AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలతో పాటు ఇన్సెంటీవ్స్‌ కూడా

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహకాలు..

ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలతో పాటు ఇన్సెంటీవ్స్‌ కూడా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 02, 2020 | 7:41 AM

Share

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనాన్ని చెల్లించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహకాలు (ఇన్సెంటీవ్స్) కూడా అందించాలని నిర్ణయించారు. అయితే ఈ ఇన్సెంటీవ్స్‌ ఎంత శాతం ఇవ్వాలనేది ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం ప్రకటించారు. తెలంగాణ లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను వాయిదా వేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే మార్చి నెల జీతంలో సగం జీతాన్ని ఇప్పుడు.. మిగతాది తర్వాత ఇవ్వనున్నారు. అలాగే ఈ లిస్టులో.. పోలీసులు, డాక్టర్లు ఉండరని.. వారికి ప్రత్యేకంగా జీతాలిస్తామని తాజాగా బుధవారం వెల్లడించారు తెలంగాణ సీఎం కేసీఆర్.

ఇవి కూడా చదవండి: 

మరో నటుడ్ని బలితీసుకున్న కరోనా.. శోక సంద్రంలో సినీ పరిశ్రమ

కరోనా ఎఫెక్ట్: స్థానికున్ని కొట్టి చంపిన యువకులు

కరోనా దెబ్బ.. మోదీ సర్కార్ భారీ అప్పు

లాక్‌డౌన్: మూగ జీవాలకు ప్రభుత్వం అండ.. రూ.54 లక్షలు నిధులు

కరోనా వైరస్: ప్రపంచంలో టాప్ 10 హై రిస్క్ అండ్ సేఫ్ కంట్రీస్ ఇవే!

వైన్స్‌‌ షాపులపై తప్పుడు ప్రచారం.. వ్యక్తి అరెస్ట్