Coronavirus Outbreak: తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రాష్ట్రంలో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసులు 97 నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ఈ ఒక్క రోజు 15 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
అటు బాధితుల్లో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా.. 14 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 77 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలను చేపడుతోంది.
ఇవి చదవండి:
మద్యం ప్రియులకు శుభవార్త.. మూడు నెలలు బీర్లు ఫ్రీ.. ఫ్రీ..
EMIలపై కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన పలు బ్యాంకులు..
తెలంగాణ లాక్ డౌన్.. ఏప్రిల్ 14 వరకు మద్యం దుకాణాలు బంద్..