రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతగా, గాంధీ కుటుంబానికి వారసుడిగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి 1970 జూన్ 19న రాహుల్ గాంధీ ఢిల్లీలో జన్మించారు. 2017 డిసెంబరు నుంచి 2019 ఆగస్టు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం తర్వాత పార్టీ సారథ్య పగ్గాలు విడిచిపెట్టారు. యూపీలో గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీ నియోజకవర్గానికి 2004 నుంచి 2019 వరకు మూడు పర్యాయాలు రాహుల్ ప్రాతినిథ్యంవహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు.. వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఐదు మాసాల వ్యవధిలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సాగింది.
జోడోయాత్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన చిన్ననాటి జ్ఞాపకాల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలపై ఇందులో రాహుల్ గాంధీ బదులిచ్చారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. నాయనమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తి లాంటి వారన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు కూడా రాహుల్ తనదైన శైలిలో జవాబిచ్చారు. మంచి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదన్నారు. పెళ్లికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన అమ్మానాన్నది ప్రేమ వివాహమని గుర్తుచేసుకున్న రాహుల్.. తనకు ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలన్నారు. నాన్ వెజ్ అంటే రాహుల్కి ఎంతో ఇష్టం.. కార్లపై అంతగా మోజు లేదని.. బైక్స్ నడపడం అంటే ఇష్టమన్నారు రాహుల్.
ఇంకా చదవండికాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..! ఎవరో తెలుసా..?
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జెన్ జెడ్ (Gen Z) యువత, విద్యార్థులతో నేరుగా మమేకమయ్యేందుకు కొత్త ప్రయత్నం ప్రారంభించారు. ఇన్స్టాగ్రామ్లో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (Ask Me Anything) సెషన్ నిర్వహించారు. విద్యార్థుల నిరసనలు, విద్యా వ్యవస్థ, మహిళా విద్య, రాజకీయాలు వంటి అంశాలతో పాటు బాట్మాన్ వంటి సరదా ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చారు.
- Balaraju Goud
- Updated on: Aug 7, 2026
- 12:34 pm
Anti-Paper Leak Bill 2026: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం.. కీలక నిబంధనలు ఇవే..
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో సభ్యులు బిల్లుకు ఆమోదం తెలిపారు. కాగా, విపక్షాల సవరణలు విగిపోయాయి.. బిల్లు ఆమోదం అనంతరం విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ రేపటికి వాయిదా పడింది. పరీక్షా పేపర్ లీక్ కు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకునేలా Anti-Paper Leak Bill 2026 రూపొందించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 29, 2026
- 7:26 pm
లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ.. కేంద్రం తీరుపై రాహుల్గాంధీ తీవ్ర విమర్శలు
పేపర్ లీక్పై ఏం జరిగిందో ప్రభుత్వానికి తెలియాలంటే బీజేపీ ఎంపీలు వారి పిల్లలను అడగాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్పై విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారని అన్ని పార్టీలు విద్యార్థులు ఆందోళనను గౌరవించాలన్నారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది నిరసన కాదని అది భావప్రకటన స్వేచ్ఛని రాహుల్ గాంధీ కేంద్రాన్ని దుయ్యబట్టారు.
- Ram Naramaneni
- Updated on: Jul 29, 2026
- 1:27 pm
ప్రశ్నపత్రం లీక్ చేస్తే ఇక తప్పించుకోలేరు.. కఠిన శిక్షల బిల్లుపై నేడు పార్లమెంటులో చర్చ
నీట్-యూజీ పరీక్షల పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026పై లోక్సభలో మంగళవారం (జూలై 28) కీలక చర్చ జరగనుంది. నీట్ అంశంపై వరుసగా ఆరు రోజుల పాటు పార్లమెంట్లో కొనసాగిన ప్రతిష్టంభన అనంతరం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చకు అంగీకారం కుదరడంతో ఈ బిల్లు సభలో ప్రధాన అజెండాగా మారింది.
