AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వివాదాస్పదంగా మారిన మరో వైసీపీ ఎమ్మెల్యే ట్రాక్టర్ ర్యాలీ…

మొన్నటికి మొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చర్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారానికి దారి తీయగా.. తాజాగా మరో ఎమ్మెల్యే నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ కలకలం రేపుతోంది.

వివాదాస్పదంగా మారిన మరో వైసీపీ ఎమ్మెల్యే ట్రాక్టర్ ర్యాలీ...
Ravi Kiran
|

Updated on: Apr 24, 2020 | 12:15 PM

Share

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఎప్పుడు ఎవరికి వస్తోందో తెలియని పరిస్థితిని తీసుకువచ్చింది. కరోనా భయంతో జనాలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులకు తప్ప ఎవరూ కూడా బయటికి రాకూడదని ప్రభుత్వాలు గట్టిగా హెచ్చరిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా నిబంధనలను బేఖాతర్ చేస్తే వారిపై కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే కొందరు నేతల తీరు మాత్రం పూర్తి విరుద్దంగా ఉంది. అందులోనూ ఏపీలో కొందరు నేతలు సామాజిక దూరాన్ని కూడా పాటించకుండా లాక్ డౌన్ రూల్స్‌ను అతిక్రమిస్తున్నారు. పేదలకు సాయం చేయడంలో గుంపులుగా వెళ్తుండటంతో అదే కరోనా వైరస్ వ్యాప్తికి దారి తీస్తోంది.

మొన్నటికి మొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చర్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారానికి దారి తీయగా.. తాజాగా మరో ఎమ్మెల్యే నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ కలకలం రేపుతోంది. సూళ్లురుపేటలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ సందర్భంగా ఎమ్మెల్యేసంజీవయ్య ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సమయంలో పోలీసులు, రెవిన్యూ అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు.. ఇలా అందరూ కూడా ఉండటంతో భారీగా జనాలు తరలి వస్తున్నారు. కాగా, ఏపీలో ఇప్పటికే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కరోనా పాజిటివ్‌ తేలుతోంది. ఫలితంగా ఎమ్మెల్యేలు వైరస్ వ్యాపించడంలో కారణం అవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి చదవండి:

మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..

భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్ కోసం.. ఏపీలో సడలింపులు ఇవే.!

ముస్లిం ఇచ్చాడని వద్దన్నాడు.. జైలు పాలయ్యాడు..

చైనాకు కొత్త తలనొప్పి.. కోటి జనాభా ఉన్న సిటీ లాక్‌డౌన్‌..