AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం గారూ.. మద్యం షాపులు తెరవండి ప్లీజ్.. ఆదాయం వస్తుంది..

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపధ్యంలో మద్యం షాపులన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరికి కొందరు వింత వింతగా ప్రవర్తించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మద్యం అమ్మకాలు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధికంగా నష్టం జరగడం మరో ఎత్తు. ముఖ్యంగా లిక్కర్ సేల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం భారీగా వస్తుంది. అలాంటిది కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మద్యం షాపులు […]

సీఎం గారూ.. మద్యం షాపులు తెరవండి ప్లీజ్.. ఆదాయం వస్తుంది..
Ravi Kiran
|

Updated on: Apr 25, 2020 | 2:46 PM

Share

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ నేపధ్యంలో మద్యం షాపులన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఖరికి కొందరు వింత వింతగా ప్రవర్తించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మద్యం అమ్మకాలు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధికంగా నష్టం జరగడం మరో ఎత్తు. ముఖ్యంగా లిక్కర్ సేల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం భారీగా వస్తుంది. అలాంటిది కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా మద్యం షాపులు మూతపడటంతో ఆదాయం శూన్యం అయింది.

ఇక అటు లాక్ డౌన్ వేళ అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగుతుండటంతో ఆల్ ఇండియా లిక్కర్ సమాఖ్య విడతల వారీగా మద్యం దుకాణాలను తెరవాలని దాదాపు 10 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసిన విషయం విదితమే. ఇదిలా ఉంటే ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ధాక్రే లాక్ డౌన్ సమయంలో.. సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించేలా చేసి మద్యం దుకాణాలు తెరవాలంటే మహా సీఎం ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎంతో అవసరం అని ఆయన లేఖలో పేర్కొన్నారు. కాగా, మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్న సందర్భంలో రాజ్ ధాక్రే రాసిన లేఖ చర్చనీయాంశంగా మారింది.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.

రంజాన్‌ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోండి.. ముస్లింలకు ఓవైసీ విజ్ఞప్తి..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం..

రంజాన్ వేళ.. ముస్లింలకు తీపి కబురు.. ఏపీలో కొన్ని సడలింపులు..

ఇకపై బాల్ ట్యాంపరింగ్ చేయవచ్చు .. ఐసీసీ సరికొత్త ఆలోచన..!