- Balaraju Goud
- Updated on: Jul 28, 2026
- 9:21 am
విద్యార్థుల ఆందోళన నుంచి సంస్కరణల వరకు.. ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
సీజేపీ ఆందోళన విరమణ ఓకే! మరి సోమవారం నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా? కీలకమైన బిల్లులు సభలో ప్రవేశపెట్టే పరిస్థితి ఉంటుందా? ఇన్నాళ్లు నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల ఆందోళనలతో పరిస్థితి అట్టుడికిపోయింది. ఇప్పటికైతే అంతా ప్రశాంతంగానే ఉన్నప్పటికీ.. ప్రతిపక్షాలు మాత్రం ఈ ఇష్యూను ఇంతటితో వదిలిపెట్టేలా లేవు. రాహుల్ గాంధీ తన లేఖలో సంధించిన ప్రశ్నలు, ఇటు ప్రభుత్వం తెస్తున్న సరికొత్త బిల్లు మధ్య.. సోమవారం నుంచి సెషన్స్ ఎలా ఉంటాయన్నది కాస్త ఉత్కంఠగానే ఉంది.
- Shaik Madar Saheb
- Updated on: Jul 26, 2026
- 8:59 pm
ఢిల్లీలో CJP ఆందోళనలపై కేంద్ర నిఘా వర్గాల అనుమానాలు!
ఇండియా అన్లిమిటెడ్.. ఇండియా అన్స్టాపబుల్.. ఇండియా అన్బీటబుల్.. విశాలమైన భూభాగం, పెరుగుతున్న యువ జనాభా, అనుకూలమైన భౌగోళిక స్థితి, పవర్ఫుల్ డెమొక్రసీ, పటిష్టమైన సైనిక శక్తి, సురక్షితమైన విదేశాంగ విధానం.. ఇలా భారతదేశానికి ఉన్న సూపర్ స్పెషాలిటీస్ గురించి చాలానే చెప్పుకోవచ్చు. పైగా, ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. మన ఐటీ ప్రొఫెషనల్స్ సోకాల్డ్ అగ్రరాజ్యాలకు ఆక్సిజన్ అవుతున్నారు. ఒక రకంగా 'గ్లోబల్ సౌత్' మొత్తాన్నీ లీడ్ చేస్తోంది హమారా భారత్. అమెరికా, రష్యా, యూరోపియన్ కంట్రీస్తో బలమైన దౌత్య సంబంధాలతో పూర్తిగా సేఫ్జోన్లో ఉంది భారత్. ముఖ్యంగా అతితక్కువ యుద్ధభయం ఉన్న దేశంగా చెప్పుకోవచ్చు. ఉపఖండం చుట్టూ శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడిగి, రాజకీయ స్థిరత్వం లేక ప్రపంచం ముందు చులకనైపోయినా.. భారతదేశం మాత్రం దశాబ్దాల తరబడి స్టెబుల్గా స్టాండర్డ్గా నిలబడింది. అందుకే, ఎక్కడో ఎవ్వడికో కన్నుకుట్టింది. లేక ఎటు నుంచైనా దిష్టి తగిలుండొచ్చు. ఇంటర్నల్ ఇండియా కొద్దికొద్దిగా వేడెక్కుతున్నట్టుంది. వారం పది రోజులుగా తడబడుతున్నట్టుంది లాఅండ్ ఆర్డర్. హాట్హాట్గా మారిన ఢిల్లీ ఫైల్స్.. నిఘా వర్గాలు ఏం చెబుతున్నాయి?
- Balaraju Goud
- Updated on: Jul 22, 2026
- 10:01 pm
నీట్ పేపర్ లీక్ ఆందోళనలపై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా
నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. పేపర్ లీక్ అంశాన్ని కొందరు రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సైతం పేపర్ లీక్ ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉందని మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.
- Balaraju Goud
- Updated on: Jul 22, 2026
- 9:14 pm
పేపర్ లీక్లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్.. సర్కార్ ముందు మూడు కీలక డిమాండ్లు
దేశవ్యాప్తంగా పేపర్ లీక్లు, నీట్ పరీక్ష వివాదం, విద్యార్థుల నిరసనల నేపథ్యంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరా భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న లోపాలు, ప్రశ్నపత్రాల లీక్లు, విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు మూడు కీలక డిమాండ్లను ఉంచారు.
- Balaraju Goud
- Updated on: Jul 22, 2026
- 5:06 pm
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారంటే..
