AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

వలస కూలీల తరలింపుపై కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. లాక్‌డౌన్‌కు ముందు వేరే ప్రాంతాలకు వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయిన వాళ్లకు వెళ్లేందుకు అనుమతి ఉందని పేర్కొంది. ఈ కేటగిరిలోకి వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్ధులు వస్తారని స్పష్టం చేసింది. అంతేకానీ ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో నివాసం ఏర్పర్చుకున్నవారికి, వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు […]

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..
Ravi Kiran
|

Updated on: May 04, 2020 | 11:03 AM

Share

వలస కూలీల తరలింపుపై కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు. లాక్‌డౌన్‌కు ముందు వేరే ప్రాంతాలకు వచ్చి లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయిన వాళ్లకు వెళ్లేందుకు అనుమతి ఉందని పేర్కొంది.

ఈ కేటగిరిలోకి వలస కార్మికులు, యాత్రికులు, విద్యార్ధులు వస్తారని స్పష్టం చేసింది. అంతేకానీ ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల్లో నివాసం ఏర్పర్చుకున్నవారికి, వేరే ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారికి, అలాగే మాములుగా స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వారి అనుమతి లేదని ఆ లేఖలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పేర్కొన్నారు. కాగా, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు తరలింపులు చేయాలని స్పష్టం చేసింది.

Read More: 

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..