రాజస్థాన్‌లో విషాదం.. ఊపిరాడక ఐదుగురు పిల్లల మృతి

Five Children Death: రాజస్థాన్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఊపిరాడక ఐదుగురు పిల్లలు

రాజస్థాన్‌లో విషాదం.. ఊపిరాడక ఐదుగురు పిల్లల మృతి
Five Children Death In Bikaner
Follow us

|

Updated on: Mar 21, 2021 | 10:54 PM

Five Children Death: రాజస్థాన్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఊపిరాడక ఐదుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్రంలోని బికనీర్‌ జిల్లాలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం వేళ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఆటలాడుకుంటూ.. వెళ్లి ధాన్యం నిల్వ చేసే కంటైనర్‌లో పడి ఊపిరాడక చనిపోయారు. మృతిచెందిన చిన్నారులంతా 3 నుంచి 8 ఏండ్ల మధ్య వారే ఉన్నారు. మృతుల్లో నలుగురు బాలికలు, ఒక బాలుడు ఉన్నాడు.

అయితే.. కంటైనర్‌ దాదాపు ఖాళీగా ఉందని.. పిల్లలు ఆడుకుంటుండగా.. దానిలో పడ్డారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పైన మూత కూడా మూసుకుపోవడంతో ఊపిరాడక చనిపోయారని పోలీసులు వెల్లడించారు. పోలానికి వెళ్లొచ్చిన భీరామ్ దంపతులకు పిల్లలెవరూ కనిపించకపోవడంతో వెతికారు. ఈ క్రమంలో తల్లి కంటైనర్‌ను తెరవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతుల్లో నలుగురు పిల్లలు భీరామ్ దంపతుల పిల్లలు కాగా.. మరో బాలిక ఆయన మేనకోడలని పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలోని ఐదుగురు పిల్లల ప్రాణాలు పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Also Read

AADHAR CARD: పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ‘జీవన్ ప్రమాణ్’ కోసం ఆధార్ తప్పనిసరి కాదన్న కేంద్రం