నీట్ పేపర్ లీక్ అంశంపై కాంగ్రెస్ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ రాజకీయ ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆరోపించారు. ప్రధాని నివాసం ఎదుట రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన నిరసనపై స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఇది భారత రాజకీయ చరిత్రలో ఒక చీకటి రోజని పేర్కొంటూ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాంగ్రెస్ ఉల్లంఘించిందని విమర్శించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 22, 2026
- 10:37 am
పార్లమెంటులో పోటాపోటీ వ్యూహాలు.. మారిన బలాబలాలు.. మోదీ సర్కార్ పంతం నెగ్గేనా?
దేశంలో మిగతా ప్రాంతాల మాటేమో గాని, రాజధాని ఢిల్లీని మాత్రం గట్టిగానే తాకినట్టుంది ఎల్నినో ఫియర్. వాతావరణం వేడెక్కి, ఉరుములు మెరుపులతో తల్లడిల్లుతోంది ఢిల్లీ నగరం. వర్షాకాల సమావేశాల్లో కూడా గరంగరంగా మారింది క్యాపిటల్ సిటీ. సభ లోపలే కాదు, ఢిల్లీ వీధులు కూడా గరం మీదున్నాయి. ముఖ్యంగా రాహుల్ వర్సెస్ మోదీ.. మైండ్గేమ్తో ఢిల్లీలో హైటెంపరేచర్లు.. 2026 జూలై 20... మోదీ సర్కార్కి ఒకరకంగా అండర్లైన్ చేసుకోవాల్సిన తారీఖు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చాలా కాలం యాదుండే రోజు కూడా. గత సమావేశాల్లో రాజ్యాంగసవరణ కోసం చేసిన తీర్మానం వీగిపోయి సభాముఖంగా తొలిసారి తలదించుకున్న ఎన్డీఏ ప్రభుత్వం, మళ్లీ ఈ సెషన్లోనే తలెత్తుకు నిలబడిన రోజు. ఉభయ సభల్లోనూ బలగం పెంచుకుని రెట్టించిన ఉత్సాహంతో పెర్ఫామ్ చేయాలని డిసైడైంది కూడా ఈరోజే. కానీ, మోదీ టీమ్ ఎంత గొప్ప కాన్ఫిడెన్స్తో సభకు వచ్చిందో, అంతకంటే ఎక్కువగా కాంట్రవర్సీలే రిజిస్టర్ అయ్యాయి. సభ లోపలా, వెలుపలా బిగ్ అండ్ బిగ్గర్ క్వశ్చన్ మార్కులు ఎదురయ్యాయి. దీటుగా ఢీకొని, వింటర్ సెషన్ మొత్తాన్ని ఇదే టెంపోతో కంటిన్యూ చేయాలన్నది ఎన్డీఏ సంకల్పం. కానీ, ఆగస్ట్ 13 వరకూ మొత్తం 19 వర్కింగ్డేస్లో జరిగే పార్లమెంటు వానాకాలం సమావేశాల్లో ఇంకా ఎన్నెన్ని ఉరుములు, మెరుపులు? వాతావరణం ఎన్ని వంకర్లు తిరుగుతుంది..? జంతర్మంతర్ పరిసరాల్లో టెన్షన్ఫ్రీ ఎట్మాస్ఫియర్ ఎప్పటికి క్రియేటౌతుంది? వాడీవేడిగా ఢిల్లీ ఫైల్స్..
- Balaraju Goud
- Updated on: Jul 21, 2026
- 9:40 pm
రాహుల్ గాంధీ ధర్నాపై ఆప్ నేత సంచలన వ్యాఖ్యలు.. సంజయ్ ఆరోపణలతో రాజకీయ దుమారం!
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి నివాసం ఎదుట చేపట్టాల్సిన నిరసనను బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడితో రాహుల్ గాంధీ తన నివాసంలోనే ధర్నాకు పరిమితమయ్యారని సంజయ్ సింగ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
- Balaraju Goud
- Updated on: Jul 21, 2026
- 6:28 pm
Parliament Session: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రత్యక్ష ప్రసారం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు వంటి కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. సమావేశాలకు ముందే అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి పెరిగింది. ఒకవైపు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఇండియా కూటమి వ్యూహరచన చేయగా, మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగి దేశాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jul 20, 2026
- 11:25 am