AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే నెలలోనూ రేషన్ ఫ్రీ.. వలస కూలీలకు కూడా…

రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 3తో ముగియనుండగా.. దానితో సంబంధం లేకుండా రాష్ట్రంలో లాక్ డౌన్ మే 7 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే మే నెలలోనూ రేషన్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్దిదారులలో ప్రతీ వ్యక్తికీ 12 కిలోల బియ్యం, ప్రతీ కుటుంబానికి రూ. 1500 ఇస్తామని […]

మే నెలలోనూ రేషన్ ఫ్రీ.. వలస కూలీలకు కూడా...
Ravi Kiran
|

Updated on: Apr 19, 2020 | 10:13 PM

Share

రాష్ట్రంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 3తో ముగియనుండగా.. దానితో సంబంధం లేకుండా రాష్ట్రంలో లాక్ డౌన్ మే 7 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే మే నెలలోనూ రేషన్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్దిదారులలో ప్రతీ వ్యక్తికీ 12 కిలోల బియ్యం, ప్రతీ కుటుంబానికి రూ. 1500 ఇస్తామని చెప్పారు. మే తొలివారంలోనే రేషన్ పంపిణీ చేస్తామని, 7వ తేదీలోపే రూ. 1500 ఖాతాలో జమ చేస్తామన్నారు. అటు వలస కూలీలకు కూడా ఇదే విధంగా రేషన్, నగదు పంపిణీ చేస్తామన్నారు. ఆసరా పెన్షన్లు కూడా యధావిధిగా ఇస్తామన్నారు. మరోవైపు కరోనా ఆసుపత్రిగా ఉన్న గచ్చిబౌలీ స్పోర్ట్స్ కాంప్లెక్స్.. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ గా మరబోతుందన్నారు.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

వలస కార్మికులకు ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం..

ఈ కామర్స్ సంస్థలకు షాక్.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం

‘దేశద్రోహుల పట్ల నేనింతే’.. అఫ్రిదీకి గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..

Breaking: మే 7 వరకు తెలంగాణలో స్విగ్గీ, జోమాట బ్యాన్…