రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతగా, గాంధీ కుటుంబానికి వారసుడిగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి 1970 జూన్ 19న రాహుల్ గాంధీ ఢిల్లీలో జన్మించారు. 2017 డిసెంబరు నుంచి 2019 ఆగస్టు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం తర్వాత పార్టీ సారథ్య పగ్గాలు విడిచిపెట్టారు. యూపీలో గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీ నియోజకవర్గానికి 2004 నుంచి 2019 వరకు మూడు పర్యాయాలు రాహుల్ ప్రాతినిథ్యంవహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు.. వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఐదు మాసాల వ్యవధిలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సాగింది.
జోడోయాత్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన చిన్ననాటి జ్ఞాపకాల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలపై ఇందులో రాహుల్ గాంధీ బదులిచ్చారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. నాయనమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తి లాంటి వారన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు కూడా రాహుల్ తనదైన శైలిలో జవాబిచ్చారు. మంచి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదన్నారు. పెళ్లికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన అమ్మానాన్నది ప్రేమ వివాహమని గుర్తుచేసుకున్న రాహుల్.. తనకు ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలన్నారు. నాన్ వెజ్ అంటే రాహుల్కి ఎంతో ఇష్టం.. కార్లపై అంతగా మోజు లేదని.. బైక్స్ నడపడం అంటే ఇష్టమన్నారు రాహుల్.
Parliament Winter Session Live: దుమ్ముదుమారమే.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.. ఇప్పటికే అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి.. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 11 కీలక బిల్లులు ప్రవేశపెట్టబోతుంది. కేంద్ర ఎక్సైజ్ సవరణ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు పార్లమెంట్ సమావేశాలకు విపక్షాలు అడ్డుపడొద్దని ప్రధాని మోదీ కోరారు.
- Shaik Madar Saheb
- Updated on: Dec 1, 2025
- 11:11 am
Parliament Winter Session: రేపట్నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ప్రవేశపెట్టబోయే బిల్లులు ఇవే!
ఢిల్లీ వాయు కాలుష్యం ఈసారి పార్లమెంట్ను కమ్మేయనుంది.. అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రజలు శ్వాసించాలంటే భయపడేలా ఉన్న వాయు నాణ్యత గురించి దేశ అత్యున్నత చట్ట సభ అయిన పార్లమెంట్లో చర్చ పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తనున్నాయి. సోమవారం మొదలై డిసెంబర్ 19 వరకు 15 సిట్టింగుల్లో జరిగే సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి.
- Gopikrishna Meka
- Updated on: Nov 30, 2025
- 12:59 pm
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు.. ఎప్పటినుంచంటే..?
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతాయని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. అన్ని అంశాలపై చర్చించేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
- Balaraju Goud
- Updated on: Nov 8, 2025
- 1:25 pm
రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఓటర్ల జాబితాపై స్పష్టత ఇచ్చిన ఈసీ!
కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల దొంగతనం అంశాన్ని లేవనెత్తారు. బుధవారం (నవంబర్ 5) ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిగ్గింగ్ జరిగిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ ఆరోపణలకు సంబంధించి ఎన్నికల సంఘం ముఖ్యమైన సమాచారాన్ని అందించింది.
- Balaraju Goud
- Updated on: Nov 5, 2025
- 4:02 pm
దీపావళి వేళ బేసన్ లడ్డూలు తయారు చేసిన రాహుల్ గాంధీ.. వీడియో చూడండి..!
కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని ప్రత్యేకంగా జరుపుకోవడానికి, రాహుల్ గాంధీ పాత ఢిల్లీలోని ప్రసిద్ధ మిఠాయి దుకాణం ఘంటేవాలా స్వీట్ షాపును సందర్శించారు. అక్కడ ఆయన శనగపిండి లడ్డూలను తయారు చేయడానికి ప్రయత్నించారు.
- Balaraju Goud
- Updated on: Oct 20, 2025
- 4:40 pm
ఓట్ల తొలగింపుపై రాహుల్ ఆరోపణలు అర్ధరహితం.. ఆన్లైన్లో ఓట్ల తొలగింపు అసాధ్యం: ఈసీ
రాహుల్గాంధీ ఓట్ల దొంగతనం ఆరోపణలపై వివాదం మళ్లీ రాజుకుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని రాహుల్ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్గాంధీ ఆరోపణలకు ఆధారాలు లేవని , అర్ధరహితమని ఈసీ కొట్టిపారేసింది.
- Balaraju Goud
- Updated on: Sep 19, 2025
- 9:44 am
Rahul Gandhi: ఓట్ల తొలగింపు వెనుక అజ్ఞాత శక్తులున్నాయ్.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
సెంట్రలైజ్డ్ వ్యవస్థ ద్వారా పథకం ప్రకారం ఓట్లు డిలీట్ చేస్తున్నారు.. ఆరోపణలు కాదు.. పక్కా ఆధారాలతో నేను మాట్లాడుతున్నా.. అంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేరుతో రాహుల్గాంధీ గురువారం ప్రెస్మీట్ నిర్వహించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో వేల ఓట్లు తొలగించారని.. ఫేక్ లాగిన్స్, డిజిటల్ ఫామ్స్తో ఓట్లు తొలగిస్తున్నారన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 18, 2025
- 11:31 am
Telangana Congress: కామారెడ్డికి రాహుల్ గాంధీ..? కాంగ్రెస్ నేతల కీలక భేటీ.. నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ!
హైదరాబాద్ గాంధీభవన్లో ఇవాళ్టి కాంగ్రెస్ నేతల భేటీ ఆసక్తి రేపుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన విస్తృత సమావేశం జరగనుంది.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు . ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది కాంగ్రెస్.. ఆ మీటింగ్కి సంబంధించి ఏర్పాట్లపై ఈ భేటీలో చర్చించబోతున్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Sep 8, 2025
- 10:23 am
Election Commission: అసత్య ప్రచారం చేస్తూ భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు: సీఈసీ జ్ఞానేష్ కుమార్
దేశంలో ఓట్ చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల సవరణ అంశంతోపాటు.. ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ జాబితా అంతా డొల్లతనమనీ విమర్శిస్తూ ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్లు, ప్రజెంటేషన్లు, వీడియోలతో రాహుల్గాంధీ ఎన్నికల సంఘంపై పలు ఆరోపణలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 17, 2025
- 5:19 pm
Independence Day: వర్షంలో తడిసిపోతూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాహుల్ గాంధీ
యావత్ భారతావని 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులను కీర్తించుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రవేటు సంస్థల్లోనూ జెండావిష్కర కనులపండువగా సాగింది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండావిష్కరణ జరిగింది.
- Balaraju Goud
- Updated on: Aug 15, 2025
- 12:38 pm