AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిక్కోలు జిల్లాకు క‌రోనా సెగ‌..!

ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. రెండు జిల్లాలో రాష్ట్రంలో వైర‌స్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. తాజాగా సిక్కోలు జిల్లాలో ఒక‌రికి క‌రోనా సోకింద‌నే వార్త‌ ఒక్క‌సారిగా షాక్‌కు గురిచేసింది.

సిక్కోలు జిల్లాకు క‌రోనా సెగ‌..!
Jyothi Gadda
|

Updated on: Apr 24, 2020 | 12:19 PM

Share
ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. రెండు జిల్లాలో రాష్ట్రంలో వైర‌స్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. తాజాగా సిక్కోలు జిల్లాలో ఒక‌రికి క‌రోనా సోకింద‌నే వార్త‌లు ఒక్క‌సారిగా షాక్‌కు గురిచేసింది.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌రాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రమే ఇప్పటి వరకూ కోవిడ్ కేసలు నమోదు కాలేదు. కాగా కరోనా కలకలంతో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలానికి చెందిన ఓ యువకుడు ఢిల్లీలో రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. ర్యాపిడ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ రావడంతో.. ట్రూనాట్ పరికరం ద్వారా రిమ్స్‌లో మరోసారి పరీక్షించేందుకు ఆ వ్యక్తిని శ్రీకాకుళం తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. మార్చి నెలలో ఢిల్లీ నుంచి వచ్చిన అతడు అధికారుల సూచనల మేరకు 14 రోజులపాటు అత్తారింట్లో క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్ ముగిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి కొందరిని కలిసినట్లు సమాచారం. ఆయనకు భార్య, చిన్న బాబు ఉన్నారు.
కాగా సదరు వ్యక్తికి కరోనా నిర్ధారణ కాలేదని కూడా ప్రచారం జరుగుతోంది. పరీక్షల్లో కరోనా సస్పెక్టెడ్ అని మాత్రమే వచ్చిందని.. కరోనా నిర్ధారణ కాలేదని చెబుతున్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని.. అధికారులు చెబుతున్నారు. శాంపిళ్లను కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలోని ల్యాబ్‌కు పంపించామని, రిపోర్టులు రావాల్సి ఉందని జిల్లా అధికారులు తెలిపారు.