రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ నేతగా, గాంధీ కుటుంబానికి వారసుడిగా ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంది. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, సోనియా గాంధీకి 1970 జూన్ 19న రాహుల్ గాంధీ ఢిల్లీలో జన్మించారు. 2017 డిసెంబరు నుంచి 2019 ఆగస్టు వరకు ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాభవం తర్వాత పార్టీ సారథ్య పగ్గాలు విడిచిపెట్టారు. యూపీలో గాంధీ కుటుంబానికి కంచుకోటలాంటి అమేథీ నియోజకవర్గానికి 2004 నుంచి 2019 వరకు మూడు పర్యాయాలు రాహుల్ ప్రాతినిథ్యంవహించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి చెందారు.. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంతో 2022 సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఐదు మాసాల వ్యవధిలో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 4,080 కిలో మీటర్లు రాహుల్ పాదయాత్ర సాగింది.

జోడోయాత్ర జరుగుతున్న సమయంలో ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన చిన్ననాటి జ్ఞాపకాల దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని అంశాలపై ఇందులో రాహుల్ గాంధీ బదులిచ్చారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి.. రాహుల్ ప్రముఖంగా ప్రస్తావించారు. నాయనమ్మ ఇందిరా గాంధీ అంటే తనకు ఎంతో ప్రేమని, ఆమె తనకు మరో మాతృమూర్తి లాంటి వారన్నారు. ఈ సమయంలో కాబోయే భార్య ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు కూడా రాహుల్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. మంచి సుగుణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదన్నారు. పెళ్లికి తాను వ్యతిరేకం కాదన్నారు. తన అమ్మానాన్నది ప్రేమ వివాహమని గుర్తుచేసుకున్న రాహుల్.. తనకు ఇంటెలిజెంట్ అమ్మాయి అయితే చాలన్నారు. నాన్ వెజ్ అంటే రాహుల్‌కి ఎంతో ఇష్టం.. కార్లపై అంతగా మోజు లేదని.. బైక్స్ నడపడం అంటే ఇష్టమన్నారు రాహుల్.

ఇంకా చదవండి

Weather Report: కరీంనగర్‌లో దంచికొట్టిన వాన.. రాహుల్ గాంధీ సభ రద్దు! మరో 5 రోజులు వానలే వానలు

కరీంనగర్ జిల్లాలో మంగళవారం (మే 7) మధ్యాహ్నం వర్షం దంచికొట్టింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రోజంతా భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయితే మధ్యాహ్నం 3.30 గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో జనాలు సేద తీరారు. ఈదురు గాలులకు పలు చోట్ల టెంట్లు కుప్పకూలి పోయాయి..

Telangana: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు.. రిజర్వేషన్ల ఇష్యూపై ఏమన్నారంటే…

రిజర్వేషన్లపై రాజకీయ రణం పీక్స్‌కు చేరుతోంది. అమిత్ షా, రాహుల్ గాంధీ ఎంట్రీతో తెలంగాణ పాలిటిక్స్‌లో రిజర్వేషన్ల అంశం హైలెట్‌గా మారింది. ఎవరికి వారు ఈ అంశంపై తమ పార్టీ స్టాండ్ ఏంటో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Top Stars Campaign: తెలంగాణను రౌండప్ చేయనున్న అగ్రనేతలు.. మోదీ, అమిత్‌షా, రాహుల్, ప్రియాంక ప్రచారం

ఆఖరాటకు కౌంట్‌డౌన్ మొదలైంది. పోలింగ్ తేదీ దగ్గరపడ్డంతో టోటల్ తెలంగాణను రౌండప్ చెయ్యడానికి సిద్ధం అంటున్నారు జాతీయనేతలు. నాలుగురోజులు-నలుగురు టాప్‌ స్టార్స్.. తుది విడత ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు. ఎవరెవరు.. ఎక్కడెక్కడ టూరేస్తారు..? తెలంగాణ ప్రచారంలో వాళ్లిచ్చే ఫినిషింగ్ టచ్ ఎలా ఉండబోతోంది? తాయిలాలు ఏమైనా ప్రకటిస్తారా? అన్నదీ హాట్‌టాపిక్‌గా మారింది.

Congress: ఎన్నికల ప్రచార బరిలోకి ఏఐసిసి పెద్దలు.. తెలంగాణలో దూసుకుపోతున్న కాంగ్రెస్..

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. రేపటి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలోకి రాబోతున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకుల ఎన్నికల సభలకు రాష్ట్ర కాంగ్రెస్ షెడ్యూల్‎ని సిద్ధం చేసింది. పార్లమెంటు ఎన్నికలక గడువు దగ్గర పడుతున్న కొద్ది ప్రచారంలో జోష్ పెరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలను.. కార్నర్ మీటింగ్లతో దూకుడు పెంచారు.

Priyanka Gandhi: రాహుల్‌గాంధీని యువరాజు అని విమర్శిస్తున్న బీజేపీకి ప్రియాంక కౌంటర్

రాహుల్‌గాంధీని యువరాజు అని విమర్శిస్తున్న ప్రధాని మోదీకి గట్టి కౌంటరిచ్చారు ప్రియాంకాగాంధీ. మోదీ షహెన్‌షా .. చక్రవర్తి లాంటివారని , ప్యాలెస్‌లో ఉంటూ ప్రజలను కలవడం లేదని విమర్శించారు. ఆమె ఏం కామెంట్స్ చేశారో తెలుసుకుందాం పదండి....

