
రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతగా, గాంధీ కుటుంబానికి వారసుడిగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి 1970 జూన్ 19న రాహుల్ గాంధీ ఢిల్లీలో జన్మించారు. 2017 డిసెంబరు నుంచి 2019 ఆగస్టు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం తర్వాత పార్టీ సారథ్య పగ్గాలు విడిచిపెట్టారు. యూపీలో గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీ నియోజకవర్గానికి 2004 నుంచి 2019 వరకు మూడు పర్యాయాలు రాహుల్ ప్రాతినిథ్యంవహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు.. వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఐదు మాసాల వ్యవధిలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సాగింది.
జోడోయాత్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన చిన్ననాటి జ్ఞాపకాల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలపై ఇందులో రాహుల్ గాంధీ బదులిచ్చారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. నాయనమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తి లాంటి వారన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు కూడా రాహుల్ తనదైన శైలిలో జవాబిచ్చారు. మంచి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదన్నారు. పెళ్లికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన అమ్మానాన్నది ప్రేమ వివాహమని గుర్తుచేసుకున్న రాహుల్.. తనకు ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలన్నారు. నాన్ వెజ్ అంటే రాహుల్కి ఎంతో ఇష్టం.. కార్లపై అంతగా మోజు లేదని.. బైక్స్ నడపడం అంటే ఇష్టమన్నారు రాహుల్.
Telangana: చేసిన పని చెప్పుకుందాం.. రాహుల్, ఖార్గేలతో భారీ సభలకు కాంగ్రెస్ ఫ్లాన్..!
ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు అధ్యయనం కోసం అక్టోబర్ 11న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ను నియమించింది తెలంగాణ సర్కార్. క సభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్ట్కు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
- Balaraju Goud
- Updated on: Feb 7, 2025
- 1:34 pm
Rahul Gandhi: తెలంగాణలో కులగణన పూర్తి చేశాం.. లోక్సభలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో కులగణన పూర్తి చేశాం.. ఈ కులగణనలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.. అంటూ లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో 90 శాతం జనాభా ఉన్న ఓబీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు హక్కులు దక్కడం లేదంటూ పేర్కొన్నారు.
- Shaik Madar Saheb
- Updated on: Feb 3, 2025
- 3:50 pm
Delhi Elections: ఎవరికి వారే “యమునా” తీరే, నదీ కాలుష్యంపై ఒకరిపై ఒకరు సెటైర్లు
ఇండీ కూటమి ఏర్పాటైనప్పుడు కాంగ్రెస్, ఆప్ పార్టీలు మిత్రులుగానే ఉన్నాయి. కానీ..ఆ తరవాత క్రమంగా వీళ్ల మధ్య దూరం పెరిగింది. లోక్సభ ఎన్నికలప్పుడే వీళ్ల మధ్య విభేదాలు వచ్చాయి. ఎవరి ప్రియార్టీస్ వాళ్లకు ఉండడం, ఎవరి సిద్ధాంతాలు వాళ్లవి కావడం వల్ల పెద్దగొ పొసగలేదు. అప్పుడు మొదలైన దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సందర్బంగా ఈ దూరం కాస్తా వైరంగా మారింది.
- Ram Naramaneni
- Updated on: Feb 3, 2025
- 1:41 pm
Congress: ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ‘ఈగిల్’ గ్రూప్ ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఈగిల్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఈ బృందం ఎన్నికలపై నిఘా పెట్టనుంది. దీంతో పాటు గతంలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదికను పార్టీ హైకమాండ్కు అందజేయనుంది.
- Balaraju Goud
- Updated on: Feb 2, 2025
- 9:39 pm
Delhi Election-2025: ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏ పార్టీ ఏమేమి హామీలు ఇచ్చాయి?
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5న ఓటింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలతో ఓటర్లను తెగ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా కేంద్రంగా పథకాలను ప్రవేశపెట్టేందుకు ఉచితాలు అందించే పోటీ పడుతున్నాయి. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రధాన ప్రత్యర్థి బీజేపీ, కాంగ్రెస్ ఓటర్లలో పట్టు సాధించేందుకు ఒకే తరహాలో అనేక ఉచితాలను ప్రకటించాయి.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Jan 26, 2025
- 4:40 pm
JP Nadda: దాచనక్కర్లేదు.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో అసలు నిజం బయటపడింది.. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఫైర్
ప్రతిపక్షం బీజేపీతో మాత్రమే కాదు.. దేశంతోనూ పోరాడుతోందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపాయి.. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అసలు రూపం, నిజం బహిర్గతమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 15, 2025
- 7:16 pm
Delhi Elections: రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేజ్రీవాల్ కౌంటర్.. శరద్ పవర్ మద్దతు ఎవరికో తెలుసా..?
ఢిల్లీలో త్రిముఖ పోరు ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం చేపట్టిన రాహుల్ అటు బీజేపీ, ఇటు ఆప్ను టార్గెట్ చేస్తున్నారు.. అయితే రాహుల్కు అదేస్థాయిలో కౌంటరిచ్చారు కేజ్రీవాల్. ఆప్ను ఓడించడానికి బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని విమర్శించారు. ఈ క్రమంలోనే.. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Shaik Madar Saheb
- Updated on: Jan 14, 2025
- 9:20 pm
Delhi Elections: ఢిల్లీలో రాహుల్ ఎన్నికల ప్రచారం షురూ.. మోదీ, కేజ్రీపై విసుర్లు
Delhi Election News: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంటోంది. మూడు పార్టీలు ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ధరల నియంత్రణలో ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ఇద్దరూ విఫలం చెందారని ఆయన ధ్వజమెత్తారు.
- Janardhan Veluru
- Updated on: Jan 13, 2025
- 9:23 pm
Congress Working Committee: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాలు ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యం.. ఎందుకిలా..?
గత పదేళ్లలో దేశంలో 2 పర్యాయాలు లోక్సభకు ఎన్నికలు జరగ్గా, 53 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటిలో 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ 2 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోగా, 40కి పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. కొన్ని రాష్ట్రాల్లో గెలుపొందినప్పటికీ.. అది కాంగ్రెస్ ఘనత కాదని, అప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీలపై ఏర్పడ్డ వ్యతిరేకత గెలిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Mahatma Kodiyar, Delhi, TV9 Telugu
- Updated on: Dec 29, 2024
- 7:53 pm
Rahul Gandhi: రాహుల్ గాంధీకి మరోసారి కేసుల కష్టాలు.. నోటీసులు జారీ చేసిన బరేలి కోర్టు.. ఎందుకంటే?
కులగణనపై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలతో దేశంలో అంతర్యుద్దం వచ్చే ప్రమాదముందని యూపీ లోని బరేలి కోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు జనవరి 7వ తేదీన హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిని బహిరంగ సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రస్తావించారు పిటిషనర్.
- Balaraju Goud
- Updated on: Dec 22, 2024
- 9:12 pm