AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతగా, గాంధీ కుటుంబానికి వారసుడిగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి 1970 జూన్ 19న రాహుల్ గాంధీ ఢిల్లీలో జన్మించారు. 2017 డిసెంబరు నుంచి 2019 ఆగస్టు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం తర్వాత పార్టీ సారథ్య పగ్గాలు విడిచిపెట్టారు. యూపీలో గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీ నియోజకవర్గానికి 2004 నుంచి 2019 వరకు మూడు పర్యాయాలు రాహుల్ ప్రాతినిథ్యంవహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు.. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఐదు మాసాల వ్యవధిలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సాగింది.

జోడోయాత్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన చిన్ననాటి జ్ఞాపకాల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలపై ఇందులో రాహుల్ గాంధీ బదులిచ్చారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. నాయనమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తి లాంటి వారన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు కూడా రాహుల్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. మంచి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదన్నారు. పెళ్లికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన అమ్మానాన్నది ప్రేమ వివాహమని గుర్తుచేసుకున్న రాహుల్.. తనకు ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలన్నారు. నాన్ వెజ్ అంటే రాహుల్‌కి ఎంతో ఇష్టం.. కార్లపై అంతగా మోజు లేదని.. బైక్స్ నడపడం అంటే ఇష్టమన్నారు రాహుల్.

ఇంకా చదవండి

లోక్‌సభలో నిలిచిపోయిన ప్రధాని మోదీ ప్రసంగం.. సభా కార్యక్రమాలు రేపటికి వాయిదా..!

పార్లమెంటు బడ్జెట్ సమావేశంలో అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా చొరబాట్లు, ఎం.ఎం. నరవాణే పుస్తకంపై రాహుల్ గాంధీ ప్రభుత్వంపై దాడి చేస్తుండగా, బీజేపీ ప్రతీదాడికి దిగింది. ఈ గందరగోళం కారణంగా, సాయంత్రం 5 గంటలకు జరగాల్సిన ప్రధాని మోదీ ప్రసంగం వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.

లోక్‌సభలో దుమారం రేపిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. రాహుల్‌ ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ సభ్యులు

చైనాతో సరిహద్దు వివాదంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకుంది. బీజేపీ సభ్యుల నినాదాల మధ్య రాహుల్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రిటైర్డ్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నరవణే రాసిన పుస్తకంలోని వ్యాఖ్యలను రాహుల్‌ప ప్రస్తావించడాన్ని కేంద్రం తప్పుపట్టింది. దేశాన్ని , సైన్యాన్ని రాహుల్‌ పదేపదే అవమానిస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్‌ కూడా రాహుల్‌ తీరును తప్పుపట్టారు.

దేశ ఆర్థిక గమనాన్ని డిసైడ్‌ చేసేందుకు రంగం సిద్ధం.. నేటి నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు!

నేడు బుధవారం (జనవరి 28, 2026) నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించిన కేంద్రం.. బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరింది. అటు.. అధికార, ప్రతిపక్షాలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. పార్లమెంట్‌ సమావేశాల్లో ఏఏ అంశాలపై గళమెత్తాలనేదానిపై అన్ని పార్టీలూ అజెండా ఫిక్స్‌ చేసుకోవడం ఆసక్తి రేపుతోంది.

అంబరాన్నంటుతున్న న్యూ ఇయర్‌ సంబరాలు.. దేశప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

సరికొత్త లైటింగ్స్​, లేజర్‌ షోలు, టపాసుల మోతలు, కేక్‌ కటింగ్‌లు, యువత ఉత్సాహం నడుమ కొత్త సంవత్సరం 2026 ఘనంగా ప్రారంభమైంది. నూతన సంవత్సర వేడుకలు అంతటా అట్టహాసంగా జరిగాయి. ప్రపంచ దేశాలతో పాటు దేశవ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు, ఆశయాలతో హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ 2026కి ఘన స్వాగతం పలికారు.

Rahul Gandhi: మోదీ సర్కార్ పై జర్మనీలో రాహుల్ గాంధీ విమర్శలు

జర్మనీలో రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈడీ, సీబీఐలను రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలపై కేసులు సున్నా కాగా, కాంగ్రెస్ మద్దతుదారులపై కేసులు పెడుతున్నారని తెలిపారు. బీజేపీ సంస్థాగత నిర్మాణాలను సొంతం చేసుకుందని విమర్శించారు.

  • Phani CH
  • Updated on: Dec 23, 2025
  • 3:57 pm

Rahul Gandhi: నేడు హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ!

గోట్ ఇండియాల టూర్‌లో భాగంగా శనివారం ప్రపంచ ఫుడ్‌బాల్‌ లెజెండ్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈవెంట్‌లో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ ఫుడ్‌బాల్ మ్యాచ్ కూడా ఆడనున్నారు. అయితే ఈ కాక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రానున్నట్టు తెలుస్తోంది.

Parliament Winter Session Live: దుమ్ముదుమారమే.. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఇప్పటికే అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి.. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 11 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతుంది. కేంద్ర ఎక్సైజ్ సవరణ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు పార్లమెంట్‌ సమావేశాలకు విపక్షాలు అడ్డుపడొద్దని ప్రధాని మోదీ కోరారు.

Parliament Winter Session: రేపట్నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులు ఇవే!

ఢిల్లీ వాయు కాలుష్యం ఈసారి పార్లమెంట్‌ను కమ్మేయనుంది.. అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రజలు శ్వాసించాలంటే భయపడేలా ఉన్న వాయు నాణ్యత గురించి దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్లో చర్చ పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీత‌కాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తనున్నాయి. సోమవారం మొదలై డిసెంబర్ 19 వరకు 15 సిట్టింగుల్లో జరిగే సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి.

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు.. ఎప్పటినుంచంటే..?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 19 వరకు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితాపై స్పష్టత ఇచ్చిన ఈసీ!

కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల దొంగతనం అంశాన్ని లేవనెత్తారు. బుధవారం (నవంబర్ 5) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ ఆరోపణలకు సంబంధించి ఎన్నికల సంఘం ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.

దీపావళి వేళ బేసన్ లడ్డూలు తయారు చేసిన రాహుల్ గాంధీ.. వీడియో చూడండి..!

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని ప్రత్యేకంగా జరుపుకోవడానికి, రాహుల్ గాంధీ పాత ఢిల్లీలోని ప్రసిద్ధ మిఠాయి దుకాణం ఘంటేవాలా స్వీట్ షాపును సందర్శించారు. అక్కడ ఆయన శనగపిండి లడ్డూలను తయారు చేయడానికి ప్రయత్నించారు.

ఓట్ల తొలగింపుపై రాహుల్‌ ఆరోపణలు అర్ధరహితం.. ఆన్‌లైన్‌లో ఓట్ల తొలగింపు అసాధ్యం: ఈసీ

రాహుల్‌గాంధీ ఓట్ల దొంగతనం ఆరోపణలపై వివాదం మళ్లీ రాజుకుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని రాహుల్‌ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్‌గాంధీ ఆరోపణలకు ఆధారాలు లేవని , అర్ధరహితమని ఈసీ కొట్టిపారేసింది.