Congress List: రాయ్‌బరేలీ నుండి రాహుల్ గాంధీ, అమేథీ నుండి కేఎల్ శర్మ.. మరోసారి పోటీకి దూరంగా ప్రియాంక గాంధీ

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ ఈరోజు అభ్యర్థులను ఖరారు చేసింది. నామినేషన్ల దాఖలు ముగియడానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎట్టకేలకు రాయ్‌బరేలీ, అమేథీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. రాయబరేలి నుంచి రాహుల్ గాంధీ అభ్యర్థిగా పేరును ప్రకటించిన ఏఐసీసీ, అమేఠీ నుంచి పోటీలో కిషోర్ లాల్ శర్మ పేరును ఖరారు చేసింది.

PM Modi: కాంగ్రెస్ యువరాజు కోసం పాకిస్థాన్‌లో ప్రార్థనలు జరుగుతున్నాయి.. మోదీ సంచలన వ్యాఖ్యలు

గుజరాత్‌లోని ఆనంద్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌, ఆ పార్టీ ఎంపీ రాహుల్‌గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ యువకులు రాజ్యాంగాన్ని తలపై పెట్టుకుని నృత్యం చేస్తున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యువరాజు కోసం పాకిస్థాన్‌లో ప్రార్థనలు జరుగుతున్నాయన్నారు.

Lok Sabha Election: ఓటు పడకుండానే గెలుపు తీరాలకు బీజేపీ.. ఖజురహో-ఇండోర్-సూరత్ స్థానాల్లో కాంగ్రెస్ ఎలా ఓడిపోయింది?

కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష కూటమి ఇండియాకు ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ రెండు స్థానాలను కోల్పోయింది. ఇందులో ఖజురహో, ఇండోర్ సీట్లు ఉన్నాయి. ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఇది మరో ఎదురుదెబ్బ. సూరత్ లోక్‌సభ స్థానంలో ఓటు వేయకుండానే ఈ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లింది.

Congress Confusion: అమేథీలో రాహుల్‌గాంధీ.. రాయ్‌బరేలిలో ప్రియాంకాగాంధీ.. నేతల పోటీపై కాంగ్రెస్‌ డైలామా!

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాలపైనే ప్రస్తుతం అందరి దృష్టి పడింది. ఎన్నికల నామినేషన్ల పర్వం సమీపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ రెండు స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనేది కాంగ్రెస్ తేల్చలేకపోయింది. . దీంతో అమేథీ, రాయ్‌బరేలీలో ఎవరు పోటీ చేస్తారన్నదీ ఉత్కంఠగా మారింది.

BJP Phasewise War: దశలవారీగా కాంగ్రెస్‌పై బీజేపీ యుద్ధం.. ఒక్కో విడతలో ఒక్కో అస్త్రం ప్రయోగం

దేశంలో 7 దశల వారీగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. మూడోసారి అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ దశలవారీగా కాంగ్రెస్‌పై ఎన్నికల యుద్ధం చేస్తోంది. ఒక్కో ఫేజులో ఒక్కో అస్త్రంతో కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Lok Sabha Election 2024 Phase 2 Voting LIVE: జమ్మూ సహా పలు రాష్ట్రాల్లో రెండో దశ పోలింగ్.. త్రిపుర-ఛత్తీస్‌గఢ్‌లో అత్యధిక ఓటింగ్

Lok Sabha Election 2024 Phase 2 Voting Live News and Updates in Telugu: దేశవ్యాప్తంగా రెండోదశ పోలింగ్‌ కొనసాగుతోంది. 13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాల్లో ఓటేసేందుకు ఉదయం 7 గంటల నుంచే బారులతీరారు. కేరళలో మొత్తం 20 స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది.

ECI Notice: ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. ఏప్రిల్ 29లోగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ విచారణ చేపట్టింది. మతం, కులం, వర్గం, భాష ప్రాతిపదికన విద్వేషం, విభజన సృష్టిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌లు ఆరోపించాయి. ఇద్దరికి నోటీసులు జారీ చేసిన కమిషన్ ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు సమాధానం కోరింది.

PM Modi: నామ్‌దార్లు.. కామ్‌దార్‌లను అవమానించడం కొత్తేమీ కాదు.. రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..

రాహుల్ గాంధీ తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కుల గణన గురించి మాట్లాడినప్పుడు మోదీ... కులం లేదు.. అంటారని.. మీరు OBC ఎలా ఉన్నారు?..అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ తరుణంలో తనపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. తనపై కాంగ్రెస్ “షెహజాదా” రాహుల్ గాంధీ చేసిన అవమానకరమైన వ్యాఖ్యల పట్ల ప్రజలు కలత చెందవద్దని, కోపగించవద్దని అభ్యర్థిస్తున్నానన్నారు

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఫుడ్‌ పాయిజన్‌.. ఇండియా కూటమి ర్యాలీలకు దూరం..

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ పర్యటన రద్దయ్యింది. రెండు రాష్ట్రాల్లోని సత్నా, రాంచీలో జరిగే ఇండియా కూటమి మెగా ర్యాలీకి రాహుల్‌ హాజరుకావాల్సి ఉండగా.. ఆయన అస్వస్థతకు గురయ్యారని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. దీంతో రెండు రాష్ట్రాల్లో ఆయన పర్యటన రద్దయ్యింది.

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే సీట్లు ఇవే.. రాహుల్ గాంధీ కీలక ప్రకటన

దేశం సంపదను మోదీ ముగ్గురు బడా వ్యాపారవేత్తల చేతిలో పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్‌గాంధీ. ఇండియా కూటమి అధికారం లోకి వస్తే ఆర్ధిక సర్వేతో కులగణన చేసి దళితులు , ఓబీసీలకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం...