AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.. జాగ్రత్తగా ఉండండి: కర్ణాటక మంత్రి హెచ్చరిక

Covid-19 Second wave: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 30వేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే

కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.. జాగ్రత్తగా ఉండండి: కర్ణాటక మంత్రి హెచ్చరిక
Coronavirus Second Wave In Karnataka
Shaik Madar Saheb
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 22, 2021 | 10:10 AM

Share

Covid-19 Second wave: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో 30వేల కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఉద్ధవ్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించడంతోపాటు నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తోంది అయినప్పటకీ రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కె. సుధాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైపోయిందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. ఈ మేరకు సుధాకర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా ప్రజలందరూ అప్రమత్తతో మెలగాలని, లేదంటే మరోసారి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆయన హెచ్చరించారు. నిపుణుల హెచ్చరికలను పెడచెవిన పెడితే ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులకు ప్రజలు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ సుధాకర్ స్పష్టం చేశారు.

కరోనాపై పోరాటంలో రానున్న మూడు నెలలు కీలకం కానున్నాయని సుధాకర్ పేర్కొన్నారు. వైరస్‌ను నియంత్రించేందుకు మనమంతా చేతులు కలపాలని, దీనికి ప్రజల సహాకారం అవసరమని పేర్కొన్నారు. కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా బయట తిరిగే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ను నియంత్రించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు సైతం విధించింది. బెంగళూరు, బీదర్ లాంటి పట్టణాల్లో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. నైట్ పార్టీలను, సామూహిక కార్యక్రమాలను నిషేధించారు. కాగా గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో 1,715 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

Also Read:

Students Drown: విషాదం నింపిన సరదా.. సముద్రంలో స్నానానికి వెళ్లి విద్యార్థుల గల్లంతు.. ఇద్దరు మృతి

మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో