విశాఖలో తొలి కరోనా మరణం…

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శ‌నివారం కొత్త‌గా మ‌రో 62 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1525కి చేరింది. అటు ఈ మహమ్మారి కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్నంలో తొలి కరోనా మరణం సంభవించింది. గురువారం నాడు 70 ఏళ్ల వృద్దుడు అనారోగ్యంతో కేజీహెచ్‌లో చేరగా.. వైద్యులు ఆయన్ని తాత్కాలిక ఐసోలేషన్ వార్డులో […]

విశాఖలో తొలి కరోనా మరణం...
Follow us

|

Updated on: May 02, 2020 | 2:15 PM

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శ‌నివారం కొత్త‌గా మ‌రో 62 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1525కి చేరింది. అటు ఈ మహమ్మారి కారణంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే తాజాగా విశాఖపట్నంలో తొలి కరోనా మరణం సంభవించింది. గురువారం నాడు 70 ఏళ్ల వృద్దుడు అనారోగ్యంతో కేజీహెచ్‌లో చేరగా.. వైద్యులు ఆయన్ని తాత్కాలిక ఐసోలేషన్ వార్డులో ఉంచి కరోనా పరీక్షలు నిర్వహించారు.

అయితే రిపోర్టు వచ్చేలోపే అనూహ్యంగా ఆ పెద్దాయన శుక్రవారం ఉదయం మృతి చెందారు. కిడ్నీ సమస్యతోనే చనిపోయాడు కాబట్టి మృతుని బంధువులు మృతదేహాన్ని చెంగలరావుపేటలోని తమ ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఆ తర్వాత కరోనా టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. దానిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో కేజీహెచ్ అధికారులు అప్రమత్తమయ్యారు. వృద్ధుడు చికిత్స పొందిన కేజీహెచ్ తాత్కాలిక ఐసొలేషన్ వార్డులో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్స్, శానిటేషన్ వర్కర్లను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచారు. కాగా, ప్రోటోకాల్ ప్రకారం వారందరికీ ఏడో రోజు, 14వ రోజున కరోనా టెస్టులు జరుపుతామని కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి డాక్టర్ అర్జున్ తెలిపారు. అంతేకాకుండా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది అందరూ కూడా పీపీఈ కిట్లు ధరించారు కాబట్టి వైరస్ వ్యాపించడని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.

Read More:

కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!

లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..

మందుబాబులకు గుడ్ న్యూస్.. లాక్ డౌన్ తర్వాత తెరుచుకోనున్న మద్యం షాపులు!

'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే