిందెవరు? ఎవరి వాదనలో ఎంత పస..? హీరో ఆఫ్ ది డేవన్ ఎవరు..?
- Balaraju Goud
- Updated on: Apr 16, 2026
- 9:45 pm
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం.. డీలిమిటేషన్పై అనుమానాలు!
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సంధించిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేదికగా ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఈ బిల్లులోని చిక్కుముడులను ప్రశ్నించారు. మహిళలకు రావాల్సిన న్యాయాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోందని ఆమె ఆరోపించారు.
- Balaraju Goud
- Updated on: Apr 16, 2026
- 7:24 pm
Parliament LIVE: దేశ రాజకీయాల్లో సూపర్ బిగ్డే..! పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లు.. లైవ్ వీడియో
దేశ రాజకీయాల్లో ఇవాళ సూపర్ బిగ్డే..! ఈరోజే పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు ముందుకు రానుంది.. నియోజకవర్గాల పునర్విభజనకు చరిత్రాత్మక అడుగు పడనుంది.. డీలిమిటేషన్పై మద్దతుకు ప్రతిపక్షాలు ససేమిరా అంటోన్నాయి.. అయితే.. దశాబ్దాలనాటి 33శాతం మహిళా రిజర్వేషన్ల కలకు తుది రూపం దాల్చనుంది. మహిళా బిల్లుకు మాత్రం విపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి..
- Shaik Madar Saheb
- Updated on: Apr 16, 2026
- 11:03 am
ఒకే ఫ్రేమ్లో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ.. పార్లమెంట్లో అరుదైన దృశ్యం.. వీడియో ఇదిగో..!
కేరళ, బెంగాల్, అస్సాం సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోరు కారణంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ క్రమంలోనే శనివారం (ఏప్రిల్ 11) భారత రాజకీయాల్లో ఒక ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అకస్మాత్తుగా ముఖాముఖి తారసపడ్డారు.
- Balaraju Goud
- Updated on: Apr 11, 2026
- 4:08 pm
Parliament Budget Session 2026: దుమ్ముదుమారం.. వాడీవేడిగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. ఇదిగో వీడియో
పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలు సోమవారం నుంచి పునఃప్రారంభం అయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు.. అత్యంత వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు సభలో కీలక చర్చతో పాటు ఓటింగ్ జరిగే అవకాశం ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Mar 9, 2026
- 11:48 am
Kishan Reddy: ‘రాహుల్ తెలంగాణ పర్యటన అందుకే’ – కిషన్ రెడ్డి విమర్శలు
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల హామీల సమీక్ష కోసం కాకుండా ‘ఆర్ఆర్ ట్యాక్స్’ లెక్కల కోసమే ఈ పర్యటన అని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, 420 ఉపహామీల అమలుపై ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ట్వీట్లో రాసుకొచ్చారు.
- Ram Naramaneni
- Updated on: Mar 2, 2026
- 7:50 pm
ప్రధాని మోదీ, కేంద్రమంత్రిపై సంచలన ఆరోపణలు.. రాహుల్కు బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరీపై రాహుల్గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది. రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే రాహుల్కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. రాహుల్ జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని స్పీకర్ను కోరారు.
- Balaraju Goud
- Updated on: Feb 12, 2026
- 1:09 pm
లోక్సభలో నిలిచిపోయిన ప్రధాని మోదీ ప్రసంగం.. సభా కార్యక్రమాలు రేపటికి వాయిదా..!
పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా చొరబాట్లు, ఎం.ఎం. నరవాణే పుస్తకంపై రాహుల్ గాంధీ ప్రభుత్వంపై దాడి చేస్తుండగా, బీజేపీ ప్రతీదాడికి దిగింది. ఈ గందరగోళం కారణంగా, సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన ప్రధాని మోదీ ప్రసంగం వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Feb 4, 2026
- 5:45 pm